Anant Ambani Wedding: ఆహ్వానం లేకుండా అనంత్ అంబానీ పెళ్లికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్..
- ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం
- పెళ్లిలో భారీ భద్రతా ఏర్పాట్లు
- ఆహ్వానం లేకుండా భారీ భద్రతను ఉల్లంఘించి వివాహ వేదిక హాజరైన ఇద్దరు వ్యక్తులు
- ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారిగా గుర్తింపు
- వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పెళ్లిని చూసేందుకు అందరూ తహతహలాడారు. అలాంటి పరిస్థితిలో.. ఇద్దరు వ్యక్తులు ఆహ్వానం లేకుండా పెళ్లికి చేరుకున్నారు. వారిద్దరూ భారీ భద్రతను ఉల్లంఘించి వివాహ వేదిక జియో వరల్డ్ సెంటర్లోకి ప్రవేశించారు. విషయం తెలియగానే పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
READ MORE: Hyderabad Rains: హైదరాబాద్లో కుండపోత వర్షం.. గంట నుంచి ఎడతెరిపి లేని వాన
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
అనుమతి లేకుండా ప్రవేశించిన వారిలో ఒకరు యూట్యూబర్ వెంకటేష్ నర్సయ్య అల్లూరి కాగా, మరొకరు వ్యాపారవేత్తగా చెప్పుకుంటున్న లుక్మాన్ మహమ్మద్ షఫీ షేక్ ఉన్నారు. ముంబైకి చెందిన బీకేసీ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిపై ప్రత్యేక కేసులు నమోదు చేశారు. ఓ వ్యక్తి పెళ్లికి హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. రెండు కేసుల్లో చట్టపరమైన చర్యలు తీసుకున్న పోలీసులు నిందితులకు నోటీసులు జారీ చేశారు. అనంతరం వారిని విడుదల చేశారు.
READ MORE:Delhi: ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రిలో పట్టపగలు కాల్పులు.. రోగి అక్కడికక్కడే మృతి
పెళ్లిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీతో అంబానీ కుటుంబ సభ్యులందరూ పెళ్లికి హాజరయ్యారు. ఈవెంట్ సమయంలో ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఆపరేషన్ సిస్టమ్ (ISOS) సెటప్ చేశారు. ఈవెంట్ భద్రతా ఆపరేషన్ ఈ ISOS కేంద్రం నుంచి పర్యవేక్షించబడుతుంది. 60 మంది భద్రతా బృందంలో 10 మంది ఎన్ఎస్జి కమాండోలు, పోలీసు అధికారులు ఉన్నారు. 200 మంది అంతర్జాతీయ భద్రతా సిబ్బందిని నియమించనున్నారు. 300 మంది సెక్యూరిటీ సభ్యులు ఉన్నారు. బీకేసీలో 100 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులు, ముంబై పోలీసు సిబ్బందిని మోహరించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!