AP Elections 2024 Results: గుంటూరు జిల్లాలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి.. పల్నాడులో భారీ బందోబస్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024 Results: ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలకు రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.. పల్నాడు జిల్లా కౌంటింగ్ నరసరావుపేటలోని జేఎన్టీయూ కళాశాలలో, గుంటూరు జిల్లా కౌంటింగ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో , బాపట్ల జిల్లా కౌంటింగ్కు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు.. ప్రతి జిల్లాలో 2000 మందికి తగ్గకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.. గుంటూరు జిల్లాలో 2500 మంది పోలీసులతో పోలీస్ పహార ఏర్పాటు చేయగా.. అత్యధికంగా పల్నాడు జిల్లాలో 3000 మందికి పైగా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి అసెంబ్లీ స్థానానికి 14 టేబుళ్లతో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు.. నియోజకవర్గ ఓటర్లను బట్టి గరిష్టంగా 22 రౌండ్లు కౌంటింగ్ జరిగే అవకాశం ఉండగా.. అసెంబ్లీ స్థానానికి, పార్లమెంటు స్థానానికి, ప్రత్యేక హాళ్లు కేటాయించారు అధికారులు.. ఎంపీ స్థానానికి, ఎమ్మెల్యే స్థానానికి ప్రత్యేకంగా టేబుళ్లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
Read Also: Mobile Wallet: ఫోన్ ల వెనుక వాలెట్ వాడుతున్నారా.. ఎంత డేంజరో తెలుసా?
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
ఇక, రేపు ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ల ఓట్ల లెక్కింపుతో ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ.. ఎనిమిదిన్నర గంటలకు ఈవీఎంలలో ఉన్న ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లాలో తొలి ఫలితం తాడికొండ, పల్నాడు జిల్లాలో తొలి ఫలితం చిలకలూరిపేట నుండి వెలువడే అవకాశం ఉందంటున్నారు. అత్యధికంగా గురజాల నియోజకవర్గంలో 304 పోలింగ్ బూతులు ఉండగా.. గురజాల కౌంటింగ్ అధిక సమయం కొనసాగగనుంది. పల్నాడు జిల్లాలో మొత్తం 230 టేబుళ్లు ఏర్పాటు చేశారు.. ఒక్కొక్క రౌండ్ లెక్కింపు 25 నుండి 30 నిమిషాలు సమయం పట్టే అవకాశం ఉంది.. పల్నాడు జిల్లాలో 1300 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొనబోతున్నారు.. గుంటూరు జిల్లాలో 1500 మంది వరకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు సిబ్బంది.. బాపట్ల లోను 1500 మంది తో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది.. బాపట్ల జిల్లాలో తొలి ఫలితం బాపట్ల నియోజకవర్గం నుండి వచ్చే అవకాశం ఉంది.. ఇక, ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద 400 నుండి 500 మంది సాయుధ బలగాలు, పోలీసులతో ప్రత్యేక పహారా ఏర్పాటు చేశారు అధికారులు.
తాజావార్తలు
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
-
TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
-
Peddi: ‘పెద్ది’ ట్రైలర్లో.. సమంతను గుర్తు చేస్తున్న జాన్వీ
-
Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
-
Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!