Robinhood: ఏటీఎం కార్డుల మార్పిడితో ప్రజలను మోసం చేసిన ఆర్మీ జవాను.. చివరకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం., తన గ్రామంలో ఎటిఎం అని పిలువబడే రాజేంద్ర కుమార్ మీనా అనే నిందితుడిని గతంలో ఇలాంటి కేసులో అరెస్టు చేశారు. ఆయన భారత సైన్యంలో 18 సంవత్సరాలు పనిచేశారు. రాజస్థాన్లోని తన గ్రామంలో “రాబిన్ హుడ్” గా ప్రసిద్ధి చెందిన మాజీ సైనికుడిని ఎటిఎం కార్డులను మర్చి ప్రజలను మోసం చేసినందుకు ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు.
Also Read
- OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- 5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- 8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
అతను ఎటిఎం మెషీన్లో కొన్ని పరికరాలను ఏర్పాటు చేసి.. కియోస్క్ వద్ద లక్ష్యం కోసం వేచి ఉండేవాడు. ఎవరైనా కస్టమర్ డబ్బు విత్ డ్రా చేయడానికి వచ్చినప్పుడల్లా, వారి లావాదేవీని తిరస్కరించేలా చేసి.. ఆ తరువాత, మీనా వారి ఎటిఎం కార్డును మరొక కార్డుతో మార్పిడి చేసి., బాధితుడి ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి ప్లాన్ చేసే వాడని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (సెంట్రల్) ఎం హర్ష వర్ధన్ చెప్పారు.
మీనా అరెస్టుతో హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ అంతటా ఇలాంటి 17 కేసులు పరిష్కారమయ్యాయని డిసిపి తెలిపారు. అతనిపై నమోదైన దొంగతనం, ఇతర క్రిమినల్ కేసుల ఆరోపణలపై అతన్ని సైన్యం నుండి తొలగించారు. దొంగిలించిన మొత్తాన్ని తన గ్రామంలోని పేద ప్రజలకు సహాయం చేయడానికి ఉపయోగించినట్లు నిందితుడు అంగీకరించాడు. మీనా రాజస్థాన్లోని నీమ్ కా థానా జిల్లాలోని న్యోరానా గ్రామంలో.. “రాబిన్ హుడ్” గా ప్రసిద్ది చెందాడు. పేదలకు సహాయం చేయడానికి చాలా డబ్బు ఖర్చు చేశాడని డిసిపి తెలిపారు. మీనా తన గ్రామం నుంచి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేయాలని యోచిస్తున్నట్లు అధికారి తెలిపారు.
అతని నుంచి 192 ఏటీఎం కార్డులు, 24,000 నగదు, ఒక బంగారు చెవిపోగును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ విషయం మే 5 న వెలుగులోకి వచ్చింది. కరోల్ బాగ్ పోలీస్ స్టేషన్ లో మోసం జరిగిన సంఘటన నమోదైంది. అందులో ఫిర్యాదుదారుడు ఏప్రిల్ 16 న గఫర్ మార్కెట్లోని ఒక ప్రైవేట్ బ్యాంకులో తన ఎటిఎం కార్డును ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మార్చుకున్నట్లు పేర్కొన్నాడు. ఈ సంఘటనలో మోసగాడు ట్యాంక్ రోడ్ కరోల్ బాగ్ వద్ద ఉన్న మరొక బ్యాంకు ఎటిఎం నుండి తన ఖాతా నుండి 22,000 నగదును ఉపసంహరించుకున్నాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారని డిసిపి తెలిపారు.
సంఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలో అనుమానితుల కదలికలను ఈ బృందం తనిఖీ చేసిందని, ఆ సమయంలో అతని మార్గాన్ని గుర్తించడానికి వివిధ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించామని ఆయన చెప్పారు. “సీసీటీవీ కెమెరాల విశ్లేషణలో, నిందితుడిని రాజేంద్ర కుమార్ మీనా అలియాస్ ఎటిఎంగా గుర్తించారు.
తాజావార్తలు
-
Shankar & Murugadoss : మురుగదాస్ స్టోరీతో శంకర్ దర్శకత్వంలో సినిమా?
-
OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
-
Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
-
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలలో థ్రిల్లర్ల నుంచి ప్రేమ కథల వరకు చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే..
-
Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!