AP-SIR: నేటి నుంచే ‘సర్’ ప్రక్రియ ప్రారంభం.. ఇంటింటికీ వెళ్లి సర్వే చేయనున్న బీఎల్వోలు!
- నేటి నుంచే 'సర్' ప్రక్రియ ప్రారంభం
- నెల రోజుల పాటు సర్ ప్రక్రియ
- ఇంటింటికీ వెళ్లి సర్వే చేయనున్న బీఎల్వోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Voter List Revision 2026 Begins: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ప్రారంభం కానుంది. జులై 14 వరకు నెల రోజుల పాటు బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్వో) ఇంటింటికీ వెళ్తారు. రాష్ట్రంలోని ప్రతి అర్హుడైన పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో నమోదు కావడంతో పాటు తప్పులు సరిదిద్దడం, కొత్త ఓటర్లను చేర్చడం, మరణించిన లేదా అనర్హులైన వారి పేర్లను తొలగించడం లక్ష్యంగా ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా బీఎల్వో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించనున్నారు. రాష్ట్రంలో సుమారు 4.16 కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ.. ఏన్యూమరేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు.
ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. అనంతరం అభ్యంతరాలు, సవరణలు, కొత్త దరఖాస్తులను పరిశీలించిన తర్వాత సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనుంది. ప్రతి ఇంటిని కనీసం మూడు సార్లు సందర్శించి ఓటర్ల వివరాలను ధృవీకరించాలని బీఎల్వోలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఎవరైనా ఓటరు ఇంట్లో లేకపోయినా, వారి వివరాలు నమోదు కావడానికి తగిన అవకాశాలు కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.
Also Read
- Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
- Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
- Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
- PM Modi: ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన.. బ్రహ్మోస్ ఒప్పందమే కీలకం..
అలాగే ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల భాగస్వామ్యాన్ని కూడా ఎన్నికల సంఘం కోరింది. బీఎల్వోలతో పాటు వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAs) కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని సూచించింది. దీనివల్ల ఓటర్ల జాబితా మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా తయారవుతుందని భావిస్తున్నారు. ఇక ప్రతి ఓటు కీలకమైన నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా అప్రమత్తమయ్యాయి. ఓటర్ల జాబితాలో తమ పార్టీ అనుకూల ఓటర్ల పేర్లు తొలగిపోకుండా, కొత్త అర్హుల పేర్లు నమోదు అయ్యేలా క్రింది స్థాయి నాయకులకు ఇప్పటికే దిశానిర్దేశాలు జారీ చేసినట్లు సమాచారం.
రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలు కూడా చురుకుగా పాల్గొని తమ వివరాలు సరిగా నమోదయ్యాయో లేదో ధృవీకరించుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది. సర్ ప్రక్రియ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. 4.16 కోట్ల ఎన్యుమరేషన్ ఫాంలు ముద్రించింది. 46,397 మంది బీఎల్వోలు ఈ ప్రక్రియలో పాల్గొంటారు. వారికి ఈసీ ఇప్పటికే శిక్షణిచ్చింది. 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుని.. ప్రస్తుత జాబితాను పరిశీలించి మ్యాపింగ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 4,16,18,359 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 2,68,86,239 మందికి 2002లో జరిగిన సర్ ఓటర్ల జాబితాతో ఇప్పటికే మ్యాపింగ్ పూర్తి చేశారు. మరో 1,47,32,120 మందికి మ్యాపింగ్ కావాల్సి ఉంది. ఓటర్ల జాబితాలో పేరున్న వారు ఎన్యుమరేషన్ ఫాం, 2002 నాటి జాబితాలో వారి/కుటుంబీకుల వివరాలు పొందుపరిచి ఇవ్వాలి.
- Tags
- ap
- AP Voter List
- BLO
- EC
- SIR
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!