AP TET Results: ఏపీ టెట్-2024 ఫలితాలు విడుదల
- ఏపీ టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)- 2024 ఫలితాలు విడుదల
- మొత్తంగా 58.4 శాతం మంది అభ్యర్థుల ఉత్తీర్ణత
- డీఎస్సీలో టెట్ మార్క్లకు 20 శాతం వెయిటేజ్
- బీఈడీ.. డీఈడీ పూర్తి చేసినవారికి త్వరలో మరోసారి టెట్ నిర్వహించేందుకు సన్నాహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP TET Results 2024: ఏపీ టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)- 2024 ఫలితాలను విడుదల చేశారు.. టెట్-2024లో మొత్తంగా 58.4 శాతం మంది అభ్యర్థుల ఉత్తీర్ణత సాధించారు.. కాగా, డీఎస్సీలో టెట్ మార్క్లకు 20 శాతం వెయిటేజ్ కల్పించనున్న విషయం విదితమే.. అయితే, బీఈడీ, డీఈడీ పూర్తి చేసినవారికి త్వరలో మరోసారి టెట్ నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది.. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో టెట్ షెడ్యూల్ విడుదల చేశారు.. ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు టెట్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,67,789 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,35,907 మంది పరీక్షలు రాశారు.. అంటే దరఖాస్తు చేసిన వారిలో 88.90 శాతం మంది టెట్ రాశారు.. వారిలో 1,37,904 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 58.4 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇక, టెట్ ఫలితాలు మార్చి 14నే విడుదల కావాల్సి ఉన్నా.. అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడగా.. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడం.. కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటు కావడంతో.. ఫలితాలు విడుదల చేశారు..
Read Also: Stock market: మరోసారి రికార్డ్లు సృష్టించిన స్టాక్ మార్కెట్
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
టెట్-2024 ఫలితాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తే.. పేపర్ 1(ఏ) ఎస్జీటీ రెగ్యులర్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 1,13,296గా ఉంటే.. వారిలో 78,142మంది అంటే 66.32 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక, పేపర్ 1(బి) ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షకు 1700 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 790 మంది.. 46.47శాతం ఉత్తీర్ణత సాధించారు. పేపర్ 2(ఏ) స్కూల్ అసిస్టెంట్ రెగ్యులర్ పరీక్షలకు 1,19,500 దరఖాస్తు చేసుకుంటే.. వారిలో 60,846 మంది.. 60.93 శాతం అర్హత పొందారు.. పేపర్ 2(బి) స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షకు 1,411మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 1,125 మంది.. 79.73 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా పరీక్షలకు హాజరైన వారిలో 58.4 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు.. ఇక, ఏపీలో కూటమి ప్రభుత్వం.. ఎన్నికల్లో డీఎస్సీపై హామీ ఇచ్చింది.. అదే విధంగా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే.. మెగా డీఎస్సీ నిర్వహణ ఫైల్పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు.. అంతేకాదు.. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలోనూ మెగా డీఎస్సీ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ లభించింది.. దీంతో.. ఇప్పుడు టెట్లో అర్హత సాధించినవారు డీఎస్సీ రాసుకునే వీలు కలుగుతుంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?