AP MLC Elections: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల రీపోలింగ్.. రేపే కౌంటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తిరుపతి నగరంలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ముగిసింది. ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు చిన్నబజారులోని బూత్ నెంబర్ 229, సత్యనారాయణపురంలో బూత్ నెం.233లో రీపోలింగ్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. చిత్తూరు, ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు పట్టభద్రులు, టీచర్స్ ఎం ఎల్ సి స్దానాలకు నేడు 229 , 233 పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ జరిగింది. మొత్తం కలిపి రేపు ఎస్ వి సెట్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. టీచర్స్ స్దానానికి 14 టేబుల్స్ , గ్రాడ్యుయేట్ స్దానానికి 40 టేబుల్స్ లో జరగనుంది కౌంటింగ్.
సార్వత్రిక ఎన్నికలకు భిన్నంగా రౌండ్స్ తో నిమిత్తం లేకుండా జరగనుంది కౌంటింగ్ ప్రక్రియ. కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు మొదలై ఫలితాలు వెలువడేంత వరకు జరగనుంది కౌంటింగ్. రెండురోజుల పాటు నిరంతరాయంగా కౌంటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. మూడు షిఫ్టులకు కలిపి మొత్తం 916 మంది ఎన్నికల సిబ్బంది . ఇందులో 29 మందిని రిజర్వులో ఉంచారు. త్రాగునీరు, ఎన్నికల సిబ్బంది కి భోజన సదుపాయాలు లాంటి ఏర్పాట్లను పూర్తి చేసింది జిల్లా యంత్రాంగం. కౌంటింగ్ సందర్బంగా మూడెంచెల భద్రత కల్పించింది పోలీసు శాఖ. పోలింగ్ కేంద్రం మరియు పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ విధించారు. భద్రత లో 5 మంది డియస్పిలు , 10 మంది సి ఐ లు , 14 మంది ఎస్ ఐ లు, 195 మంది సిబ్బంది పాల్గొంటారు.
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
Read Also: KS Bharath: కేఎస్ భరత్ వద్దు.. అతడే సరైనోడు.. టీమిండియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!