Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Ration Cards Replace Family Card Zero Poverty Skill Development Plan

Ration Cards : రేషన్ కార్డుతో సంబంధం లేదు.. ఇక నుంచి ఫ్యామిలీ కార్డులే..

Published Date :March 12, 2026 , 8:34 pm
By Veerababu
  • ప్రతీ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు కార్డు..
  • ఈ కార్డు ద్వారానే సంక్షేమ పథకాలు అమలు..
  • త్వరలో అందరికీ ఫ్యామిలీ కార్డులు..
Ration Cards : రేషన్ కార్డుతో సంబంధం లేదు.. ఇక నుంచి ఫ్యామిలీ కార్డులే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీలో సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం ఫ్యామిలీ కార్డు విధానం ప్రవేశపెట్టే దిశగా చర్యలు ప్రారంభించింది. రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపుగా ఈ కార్డు ఉపయోగపడేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్‌ తెలిపారు. ఈ కార్డు ద్వారా ప్రభుత్వంలోని అన్ని సంక్షేమ పథకాల లబ్ధిని ఒకే వేదికపై అందించేలా వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు గ్రామాలు, పట్టణాల్లో క్షేత్రస్థాయి సర్వేలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు.

భవిష్యత్తులో అమలు చేయబోయే సూపర్‌ సిక్స్‌ పథకాలను కూడా ఫ్యామిలీ కార్డుతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఒకే కార్డు ఆధారంగా కుటుంబానికి అందే పథకాల వివరాలు స్పష్టంగా నమోదు అవుతాయి. కలెక్టర్ల సదస్సులో ‘జీరో పావర్టీ’ లక్ష్యంపై ఆయన ప్రజెంటేషన్‌ ఇస్తూ.. మార్గదర్శి , బంగారు కుటుంబం పథకాల అమలు పురోగతిని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 20 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శకులతో అనుసంధానం చేసినట్లు తెలిపారు.

Also Read:GHMC: గుడ్‌న్యూస్ చెప్పిన జీహెచ్ఎంసీ.. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట..

గ్రామస్థాయిలో ‘బంగారుమిత్ర’లను నియమించి పథక అమలును పర్యవేక్షించే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోటిన్నరకు పైగా కుటుంబాలు బీపీఎల్‌ వర్గంలో ఉన్నప్పటికీ.. వచ్చే రెండు సంవత్సరాల్లో కనీసం ఐదు లక్షల కుటుంబాలు దారిద్ర్య రేఖకు పైకి రావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇక ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి అంశాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లా స్థాయిలో అవసరాలను గుర్తించి జిల్లా నైపుణ్య ప్రణాళికలు రూపొందించాలని నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ సూచించారు. శాఖను పునర్‌వ్యవస్థీకరించి జిల్లాల్లో ఉపాధి, నైపుణ్య అధికారులను నోడల్‌ అధికారులుగా నియమిస్తున్నామని తెలిపారు. ‘నైపుణ్యం’ పోర్టల్‌ ద్వారా లక్ష మందికి స్కిల్‌ అసెస్‌మెంట్‌ జరుగుతోందని.. ఈ నెలాఖరుకు అది పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.

Also Read:IOCL: సంక్షోభం వేల భారీ శుభవార్త.. పుష్కలంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు.. వెల్లడించిన ఆయిల్ కంపెనీ..

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 1.46 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులపై ప్రత్యేక సర్వే జరుగుతోంది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది నిర్మాణ రంగంలో ఉన్నప్పటికీ.. వారిలో కేవలం నాలుగు శాతం మంది మాత్రమే అధికారిక శిక్షణ పొందినట్లు గుర్తించారు. ఈ రంగంలో 113 రకాల పనులకు ప్రత్యేక నైపుణ్యాలు అవసరమని, పరిశ్రమలతో భాగస్వామ్యం ద్వారా శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. జూన్‌ నుంచి శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతిలో ఐదు ఎకరాల్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ.. ‘కౌశలం’ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని స్కిల్డ్‌ , అన్‌స్కిల్డ్‌ మానవ వనరులపై సమగ్ర సర్వే కొనసాగుతోందని తెలిపారు. దీని ఆధారంగా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యంతో కూడిన మానవ వనరులను రాష్ట్రంలోనే తయారు చేయడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh welfare schemes
  • AP Employment Survey 2026
  • AP Family Card
  • AP Skill Development Portal
  • Bangaru Kutumbam Scheme

తాజావార్తలు

  • Ration Cards : రేషన్ కార్డుతో సంబంధం లేదు.. ఇక నుంచి ఫ్యామిలీ కార్డులే..

  • Prem Rakshith: ప్రేమ్ రక్షిత్’పై మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ ప్రశంసలు

  • Iran War: ‘‘హార్ముజ్‌ను మూసే ఉంచాలి’’.. కొత్త సుప్రీం లీడర్ ఆదేశాలు..

  • Srisailam: ఉగాది మహోత్సవాలకు ముస్తాబైతున్న శ్రీశైల మల్లన స్వామి.. 16 నుంచి ఐదు రోజుల పాటు ఘనంగా వేడుకలు.!

  • LPG Cylinder Delivery: రాష్ట్రంలో LPG సరఫరా నియంత్రణలోనే ఉంది.. ప్రభుత్వం కీలక ప్రకటన.!

ట్రెండింగ్‌

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • 120Hz LCD డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో iQOO Z11x 5G లాంచ్.. ధర ఎంతంటే?

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions