Telangana Govt: ఆరు గ్యారెంటీల అమలు.. ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Govt: ఆరు హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ మేరకు ఇవాళ నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రులతో జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమావేశం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. జిల్లా అధికారుల నుంచి మండల అధికారుల వరకు జిల్లా యంత్రాంగం ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రజా పాలనను అమలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉమ్మడి జిల్లాలకు మంత్రులను ఇన్ చార్జిలుగా నియమించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ జిల్లాకు ఇంచార్జి మంత్రిగా నియమితులయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్ కలెక్టరేట్లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశం నిర్వహణకు నియోజకవర్గాల వారీగా ఆర్డీఓలు, మండలాల వారీగా జిల్లా అధికారులు, మున్సిపల్ వార్డుల వారీగా అధికారులను నియమించారు. ఈ సమావేశానికి రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్లను ఆదేశించారు.
Read also: Health Tips : చక్కెరను ఎక్కువగా తింటే క్యాన్సర్ వస్తుందా?
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
జిల్లాలో ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో ప్రత్యేక అధికారుల బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆయా గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, ఛాయౌట, రైతు భరోసా తదితర పథకాల (ఆరు హామీలు) కోసం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు ధాపాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జిల్లాలోని అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రత, సంక్షేమ పథకాలకు సంబంధించిన ఆరు హామీలను అందించేందుకు ఒకరోజు ముందుగానే ఆయా గ్రామాలు, వార్డుల్లో దండోరా వేయించి సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయనున్నారు. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, పట్టణ స్థాయిలో వార్డు కార్యాలయాల్లో కార్యక్రమాలు నిర్వహించాలి. కార్యక్రమాల తేదీలు, సమయాలను ముందుగా ప్రజలకు తెలియజేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
Health Tips : చక్కెరను ఎక్కువగా తింటే క్యాన్సర్ వస్తుందా?
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!