MLC Ravindra Babu: వైసీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రులు
- అమరావతి అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు కీలక వ్యాఖ్యలు.
- తీవ్రంగా స్పందించిన ఏపీ మంత్రులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Ravindra Babu: ఏపీ రాజధాని అమరావతి అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పార్థసారధి వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానిస్తూ.. రాజధాని గురించి మాట్లాడే అర్హత వైసీపీ సభ్యులకు లేదని, ప్రజలు ఎన్నికల్లో అమరావతే ఏకైక రాజధాని అని తీర్పు ఇచ్చారని అన్నారు. మూడు రాజధానుల ప్రకటన తర్వాత ప్రజలు వైసీపీకి ఏ విధంగా తిరస్కార తీర్పు ఇచ్చారో మనందరికీ తెలుసునని.. చంద్రబాబు అద్భుతంగా అమరావతి రాజధానిని నిర్మిస్తారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి విజన్ ఏమిటో మేము చేసి చూపిస్తాం అంటూ ఆయన అన్నారు.
Read Also: Apple Launches iPad: భారత్లో సరికొత్త చిప్లతో ఐప్యాడ్లను విడుదల చేసిన యాపిల్
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
అలాగే, ఈ విషయమై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. మూడురాజధానుల ప్రకటనతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, ప్రజలు ఇచ్చిన తీర్పుతో వైసీపీ నేతలు తమ రాజధాని నిర్ణయం తప్పని గ్రహించారని అన్నారు. బొత్స సత్యనారాయణ కూడా మా నిర్ణయం తప్పని, ప్రజలు అంగీకరించలేదని ఒప్పుకున్నారు. ఈ విషయంపై వీడియోను అవసరమైతే సభలో ప్రదర్శిస్తామని వ్యాఖ్యానించారు.
మరోవైపు మంత్రి పార్థసారధి కూడా వైసీపీ నేతలపై ఘాటుగా స్పందించారు. అమరావతిపై వైసీపీ నేతలు విషం చిమ్మారని, ఇప్పటికైనా వైసీపీ నేతలు తమ తీరు మార్చుకోవాలని ఆయన అన్నారు. మీరు మనుషుల మధ్య నుంచే అమరావతికి వస్తున్నారనే విషయం తెలుసుకోవాలని ఆయన అన్నారు. గత ప్రభుత్వం అమరావతిలో అధికారులు ఉండేందుకు కూడా సరైన వసతులు ఏర్పాటు చేయలేదని.. హైదరాబాద్ శివారు ప్రాంతాలాగే విజయవాడ, గుంటూరు కలసిపోతున్నాయని ఆయన అన్నారు. అదే విధంగా అమరావతి నగరం కూడా విస్తరిస్తుందని, అమరావతిని గొప్ప నగరంగా మేము కడతామని అన్నారు.
Read Also: Vivo T4x 5G: 6500mAh భారీ బ్యాటరీతో బడ్జెట్ ధరలో సరికొత్త స్మార్ట్ఫోన్ లాంచ్!
అయితే ఈ విషయంపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ భిన్నంగా స్పందించారు. రాజధాని అమరావతి పై మా నిర్ణయం తప్పని మేము ఎక్కడా చెప్పలేదని, ఆ రోజు మా విధానం అది.. ఆ విధానం ప్రకారం ముందుకు వెళ్లామని తెలిపారు. రాజధానిపై రాబోయే కాలంలో ఏం జరగబోతోందనేది కాలమే చెబుతుందని ఆయన అన్నారు. మొత్తానికి అమరావతి రాజధాని అంశంపై రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!