APL 2025: రోహిత్ సంచలన ఇన్నింగ్స్.. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా తుంగభద్ర వారియర్స్!
- ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 2025 విజేతగా తుంగభద్ర వారియర్స్.
- రన్నరప్ గా అమరావతి రాయల్స్
- హనుమ విహారి శ్రమ వృధా..
- గుట్టా రోహిత్ సిక్సర్ల వర్షం, జ్ఞానేశ్వర్ కీలక ఇన్నింగ్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APL 2025: విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 2025 ఫైనల్లో అమరావతి రాయల్స్, తుంగభద్ర వారియర్స్ జట్లు విజేత నువ్వా.. నేనా.. అన్నట్లుగా మ్యాచ్ అమాంతం సాగింది. ఇకపోతే టీమిండియా ప్లేయర్ అమరావతి రాయల్స్ కెప్టెన్ హనుమ విహారి బ్యాట్, బంతితో అద్భుతంగా రాణించినా.. చివరికి విజయం మాత్రం తుంగభద్ర వారియర్స్ ను చేరుకుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన అమరావతి రాయల్స్ మంచి ఆరంభం చేసింది. కెప్టెన్ హనుమ విహారి, మాన్యాల ప్రణీత్ జోడీ మొదటి 6 ఓవర్లలోనే ఏకంగా 70 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించింది. ఈ ఇన్నింగ్స్ లో విహారి 37 బంతుల్లో ఒక సిక్స్, నాలుగు ఫోర్లతో 51 పరుగులు చేశాడు. మరోవైపు ప్రణీత్ 22 బంతుల్లో మూడు సిక్స్లు, ఐదు ఫోర్లతో 47 పరుగులతో మంచి సహకారాన్ని అందించాడు. ఆ తర్వాత పాండురంగ రాజు 22 పరుగులు, మరికొంతమంది అడపాదడపా స్కోర్ చేయడంతో నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్లకు 194 పరుగులు చేసింది అమరావతి రాయల్స్. ఇక తుంగభద్ర బౌలర్లలో కె.వి. శశికాంత్ 3 వికెట్లు, సి. స్టీఫెన్ 2 వికెట్లు, చెన్ను సిద్ధార్థ ఒక వికెట్ తీశారు.
Also Read
- Sai Krishna Case: సాయికృష్ణ కేసులో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- YS Jagan: 'నాన్న చూపిన మార్గమే నాకు స్ఫూర్తి'.. ఫాదర్స్ డే వేళ వైఎస్ జగన్ ఎమోషనల్ పోస్ట్..
- Tilak Varma: "నువ్వు అస్సలు తగ్గొద్దు".. శ్రీలంకతో ఫైనల్ ఫైట్కు ముందు వైభవ్కు తిలక్ ఫుల్ సపోర్ట్..
- Chittoor: 'ఆమె లేక నేను లేను'.. ప్రేమించిన అమ్మాయి సమాధి వద్దే ప్రియుడి ఆత్మహత్య..
ఇక ఆ తర్వాత 195 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి వచ్చిన తుంగభద్ర వారియర్స్ ఆరంభంలో కాస్త తడబడ్డ.. మధ్యలో యువ ఆటగాళ్లు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతో విజయాన్ని అందుకుంది. ఇక ఈ ఇన్నింగ్స్ లో సి.ఆర్. జ్ఞానేశ్వర్ 45 బంతుల్లో 2 సిక్స్లు, 8 ఫోర్లతో 66 పరుగులు చేయగా.. మరోవైపు గుట్టా రోహిత్ కేవలం 28 బంతుల్లో 7 సిక్స్లు, 3 ఫోర్లతో 63 పరుగులతో వీరవిహారం చేయడంతో అమరావతి రాయల్స్ విజయానికి దూరమైంది. అలాగే ఎం. దత్తా రెడ్డి 12 బంతుల్లో 25 పరుగులు, మ్యాచ్ చివర్లో కె.వి. శశికాంత్ (7*) హనుమ విహారి వేసిన ఓవర్ చివరి బంతిని సిక్స్గా కొట్టి జట్టుకు 12 బంతులు మిగిలి ఉండగానే విజయం అందించాడు.
దీనితో తుంగభద్ర వారియర్స్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి.. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 2025 ట్రోఫీని గెలుచుకుంది. విజేతగా నిలిచిన తుంగభద్ర వారియర్స్ రూ.35 లక్షల నగదు బహుమతి అందుకోగా, రన్నరప్ అయిన అమరావతి రాయల్స్ రూ.20 లక్షల నగదు బహుమతి అందుకుంది. మొత్తంగా హనుమ విహారి ఫైనల్లో అర్ధ సెంచరీ, రెండు వికెట్లు తీసి మెరిసినా.. ఫలితం ఇవ్వలేదు. గుట్టా రోహిత్ సిక్సర్ల వర్షం, జ్ఞానేశ్వర్ కీలక ఇన్నింగ్స్ తుంగభద్ర వారియర్స్ను ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025 చాంపియన్స్గా నిలబెట్టాయి.
Russia Ukraine War: ఆగని యుద్ధం.. ఉక్రెయిన్లోని రెండు గ్రామాలను స్వాధీనం చేసుకున్న రష్యా!
తాజావార్తలు
-
Samantha : టాలీవుడ్ లేడి సూపర్ స్టార్ అంటే సమంత మాత్రమే.. కారణం ఏంటంటే?
-
Bollywood Updates : రెండేళ్ల పాటు మీడియాకు దూరంగా… స్టార్ హీరో షాకింగ్ డెసిషన్
-
Lenovo ThinkPad L13 Gen 7: లెనోవో థింక్ప్యాడ్ L13 జెన్ 7 ల్యాప్టాప్ విడుదల.. 16GB ర్యామ్, 2TB స్టోరేజ్
-
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Royal Enfield Flying Flea C6: రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు ప్రారంభం.. రేంజ్, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!