Robinhood: ఏటీఎం కార్డుల మార్పిడితో ప్రజలను మోసం చేసిన ఆర్మీ జవాను.. చివరకు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం., తన గ్రామంలో ఎటిఎం అని పిలువబడే రాజేంద్ర కుమార్ మీనా అనే నిందితుడిని గతంలో ఇలాంటి కేసులో అరెస్టు చేశారు. ఆయన భారత సైన్యంలో 18 సంవత్సరాలు పనిచేశారు. రాజస్థాన్లోని తన గ్రామంలో “రాబిన్ హుడ్” గా ప్రసిద్ధి చెందిన మాజీ సైనికుడిని ఎటిఎం కార్డులను మర్చి ప్రజలను మోసం చేసినందుకు ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు.
Also Read
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
అతను ఎటిఎం మెషీన్లో కొన్ని పరికరాలను ఏర్పాటు చేసి.. కియోస్క్ వద్ద లక్ష్యం కోసం వేచి ఉండేవాడు. ఎవరైనా కస్టమర్ డబ్బు విత్ డ్రా చేయడానికి వచ్చినప్పుడల్లా, వారి లావాదేవీని తిరస్కరించేలా చేసి.. ఆ తరువాత, మీనా వారి ఎటిఎం కార్డును మరొక కార్డుతో మార్పిడి చేసి., బాధితుడి ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి ప్లాన్ చేసే వాడని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (సెంట్రల్) ఎం హర్ష వర్ధన్ చెప్పారు.
మీనా అరెస్టుతో హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ అంతటా ఇలాంటి 17 కేసులు పరిష్కారమయ్యాయని డిసిపి తెలిపారు. అతనిపై నమోదైన దొంగతనం, ఇతర క్రిమినల్ కేసుల ఆరోపణలపై అతన్ని సైన్యం నుండి తొలగించారు. దొంగిలించిన మొత్తాన్ని తన గ్రామంలోని పేద ప్రజలకు సహాయం చేయడానికి ఉపయోగించినట్లు నిందితుడు అంగీకరించాడు. మీనా రాజస్థాన్లోని నీమ్ కా థానా జిల్లాలోని న్యోరానా గ్రామంలో.. “రాబిన్ హుడ్” గా ప్రసిద్ది చెందాడు. పేదలకు సహాయం చేయడానికి చాలా డబ్బు ఖర్చు చేశాడని డిసిపి తెలిపారు. మీనా తన గ్రామం నుంచి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేయాలని యోచిస్తున్నట్లు అధికారి తెలిపారు.
అతని నుంచి 192 ఏటీఎం కార్డులు, 24,000 నగదు, ఒక బంగారు చెవిపోగును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ విషయం మే 5 న వెలుగులోకి వచ్చింది. కరోల్ బాగ్ పోలీస్ స్టేషన్ లో మోసం జరిగిన సంఘటన నమోదైంది. అందులో ఫిర్యాదుదారుడు ఏప్రిల్ 16 న గఫర్ మార్కెట్లోని ఒక ప్రైవేట్ బ్యాంకులో తన ఎటిఎం కార్డును ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మార్చుకున్నట్లు పేర్కొన్నాడు. ఈ సంఘటనలో మోసగాడు ట్యాంక్ రోడ్ కరోల్ బాగ్ వద్ద ఉన్న మరొక బ్యాంకు ఎటిఎం నుండి తన ఖాతా నుండి 22,000 నగదును ఉపసంహరించుకున్నాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారని డిసిపి తెలిపారు.
సంఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలో అనుమానితుల కదలికలను ఈ బృందం తనిఖీ చేసిందని, ఆ సమయంలో అతని మార్గాన్ని గుర్తించడానికి వివిధ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించామని ఆయన చెప్పారు. “సీసీటీవీ కెమెరాల విశ్లేషణలో, నిందితుడిని రాజేంద్ర కుమార్ మీనా అలియాస్ ఎటిఎంగా గుర్తించారు.
తాజావార్తలు
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
-
Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
-
GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
-
Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!