Apple IPhone 15: ఐఫోన్ 15 లాంచ్ అయిన వెంటనే ఆపిల్కు రూ.4 లక్షల కోట్ల నష్టం.. ఎలాగో తెలుసుకోండి
Apple IPhone 15: ఆపిల్ తన కొత్త ఐఫోన్ సిరీస్ 15 ను మంగళవారం విడుదల చేసింది. లాంచ్ తర్వాత ఆపిల్ షేర్లలో సుమారు రెండు శాతం క్షీణత కనిపించింది. దీని వల్ల కంపెనీ 47.76 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. ఇది భారతీయ రూపాయలలో రూ. 4 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. నిజానికి ఈ స్టాక్ పతనానికి అసలు కారణం చైనా కంపెనీ హువావే టెక్నాలజీస్. దీని ట్రాఫిక్ ను 20 శాతం పెంచాలని నిర్ణయించింది. ఇటీవ ఆపిల్ అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన చైనాలో ఆ ఫోన్ల వాడకంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే 5 రోజుల్లో కంపెనీ షేర్లు 6 శాతానికి పైగా క్షీణించాయి.
పడిపోయిన ఆపిల్ షేర్లు
మంగళవారం ఆపిల్ షేర్లు 1.76 శాతం క్షీణించి 176.30డాలర్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్ సెషన్లో కంపెనీ షేర్లు కూడా 174.82డాలర్లకి చేరాయి. కంపెనీ షేర్లు రూ.179.49 వద్ద ప్రారంభమయ్యాయి. గత 5 రోజుల్లో కంపెనీ షేర్లు 6 శాతానికి పైగా క్షీణించాయి. అయితే ఈ ఏడాది ఆపిల్ షేర్లు ఇన్వెస్టర్లకు భారీ రాబడిని ఇచ్చాయి. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, ఆపిల్ షేర్లు ఇప్పటివరకు 41 శాతం పెరిగాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆపిల్ స్టాక్ కొన్ని రోజులు ఒత్తిడిని ఎదుర్కోవచ్చు.
Also Read
- Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
- Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
Read Also:BJP Fast Initiation: బీజేపీ 24 గంటల ఉపవాస దీక్ష.. ధర్నాచౌక్, ఇందిరా పార్క్ వద్ద ఆందోళన
ఆపిల్ స్టాక్ ఎందుకు పడిపోయింది?
యాపిల్ స్టాక్ క్షీణించడానికి చైనాయే అసలు కారణమని భావిస్తున్నారు. చైనాకు చెందిన హువావే టెక్నాలజీస్ తన మేట్ 60 సిరీస్ స్మార్ట్ఫోన్ల కోసం ఈ సంవత్సరం ద్వితీయార్థంలో షిప్మెంట్ లక్ష్యాన్ని 20 శాతం పెంచిందని నివేదిక వెల్లడించిన తర్వాత ఆపిల్ షేర్ ధర పడిపోయింది. ఆపిల్ కొత్త ఐఫోన్ 15 సిరీస్, ఇతర ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసిన సమయంలో చైనా కంపెనీ నుంచి ఈ ప్రకటన వచ్చింది. కొన్ని రోజుల క్రితం చైనా ప్రభుత్వం ఐఫోన్, ఇతర విదేశీ పరికరాలను ఉపయోగించకూడదని తన ఉద్యోగులను ఆదేశించింది.
యాపిల్ రూ.4 లక్షల కోట్ల నష్టం
కంపెనీ షేర్ల పతనం కారణంగా కంపెనీ వాల్యుయేషన్లో భారీ క్షీణత నెలకొంది. ఈ క్షీణత 47.76 బిలియన్ డాలర్లుగా నమోదైంది. భారతీయ రూపాయలలో ఈ నష్టం దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, సోమవారం మార్కెట్ ముగిసినప్పుడు, కంపెనీ మార్కెట్ క్యాప్ 2.799 ట్రిలియన్ డాలర్లు, ఇది మంగళవారం మార్కెట్ ముగిసిన తర్వాత 2.752 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. అంటే కంపెనీ మార్కెట్ క్యాప్ 47 బిలియన్ డాలర్లకు పైగా క్షీణించింది.
Read Also:MSMP: అనుష్కతో మాట్లాడే లక్కీ ఛాన్స్… ఆ లక్కీ లేడీస్ కి మాత్రమే
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!