APPSC Group 2 Results: గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. 92 వేల మంది మెయిన్స్ కు ఎంపిక..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ ఆన్లైన్ వేదికగా ప్రకటించింది. ప్రిలిమ్స్ లో ఉతీర్ణత సాధించి మెయిన్స్ కు క్వాలిఫై అయిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://portal-psc.ap.gov.in/Default.aspx లో నేడు ప్రకటించింది. గ్రూప్-2 ప్రిలిమ్స్ లో ఉతీర్ణత సాధించి మెయిన్స్ పరీక్షకు గాను మొత్తం 92,250 మంది అభ్యర్థులను ఎంపిక చేసారు అధికారులు. ఫిబ్రవరి 25 2024న గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్షా కోసం అప్లై చేసుకున్న వారిలో వివిధ కారణాలతో 2557 మంది అభ్యర్థులను అధికారులు రిజెక్ట్ చేశారు.
Also Read: Karumuri Nageswara Rao: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభలో ప్రజలు లేరు..
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఫిబ్రవరి 25 2024న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 899 గ్రూప్-2 పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, అందులో 4,63,517 మంది హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక వీరిలో 4,04,037 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. దింతో ప్రిలిమినరీ పరీక్షకు 87.17% శాతం మంది మాత్రమే హాజరయ్యారని ఏపీపీఎస్సీ ప్రకటన రూపంలో తెలిపింది. రాష్ట్రములోని 24 జిల్లాల్లోని మొత్తం 1327 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు.
Also Read:RBI: తమ కార్యాలయం ఏర్పాటు చేయాలంటే రాజధాని ఏది అంటున్న ఆర్బిఐ..!
బుధవారం నాడు గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేయగా.. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేసింది ఏపీపీఎస్సీ. ఇక ఎంపికైన వారికి జులై 28న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కమిషన్ తెలిపింది. ఏపీపీఎస్సీ నిర్వహించే ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ లో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో రెండు పేపర్లు కలిసి 300 మార్కులకు పరీక్షలను నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ కి 150 మార్కులు కేటాయించారు. ఈ పేపర్స్ లో పేపర్-1 లో చూస్తే.. ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు ఉండనున్నాయి. అలాగే ఇక పేపర్-2 విషయానికి వస్తే.. భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉండనున్నాయి. ఇందులో ప్రతి ఒక్క సెక్షన్ కు 75 మార్కులు కేటాయించారు అధికారులు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!