Apollo Hospitals: దూసుకుపోయిన అపోలో హాస్పిటల్స్.. నాలుగో త్రైమాసికంలో లాభం ఎన్ని కోట్లంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apollo Hospitals: అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ దేశంలోనే పేర్గాంచిన ప్రసిద్ధ హాస్పిటల్ నెట్వర్క్. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ వ్యాపార కుటుంబం దీన్ని నడుపుతోంది. పైగా ఇది గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కుటుంబానికి చెందిన కంపెనీ. అపోలో హాస్పిటల్స్ తన నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఇటీవల విడుదల చేసింది. గత త్రైమాసికంలో కంపెనీ రూ.146 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన రూ.97 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 50.5 శాతం ఎక్కువ. అయితే, మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం రూ.198 కోట్లను అందుకోవడంలో ఆసుపత్రి సంస్థ విఫలమైంది. దీంతో ఇన్వెస్టర్లు కొంత నిరాశకు గురయ్యారు.
Read Also:Khalistan: CBSC సిలబస్ నుంచి “సపరేట్ సిక్కు దేశం” పాఠ్యాంశం తొలగింపు
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
మెరుగైన ఆక్యుపెన్సీ బలమైన లాభాలను నమోదు చేయడానికి దోహదపడింది. త్రైమాసికంలో ఆదాయం 21.3 శాతం పెరిగి రూ.4,302.2 కోట్లకు చేరుకుంది. ఇది రూ.4,302.7 కోట్ల అంచనాలకు అనుగుణంగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం కేవలం రూ.3,546.4 కోట్లు. కానీ అపోలో హెల్త్ కో వ్యాపారం వైపు చేసిన పెట్టుబడుల కారణంగా నిర్వహణ పనితీరు ఇప్పటికీ ఒత్తిడిలో ఉంది. మునుపటి త్రైమాసికంలో, అపోలో మేనేజ్మెంట్ తన హెల్త్కో ఆర్మ్లో నష్టాలు Q4లో గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, FY24 ద్వితీయార్ధంలో బ్రేక్ఈవెన్ను ఆశించినందున కోలుకునే మార్గంలో ఉందని పేర్కొంది. నాల్గవ త్రైమాసికంలో డిజిటల్ ఆర్మ్ నష్టాలు పెరగడంతో, విశ్లేషకులు, పెట్టుబడిదారులు డిజిటల్ వ్యాపారం, ఆసుపత్రి విభాగానికి సంబంధించిన ఔట్లుక్పై మేనేజ్మెంట్ వ్యాఖ్యల కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చే 6 నెలల్లో అపోలో హెల్త్కేర్ ద్వారా వచ్చే నష్టాలను పూడ్చేందుకు అంతర్గత వనరుల నుంచి నిధులను సమీకరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీని ప్రకారం వచ్చే త్రైమాసికాల్లోనూ మార్జిన్లపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి ఎన్ఎస్ఈలో అపోలో హాస్పిటల్స్ కంపెనీ షేరు రూ.4,600 వద్ద ముగిసింది.
Read Also:Telangana Police: తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రిలీజ్
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!