Tejas Fighter Jet Deal: తేజస్ యుద్ధ విమానాల ఒప్పందం.. భారత్కు అర్జెంటీనా ఏం ఇస్తుందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejas Fighter Jet Deal: తేజస్ యుద్ధ విమానాల ఒప్పందంపై భారత్, అర్జెంటీనా శరవేగంగా కసరత్తు చేస్తున్నాయి. అర్జెంటీనా అభ్యర్థన మేరకు, తేజస్లో అమర్చిన బ్రిటిష్ భాగాలను మార్చే పనిని కూడా భారత్ ప్రారంభించింది. ఇదిలా ఉంటే అర్జెంటీనా కూడా భారతదేశం యొక్క తేలికపాటి యుటిలిటీ హెలికాప్టర్, ఆకాష్ క్షిపణి వ్యవస్థపై కన్నేసింది. అయితే ఈ ఒప్పందం కోసం చాలా చర్చలు జరగాల్సి ఉంది. వీటన్నింటి మధ్య అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్ 18వ జీ20 సదస్సులో పాల్గొనేందుకు భారత్కు రానున్నారు. జీ20 సదస్సుకు హాజరు కావాల్సిందిగా అర్జెంటీనాకు భారత్ ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది. ఆయన భారత పర్యటనకు ముందు, వ్యూహాత్మక రంగాలలో ముఖ్యంగా రక్షణ, మైనింగ్, లిథియం రంగాలలో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారంపై చర్చలు ముమ్మరంగా జరగనున్నాయి.
అర్జెంటీనా భారత్కు లిథియం సరఫరా చేస్తుంది!
అర్జెంటీనా ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద లిథియం ఉత్పత్తిదారు. ఇది కాలక్రమేణా దాని లిథియం ఉత్పత్తిని వేగంగా పెంచుతోంది. భారతదేశం తన ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. దీని కోసం ముఖ్యంగా కావాల్సిన ఖనిజం లిథియం. ఇది బ్యాటరీల తయారీలో ఉపయోగించబడుతుంది. గని నుంచి లిథియం వెలికితీసి తర్వాత ఎగుమతి చేయడంలో భారత్ సహాయం కావాలని అర్జెంటీనా కోరుతోంది. ఇది అర్జెంటీనాతో పాటు భారత్కు ప్రయోజనం చేకూరుస్తుంది.
Also Read
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
భారత్తో కొనసాగుతున్న చర్చలు
భారత్, అర్జెంటీనా మధ్య హై ప్రొఫైల్ సమావేశాల రౌండ్ ప్రారంభమైంది. బ్యూనస్ ఎయిర్స్లోని భారత రాయబారి దినేష్ భాటియా గత కొద్ది రోజులుగా ముఖ్యమైన సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇందులో కాసా రోడాసాలో అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్తో సమావేశాలు కూడా ఉన్నాయి. కాసా రోసాడా అనేది అర్జెంటీనా అధ్యక్షుని కార్యాలయం. ఆగస్టు 24న, బ్రిక్స్ గ్రూపులో చేరనున్న ఆరు కొత్త దేశాల జాబితాలో అర్జెంటీనా చేర్చబడింది. ఇప్పటి వరకు భారత్, రష్యా, బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా మాత్రమే ఈ గ్రూపులో సభ్యులుగా ఉన్నాయి. బ్రిక్స్ గ్రూపు విస్తరణ సమయంలో భారత్ మద్దతు ఇవ్వడం పట్ల అర్జెంటీనా సంతోషం వ్యక్తం చేసింది. అర్జెంటీనా అధ్యక్షుడే తమ దేశం అభివృద్ధికి ఏ అవకాశాన్ని వృథా చేయనివ్వమని చెప్పారు.
అర్జెంటీనా భారత్ను అగ్రగామిగా చూస్తోంది..
అర్జెంటీనా భారతదేశాన్ని గ్లోబల్ సౌత్ నాయకుడిగా చూస్తోంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ దేశాల ఎజెండాపై పని చేయడానికి సుముఖతను ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుత జీ20 అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారతదేశం గ్లోబల్ సౌత్ కోసం గట్టిగా వాదించింది. అర్జెంటీనా అధ్యక్షుడు ఫెర్నాండెజ్ భారత పర్యటనకు ముందు, భారత రాయబారి దినేష్ భాటియా బుధవారం అర్జెంటీనా వ్యూహాత్మక వ్యవహారాల కార్యదర్శి మెర్సిడెస్ మార్కో డెల్ పాంట్తో వ్యూహాత్మక రంగాలలో కొనసాగుతున్న సహకారంపై కొన్ని ముఖ్యమైన చర్చలు జరిపారు.
తాజావార్తలు
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్లో భారీ హైప్
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!