AP Rains : ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు
- ఫెంగల్ తుఫాన్తో తమిళనాడులో భారీ వర్షాలు
- తుఫాన్ ఎఫెక్ట్ తో ఏపీలోనూ భారీ వర్షాలు
- నెల్లూరులో నిన్నటి నుంచి వర్షాలు
- ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా వరి రైతులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో ఈరోజు తెల్లవారుజామున నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. నెల్లూరు.. కోవూరు.. అల్లూరు.. వాకాడు..కోట. ముత్తుకూరు మండలాల్లో కొనసాగుతోంది. తీర ప్రాంతంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో.. బీచ్ ల వద్దకు ప్రజలు వెళ్ళవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది.
Farmers Festival: నేడు పాలమూరులో రైతు పండగ ముగింపు సభ.. సీఎం శుభవార్త చెబుతారా..
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
పెంగల్ తుఫాన్ ఉత్తరాంధ్ర రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తుఫాను తీరాన్ని సమీపిస్తుండగా వర్షాలు ఉధృతి క్రమేపీ పెరుగు తోంది. వచ్చే మూడు రోజులు విస్తారంగా వానలు కురుస్తాయని ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కోత కోసి పొలంలో ఉన్న వున్న వరి పంట దెబ్బతింటుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అమావాస్య రోజు వచ్చే తుఫాన్ ల వల్ల ఎక్కువ నష్టం ఉంటుందన్న భయం కూడా కనిపిస్తోంది. దీంతో పంటలను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కుప్పలు వేసిన పంటలు కాపాడుకోవడానికి తార్ఫాలిన్లు కప్పి సంరక్షిస్తున్నారు. పండిన పంట కూడా గాలుల ఉధృతికి నేల వాలే ప్రమాదం ఉంది. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో రైతుల్లో కలవర పడుతున్నారు.
ఊహించిన విధంగా వచ్చి పడుతున్న తుఫాను ప్రభావంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా వరి రైతులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 5 లక్షల ఎకరాల్లో వరి పంట పండింది. ఇందులో కేవలం 30 శాతం మాత్రమే కోతలు పూర్తయి ధాన్యం బస్తాలు మిల్లులకు చేరాయి. వరి కోతలు పూర్తి చేయాల్సి ఉన్న రైతులను తుఫాను భయం వెంటాడుతోంది. వర్షం కురిసినా, గాలుల తీవ్రత పెరిగిన వరిచేలకు నష్టం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. మరో రెండు రోజులపాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో రైతులు హడావిడిగా కోతలు పూర్తి చేస్తూ ధాన్యాన్ని మిల్లులకు తరలించే ఏర్పాటు చేస్తున్నారు.
CM Chandrababu : నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!