AP Rains : ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు
- ఫెంగల్ తుఫాన్తో తమిళనాడులో భారీ వర్షాలు
- తుఫాన్ ఎఫెక్ట్ తో ఏపీలోనూ భారీ వర్షాలు
- నెల్లూరులో నిన్నటి నుంచి వర్షాలు
- ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా వరి రైతులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో ఈరోజు తెల్లవారుజామున నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. నెల్లూరు.. కోవూరు.. అల్లూరు.. వాకాడు..కోట. ముత్తుకూరు మండలాల్లో కొనసాగుతోంది. తీర ప్రాంతంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో.. బీచ్ ల వద్దకు ప్రజలు వెళ్ళవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది.
Farmers Festival: నేడు పాలమూరులో రైతు పండగ ముగింపు సభ.. సీఎం శుభవార్త చెబుతారా..
Also Read
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
పెంగల్ తుఫాన్ ఉత్తరాంధ్ర రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తుఫాను తీరాన్ని సమీపిస్తుండగా వర్షాలు ఉధృతి క్రమేపీ పెరుగు తోంది. వచ్చే మూడు రోజులు విస్తారంగా వానలు కురుస్తాయని ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కోత కోసి పొలంలో ఉన్న వున్న వరి పంట దెబ్బతింటుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అమావాస్య రోజు వచ్చే తుఫాన్ ల వల్ల ఎక్కువ నష్టం ఉంటుందన్న భయం కూడా కనిపిస్తోంది. దీంతో పంటలను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కుప్పలు వేసిన పంటలు కాపాడుకోవడానికి తార్ఫాలిన్లు కప్పి సంరక్షిస్తున్నారు. పండిన పంట కూడా గాలుల ఉధృతికి నేల వాలే ప్రమాదం ఉంది. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో రైతుల్లో కలవర పడుతున్నారు.
ఊహించిన విధంగా వచ్చి పడుతున్న తుఫాను ప్రభావంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా వరి రైతులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 5 లక్షల ఎకరాల్లో వరి పంట పండింది. ఇందులో కేవలం 30 శాతం మాత్రమే కోతలు పూర్తయి ధాన్యం బస్తాలు మిల్లులకు చేరాయి. వరి కోతలు పూర్తి చేయాల్సి ఉన్న రైతులను తుఫాను భయం వెంటాడుతోంది. వర్షం కురిసినా, గాలుల తీవ్రత పెరిగిన వరిచేలకు నష్టం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. మరో రెండు రోజులపాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో రైతులు హడావిడిగా కోతలు పూర్తి చేస్తూ ధాన్యాన్ని మిల్లులకు తరలించే ఏర్పాటు చేస్తున్నారు.
CM Chandrababu : నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
తాజావార్తలు
-
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్పైనే!
-
Yashasvi Jaiswal-ICC: శ్రీలంక పేసర్తో గొడవ.. యశస్వి జైస్వాల్కు ఐసీసీ బిగ్ షాక్!
-
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
-
Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
-
Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!