Tejas Fighter Jet Deal: తేజస్ యుద్ధ విమానాల ఒప్పందం.. భారత్కు అర్జెంటీనా ఏం ఇస్తుందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejas Fighter Jet Deal: తేజస్ యుద్ధ విమానాల ఒప్పందంపై భారత్, అర్జెంటీనా శరవేగంగా కసరత్తు చేస్తున్నాయి. అర్జెంటీనా అభ్యర్థన మేరకు, తేజస్లో అమర్చిన బ్రిటిష్ భాగాలను మార్చే పనిని కూడా భారత్ ప్రారంభించింది. ఇదిలా ఉంటే అర్జెంటీనా కూడా భారతదేశం యొక్క తేలికపాటి యుటిలిటీ హెలికాప్టర్, ఆకాష్ క్షిపణి వ్యవస్థపై కన్నేసింది. అయితే ఈ ఒప్పందం కోసం చాలా చర్చలు జరగాల్సి ఉంది. వీటన్నింటి మధ్య అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్ 18వ జీ20 సదస్సులో పాల్గొనేందుకు భారత్కు రానున్నారు. జీ20 సదస్సుకు హాజరు కావాల్సిందిగా అర్జెంటీనాకు భారత్ ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది. ఆయన భారత పర్యటనకు ముందు, వ్యూహాత్మక రంగాలలో ముఖ్యంగా రక్షణ, మైనింగ్, లిథియం రంగాలలో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారంపై చర్చలు ముమ్మరంగా జరగనున్నాయి.
అర్జెంటీనా భారత్కు లిథియం సరఫరా చేస్తుంది!
అర్జెంటీనా ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద లిథియం ఉత్పత్తిదారు. ఇది కాలక్రమేణా దాని లిథియం ఉత్పత్తిని వేగంగా పెంచుతోంది. భారతదేశం తన ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. దీని కోసం ముఖ్యంగా కావాల్సిన ఖనిజం లిథియం. ఇది బ్యాటరీల తయారీలో ఉపయోగించబడుతుంది. గని నుంచి లిథియం వెలికితీసి తర్వాత ఎగుమతి చేయడంలో భారత్ సహాయం కావాలని అర్జెంటీనా కోరుతోంది. ఇది అర్జెంటీనాతో పాటు భారత్కు ప్రయోజనం చేకూరుస్తుంది.
Also Read
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
- Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
- Peddi Ticket Prices Hike: 'పెద్ది' సినిమా టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్.. రోజుకు 5 షోలకు అనుమతి.!
భారత్తో కొనసాగుతున్న చర్చలు
భారత్, అర్జెంటీనా మధ్య హై ప్రొఫైల్ సమావేశాల రౌండ్ ప్రారంభమైంది. బ్యూనస్ ఎయిర్స్లోని భారత రాయబారి దినేష్ భాటియా గత కొద్ది రోజులుగా ముఖ్యమైన సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇందులో కాసా రోడాసాలో అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్తో సమావేశాలు కూడా ఉన్నాయి. కాసా రోసాడా అనేది అర్జెంటీనా అధ్యక్షుని కార్యాలయం. ఆగస్టు 24న, బ్రిక్స్ గ్రూపులో చేరనున్న ఆరు కొత్త దేశాల జాబితాలో అర్జెంటీనా చేర్చబడింది. ఇప్పటి వరకు భారత్, రష్యా, బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా మాత్రమే ఈ గ్రూపులో సభ్యులుగా ఉన్నాయి. బ్రిక్స్ గ్రూపు విస్తరణ సమయంలో భారత్ మద్దతు ఇవ్వడం పట్ల అర్జెంటీనా సంతోషం వ్యక్తం చేసింది. అర్జెంటీనా అధ్యక్షుడే తమ దేశం అభివృద్ధికి ఏ అవకాశాన్ని వృథా చేయనివ్వమని చెప్పారు.
అర్జెంటీనా భారత్ను అగ్రగామిగా చూస్తోంది..
అర్జెంటీనా భారతదేశాన్ని గ్లోబల్ సౌత్ నాయకుడిగా చూస్తోంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ దేశాల ఎజెండాపై పని చేయడానికి సుముఖతను ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుత జీ20 అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారతదేశం గ్లోబల్ సౌత్ కోసం గట్టిగా వాదించింది. అర్జెంటీనా అధ్యక్షుడు ఫెర్నాండెజ్ భారత పర్యటనకు ముందు, భారత రాయబారి దినేష్ భాటియా బుధవారం అర్జెంటీనా వ్యూహాత్మక వ్యవహారాల కార్యదర్శి మెర్సిడెస్ మార్కో డెల్ పాంట్తో వ్యూహాత్మక రంగాలలో కొనసాగుతున్న సహకారంపై కొన్ని ముఖ్యమైన చర్చలు జరిపారు.
తాజావార్తలు
-
Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
-
Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
-
Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
-
Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
-
DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!