50 ఏళ్ల తర్వాత చంద్రుడి దిశగా మానవ యాత్ర.. NASA Artemis II mission సిద్ధం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
nASA Artemis II mission: అంతరిక్ష పరిశోధనలో మరో కీలక మైలురాయిని అందుకోవడానికి నాసా (NASA) సిద్ధమైంది. ‘ఆర్టెమిస్ II’ (Artemis II) మిషన్ ద్వారా 50 సంవత్సరాల తర్వాత మళ్లీ మనుషులను చంద్రుడి చుట్టూ పంపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ చారిత్రాత్మక ప్రయోగం ఏప్రిల్ 1న ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్లోని ప్యాడ్ 39B నుంచి జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:54 గంటలకు ప్రయోగం జరగనుంది. ప్రయోగానికి ముందు నిర్వహించే ట్యాంకింగ్ ఆపరేషన్స్ లో భాగంగా రాకెట్లో ఇంధనాన్ని నింపే ప్రక్రియను ఏప్రిల్ 1న సాయంత్రం 6:15 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఒకవేళ ఈ తేదీన ప్రయోగం జరగకపోతే.. ఏప్రిల్ 6 వరకు లోపు, లేదా అది కూడా కుదరకపోతే ఏప్రిల్ 30న ప్రయోగించనున్నారు.
ఎండాకాలంలో చల్లటి న్యూస్.. Godrej 1.5 Ton ఇన్వర్టర్ ఏసీపై రూ. 13,000 భారీ డిస్కౌంట్..!
Also Read
- Trump: “వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు”.. ఏలియన్స్ వెబ్సైట్ ప్రారంభించిన వైట్హౌస్
- Anti-Ageing Plan: అమరత్వం కోసం పుతిన్ భారీ ప్లాన్.. ఏం చేస్తున్నాడంటే..
- Iran-US: ఇరాన్ యురేనియం నిల్వలపై షాకింగ్ నివేదిక.. అమెరికా ఏం చేయబోతోంది?
- Vaibhav Sooryavanshi: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం స్పష్టిస్తున్న బుడ్డోడు..
ఈ మిషన్ లో మొత్తం నలుగురు వ్యోమగాములు పాల్గొంటున్నారు. రీడ్ విలియమ్స్ కమాండర్ గా, విక్టర్ గ్లోవర్ పైలట్గా, క్రిస్టినా కొచ్ మిషన్ స్పెషలిస్టుగా, అలాగే కెనడా స్పేస్ ఏజెన్సీకి చెందిన జెరెమీ హాన్సెన్ సభ్యుడిగా ఉంటారు. ఈ ప్రయోగం అనంతరం స్పేస్ క్రాఫ్ట్ మొదట “లో ఎర్త్ ఆర్బిట్”లోకి ప్రవేశించి.. దాదాపు 24 గంటల తర్వాత ‘ట్రాన్స్-లూనార్ ఇంజెక్షన్’ ద్వారా చంద్రుడి వైపు ప్రయాణం ప్రారంభిస్తుంది. ఈ మిషన్ లో ముఖ్య ఘట్టం ఏప్రిల్ 6న చంద్రుడి చుట్టూ “ఫ్లైబై” చేయడం. ఈ సందర్భంగా ప్రత్యక్ష ప్రసారం రాత్రి 11:15 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఒక గంటలోనే ఈ వ్యోమగాములు భూమికి అత్యంత దూరంగా ప్రయాణించిన మనుషులుగా రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటివరకు ఉన్న అపోలో-13 మిషన్ రికార్డును ఇప్పుడు అధిగమించే అవకాశం ఉంది.
Kavitha: సీఎం రేవంత్రెడ్డికి కవిత లేఖ.. నాడు కేసీఆర్కు రాసిన లేఖను గుర్తు చేసిన జాగృతి అధినేత్రి!
ఏప్రిల్ 7న ఈ మిషన్ లో ఉన్న వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని సిబ్బందితో ఆడియో సంభాషణ జరపనున్నారు. అనంతరం తిరుగు ప్రయాణం ఏప్రిల్ 8న ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 9న వ్యోమగాములు అంతరిక్షం నుంచే మీడియాతో మాట్లాడనున్నారు. ఈ మిషన్ ఏప్రిల్ 10న ముగియనుంది. పసిఫిక్ మహాసముద్రంలో శాన్ డియాగో తీరానికి సమీపంలో స్ప్లాష్ డౌన్ జరగనుంది. ఆ తరువాత అమెరికా నేవీకి చెందిన ప్రత్యేక నౌక ద్వారా వ్యోమగాములు, స్పేస్ క్రాఫ్ట్ ను సురక్షితంగా తీసుకువస్తారు. ఈ మిషన్ భవిష్యత్తులో చంద్రుడిపై మానవ నివాసాల ఏర్పాటుకు కీలక దశగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Honor X80: 10,000mAh భారీ బ్యాటరీతో హానర్ X80 వచ్చేస్తోంది.. పవర్ఫుల్ ఫీచర్లు హైలైట్!
-
Jagapathi Babu: “నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం రాదు.. ఆ విషయంలో నేను జీరో”: జగపతి బాబు
-
Kitchen Hacks : మిక్సీ జార్ వేడెక్కుతుందా..? ఈ చిన్న తప్పే మసాలా రుచి పాడుచేస్తోంది.!
-
Trump: “వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు”.. ఏలియన్స్ వెబ్సైట్ ప్రారంభించిన వైట్హౌస్
-
Anti-Ageing Plan: అమరత్వం కోసం పుతిన్ భారీ ప్లాన్.. ఏం చేస్తున్నాడంటే..
ట్రెండింగ్
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?