Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Apsrtc To Run Special Bus Services To Pancharama Kshetras Sabarimala Arunachalam

APSRTC: వారికి గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ..

NTV Telugu Twitter
Published Date :November 13, 2023 , 12:03 pm
By Sudhakar Ravula
APSRTC: వారికి గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది కార్తీక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రాలకు వెళ్లే భక్తులతో పాటు.. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు.. అరుణాచం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్టు ప్రకటించింది.. కార్తీక మాసంలో శైవక్షేత్రాలకు భక్తుల తాకిడి ఉంటుంది.. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని.. ఒకే రోజు పంచారామ క్షేత్రాలను దర్శించేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది.. వారి కోసం ఈ నెల 19, 26 తేదీలతో పాటు డిసెంబర్‌ 3, 10 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు.. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పార్వతీపురంలో బస్సు బయల్దేరనుండగా.. సోమవారం ఉదయం అమరావతి- అమరేశ్వరుడు, భీమవరం- భీమేశ్వరుడు, పాలకొల్లు- క్షీర రామలింగేశ్వరుడు, ద్రాక్షారామం – భీమలింగేశ్వరుడు, సామర్లకోట- కుమార లింగేశ్వరుడిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్టు.. అల్ట్రా డీలక్స్‌లో ఒక్కొక్కరికి రూ.2,150 ఛార్జీగా నిర్ణయించినట్టు ప్రజా రవాణా అధికారి సుధాకర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Read Also: BJP vs BRS: నిజామాబాద్‌లో టెన్ష‌న్‌ టెన్ష‌న్‌.. 144 సెక్ష‌న్ అమ‌లు

ఇక, ఇప్పటికే అయ్యప్ప భక్తులు మాలలు వేశారు.. మండల దీక్షలను బట్టే ఇప్పటికే కొందరు శబరిమల వెళ్తుండగా.. చాలా మంది జ్యోతి దర్శనానికి వెళ్లనున్నారు.. అయితే, శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు ఆరు రోజుల యాత్ర సాగేలా ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది ఏపీఎస్ఆర్టీసీ.. కాణిపాకం, శ్రీపురం, అరుణాచలం, పళని, ఎరుమేలి, శబరిమల, మధురై, కంచి, తిరుపతి, విజయవాడలోని ప్రసిద్ధ ఆలయాల సందర్శనకు వీలుగా యాత్ర ప్లాన్‌ చేశారు.. ఈ టూర్‌ వెళ్లేవారి కోసం.. సూపర్‌ లగ్జరీకి రూ.7,300, అల్ట్రా డీలక్స్‌కు రూ.7,200లు ఛార్జీని నిర్ణయించారు..

Read Also: Mohammed Siraj Injury: మొహ్మద్ సిరాజ్‌కు గాయం.. భారత్-న్యూజీలాండ్ సెమీఫైనల్‌లో ఆడుతాడా?

మరోవైపు.. అరుణాచలం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తుంటారు.. తమిళనాడులోని అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు ఎంతో ప్రాధాన్యత ఉంది.. ఆ భక్తులకు అనుగుణంగా కడప జిల్లాలోని వివిధ డిపోల నుంచి ఈ నెల 26వ తేదీన ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది.. జమ్మలమడుగు డిపో నుంచి 26వ తేదీన బయల్దేరనున్న ఈ ప్రత్యేక బస్సు ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప, కాణిపాకం, గోల్డెన్‌ టెంపుల్‌ మీదుగా అరుణాచలం చేరుకోనుంది.. టిక్కెట్‌ ధర అప్‌ అండ్‌ డౌన్‌ రూ. 1557గా నిర్ణయించారు. ఇక, మైదుకూరు డిపో నుంచి ఉదయం 6, ఉదయం 7, సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక సర్వీసులు బయల్దేరనుండగా.. టిక్కెట్‌ ధర రూ.1135, రూ.1414గా పేర్కొన్నారు. బద్వేలు డిపో నుంచి పోరుమామిళ్లలో ఉదయం 5.30, 6 గంటలకు సర్వీసులు బయలుదేరి.. పెంచలకోన, శ్రీకాళహస్తి, గోల్డెన్‌ టెంపుల్‌, కాణిపాకం మీదుగా వెళ్తాయి.. ఈ సర్వీసుల ధర టిక్కెట్‌ ధర రూ.1566, రూ.1475గా నిర్ణయించారు. కడప డిపో నుంచి ఉదయం 5 గంటలకు మరో ప్రత్యేక సర్వీసు నడవనుండగా.. టిక్కెట్‌ ధర రూ. 1072గా ఖరారు చేశారు.. పులివెందుల డిపో నుంచి ఉదయం 7కు బయలుదేరి పీలేరు, గోల్డెన్‌ టెంపుల్‌ మీదుగా వెళ్లే సర్వీసుకు టిక్కెట్‌ ధర రూ.1242గా.. ప్రొద్దుటూరు డిపో నుంచి సాయంత్రం 6కు బయల్దేరి కడప మీదుగా వెళ్లే ప్రత్యేక బస్సుకు టిక్కెట్‌ ధర రూ.1273గా నిర్ణయించింది ఏపీఎస్ఆర్టీసీ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • apsrtc
  • Arunachalam
  • devotees
  • Lord Ayyappa

తాజావార్తలు

  • Xiaomi AI Glasses: 12MP కెమెరా, AI అసిస్టెంట్‌ తో.. షియోమి నుంచి AI స్మార్ట్ గ్లాసెస్‌ విడుదల..

  • Kolkata: లా కాలేజ్‌లో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. నిందితుల్లో తృణమూల్ నేత..

  • PUBG Love Affair : ’55 ముక్కలుగా నరుకుతా”.. భర్తను బెదిరించిన ప్రేమలో మునిగిన భార్య

  • IND vs ENG: నాలుగు కీలక క్యాచ్‌లను డ్రాప్‌ చేసిన యశస్వి.. అంత ఈజీ కాదంటున్న శ్రీధర్‌!

  • CM Chandrababu: కమ్యూనిజం… సోషలిజం.. క్యాప్టిలిజం… అన్ని ఇజాలు పోయాయి.. టూరిజం ఒక్కటే మిగిలింది..!

ట్రెండింగ్‌

  • Best Smartphones: రూ.15,000లోపు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్లు ఇవే..!

  • BSNL 1499: ‘దేశానికి తోడుగా’ అంటూ.. కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్..!

  • Controversy Marriage: సభ్యసమాజానికి షాక్: 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మనవడు!

  • Credit Card: క్రెడిట్ కార్డున్న వ్యక్తి మరణిస్తే.. బకాయి ఎవరు చెల్లించాలి..? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..!

  • Fairphone Gen 6: 5 ఏళ్ల వారంటీ, మరమ్మతులకు అనుకూలంగా ఉండేలా మొబైల్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions