Chicken: వైన్ షాపుల ముందు చికెన్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
- కుళ్ళిపోయిన చికెన్ అమ్ముతున్న గోడౌన్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు.. జీఎస్ఎంసీ అధికారులు దాడులు
- కుళ్ళిపోయిన 200 కేజీల చికెన్
- గోడౌన్ సీజ్ చేసిన అధికారులు
- గోడౌన్కు సంబంధించిన అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేవు
- బేగంపేట్.. ప్రకాష్ నగర్.. చికెన్ గోడౌన్లో టాస్క్ ఫోర్స్.. జీహెచ్ఎంసీ అధికారులు దాడులు.. తనిఖీలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైన్ షాపుకు వెళ్లామంటే.. చుక్కేయాలంటే ముక్క ఉండాల్సిందే. లేదంటే.. మందు గరం గరం ఉండి తాగలేకపోతారు. అందుకోసమని.. వైన్ షాపు ముందు పెట్టే చికెన్, చేపలు, గుడ్లు ఇలా ఏదొక నాన్ వెజ్ను తెచ్చుకుని కానించేస్తారు. తక్కువ ధరకు దొరుకుతుందని.. వైన్ షాపు ముందు పెట్టే చికెన్ను తిన్నారంటే అంతే సంగతులు.. ఎందుకంటే అది కుళ్లిన చికెన్. అది తింటే కడుపులోపల డైజేషన్ కాక.. వాంతులు, విరోచనాలు, మల విసర్జన లాంటివి అవుతుంటాయి. చికెన్ ఇంకొంచెం ఎక్కువగా పాడైతే మనిషి సీరియస్ కూడా అవుతాడు. అంతేకాకుండా.. ఆ చికెన్ తినడం వల్ల తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అసలు విషయానికొస్తే…
Also Read
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
హైదరాబాద్ నగరంలో కుళ్ళిపోయిన చికెన్ అమ్ముతున్న గోడౌన్ పై టాస్క్ఫోర్స్ పోలీసులు, జీఎస్ఎంసీ అధికారులు దాడులు నిర్వహించారు. కుళ్లిపోయిన 200 కేజీల చికెన్, గోడౌన్ను అధికారులు సీజ్ చేశారు. అంతేకాకుండా.. గోడౌన్ కు సంబంధించి అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేవు. బేగంపేట్, ప్రకాష్ నగర్ చికెన్ గోడౌన్లలో టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు దాడులు చేసి, తనిఖీలు నిర్వహించారు. చికెన్ గోడౌన్లలో కుళ్లిపోయిన చికెన్తో చిందరవందరగా ఉండడంతో అధికారులు అవాక్కయ్యారు.
Read Also: Cities disasters : మహానగరాలకే ఎందుకీ విపత్తులు..?
గోడౌన్ యజమాని బాలయ్య కుళ్ళిపోయిన చికెన్ను విక్రయిస్తున్నారని టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో.. టాస్క్ఫోర్స్ అధికారులు గోడౌన్లో 200 కేజీల కుళ్లిపోయిన చికెన్ను సీజ్ చేశారు. ఈ గోడౌన్కు సంబంధించిన అధికారుల నుండి ఫుడ్ లైసెన్స్ కూడా లేకుండా వ్యాపారం కొనసాగిస్తున్నారని అధికారులు తెలిపారు. హోల్సేల్ చికెన్ షాప్ అని రెగ్యులర్ కస్టమర్లకు తక్కువ ధరకు అమ్ముతున్నట్టు విచారణలో వెల్లడయ్యింది. చౌకగా చికెన్ రూ.50 కేజీ అనడంతో సిటీ ప్రాంతంలో ఉన్న అన్ని వైన్స్ షాపుల దగ్గర ఉన్న హోటళ్లలో ఇక్కడ నుంచి చికెన్ తీసుకువెళ్లి గుమగుమలాడే చికెన్ తయారు చేసి కస్టమర్లకు అమ్ముతున్నారు. ఈ కుళ్లిపోయిన చికెన్ తినడం వల్ల జనాలు అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి కుళ్ళిపోయిన చికెన్ అమ్ముతున్న యజమానులపై, షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!