50 ఏళ్ల తర్వాత చంద్రుడి దిశగా మానవ యాత్ర.. NASA Artemis II mission సిద్ధం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
nASA Artemis II mission: అంతరిక్ష పరిశోధనలో మరో కీలక మైలురాయిని అందుకోవడానికి నాసా (NASA) సిద్ధమైంది. ‘ఆర్టెమిస్ II’ (Artemis II) మిషన్ ద్వారా 50 సంవత్సరాల తర్వాత మళ్లీ మనుషులను చంద్రుడి చుట్టూ పంపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ చారిత్రాత్మక ప్రయోగం ఏప్రిల్ 1న ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్లోని ప్యాడ్ 39B నుంచి జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:54 గంటలకు ప్రయోగం జరగనుంది. ప్రయోగానికి ముందు నిర్వహించే ట్యాంకింగ్ ఆపరేషన్స్ లో భాగంగా రాకెట్లో ఇంధనాన్ని నింపే ప్రక్రియను ఏప్రిల్ 1న సాయంత్రం 6:15 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఒకవేళ ఈ తేదీన ప్రయోగం జరగకపోతే.. ఏప్రిల్ 6 వరకు లోపు, లేదా అది కూడా కుదరకపోతే ఏప్రిల్ 30న ప్రయోగించనున్నారు.
ఎండాకాలంలో చల్లటి న్యూస్.. Godrej 1.5 Ton ఇన్వర్టర్ ఏసీపై రూ. 13,000 భారీ డిస్కౌంట్..!
Also Read
- Monsoon 2026: అన్నదాతలకు శుభవార్త.. ఎట్టకేలకు పుంజుకున్న రుతుపవనాలు.. ఈ తేదీల్లో వర్షాలు!
- Venkaiah Naidu: యోగాను మతంతో ముడిపెట్టడం మూర్ఖత్వం..
- Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్చేస్తే..
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
ఈ మిషన్ లో మొత్తం నలుగురు వ్యోమగాములు పాల్గొంటున్నారు. రీడ్ విలియమ్స్ కమాండర్ గా, విక్టర్ గ్లోవర్ పైలట్గా, క్రిస్టినా కొచ్ మిషన్ స్పెషలిస్టుగా, అలాగే కెనడా స్పేస్ ఏజెన్సీకి చెందిన జెరెమీ హాన్సెన్ సభ్యుడిగా ఉంటారు. ఈ ప్రయోగం అనంతరం స్పేస్ క్రాఫ్ట్ మొదట “లో ఎర్త్ ఆర్బిట్”లోకి ప్రవేశించి.. దాదాపు 24 గంటల తర్వాత ‘ట్రాన్స్-లూనార్ ఇంజెక్షన్’ ద్వారా చంద్రుడి వైపు ప్రయాణం ప్రారంభిస్తుంది. ఈ మిషన్ లో ముఖ్య ఘట్టం ఏప్రిల్ 6న చంద్రుడి చుట్టూ “ఫ్లైబై” చేయడం. ఈ సందర్భంగా ప్రత్యక్ష ప్రసారం రాత్రి 11:15 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఒక గంటలోనే ఈ వ్యోమగాములు భూమికి అత్యంత దూరంగా ప్రయాణించిన మనుషులుగా రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటివరకు ఉన్న అపోలో-13 మిషన్ రికార్డును ఇప్పుడు అధిగమించే అవకాశం ఉంది.
Kavitha: సీఎం రేవంత్రెడ్డికి కవిత లేఖ.. నాడు కేసీఆర్కు రాసిన లేఖను గుర్తు చేసిన జాగృతి అధినేత్రి!
ఏప్రిల్ 7న ఈ మిషన్ లో ఉన్న వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని సిబ్బందితో ఆడియో సంభాషణ జరపనున్నారు. అనంతరం తిరుగు ప్రయాణం ఏప్రిల్ 8న ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 9న వ్యోమగాములు అంతరిక్షం నుంచే మీడియాతో మాట్లాడనున్నారు. ఈ మిషన్ ఏప్రిల్ 10న ముగియనుంది. పసిఫిక్ మహాసముద్రంలో శాన్ డియాగో తీరానికి సమీపంలో స్ప్లాష్ డౌన్ జరగనుంది. ఆ తరువాత అమెరికా నేవీకి చెందిన ప్రత్యేక నౌక ద్వారా వ్యోమగాములు, స్పేస్ క్రాఫ్ట్ ను సురక్షితంగా తీసుకువస్తారు. ఈ మిషన్ భవిష్యత్తులో చంద్రుడిపై మానవ నివాసాల ఏర్పాటుకు కీలక దశగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Dhanush: మృణాల్ ఠాకూర్ ప్రేమకు బ్రేక్? డేటింగ్ రూమర్స్ తర్వాత కొత్త ట్విస్ట్ ఇదేనా!
-
iQOO Z11i: iQOO Z11i త్వరలో లాంచ్.. Snapdragon 4 Gen 2 చిప్సెట్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
-
Monsoon 2026: అన్నదాతలకు శుభవార్త.. ఎట్టకేలకు పుంజుకున్న రుతుపవనాలు.. ఈ తేదీల్లో వర్షాలు!
-
Toxic Update : ‘టాక్సిక్’ మళ్లీ ట్రాక్లోకి.. యష్ ఫ్యాన్స్ కోసం వచ్చే వారం సాలిడ్ సర్ప్రైజ్?
-
Venkaiah Naidu: యోగాను మతంతో ముడిపెట్టడం మూర్ఖత్వం..
ట్రెండింగ్
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!