MLC Ravindra Babu: వైసీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రులు
- అమరావతి అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు కీలక వ్యాఖ్యలు.
- తీవ్రంగా స్పందించిన ఏపీ మంత్రులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Ravindra Babu: ఏపీ రాజధాని అమరావతి అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పార్థసారధి వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానిస్తూ.. రాజధాని గురించి మాట్లాడే అర్హత వైసీపీ సభ్యులకు లేదని, ప్రజలు ఎన్నికల్లో అమరావతే ఏకైక రాజధాని అని తీర్పు ఇచ్చారని అన్నారు. మూడు రాజధానుల ప్రకటన తర్వాత ప్రజలు వైసీపీకి ఏ విధంగా తిరస్కార తీర్పు ఇచ్చారో మనందరికీ తెలుసునని.. చంద్రబాబు అద్భుతంగా అమరావతి రాజధానిని నిర్మిస్తారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి విజన్ ఏమిటో మేము చేసి చూపిస్తాం అంటూ ఆయన అన్నారు.
Read Also: Apple Launches iPad: భారత్లో సరికొత్త చిప్లతో ఐప్యాడ్లను విడుదల చేసిన యాపిల్
Also Read
- Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
- Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
అలాగే, ఈ విషయమై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. మూడురాజధానుల ప్రకటనతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, ప్రజలు ఇచ్చిన తీర్పుతో వైసీపీ నేతలు తమ రాజధాని నిర్ణయం తప్పని గ్రహించారని అన్నారు. బొత్స సత్యనారాయణ కూడా మా నిర్ణయం తప్పని, ప్రజలు అంగీకరించలేదని ఒప్పుకున్నారు. ఈ విషయంపై వీడియోను అవసరమైతే సభలో ప్రదర్శిస్తామని వ్యాఖ్యానించారు.
మరోవైపు మంత్రి పార్థసారధి కూడా వైసీపీ నేతలపై ఘాటుగా స్పందించారు. అమరావతిపై వైసీపీ నేతలు విషం చిమ్మారని, ఇప్పటికైనా వైసీపీ నేతలు తమ తీరు మార్చుకోవాలని ఆయన అన్నారు. మీరు మనుషుల మధ్య నుంచే అమరావతికి వస్తున్నారనే విషయం తెలుసుకోవాలని ఆయన అన్నారు. గత ప్రభుత్వం అమరావతిలో అధికారులు ఉండేందుకు కూడా సరైన వసతులు ఏర్పాటు చేయలేదని.. హైదరాబాద్ శివారు ప్రాంతాలాగే విజయవాడ, గుంటూరు కలసిపోతున్నాయని ఆయన అన్నారు. అదే విధంగా అమరావతి నగరం కూడా విస్తరిస్తుందని, అమరావతిని గొప్ప నగరంగా మేము కడతామని అన్నారు.
Read Also: Vivo T4x 5G: 6500mAh భారీ బ్యాటరీతో బడ్జెట్ ధరలో సరికొత్త స్మార్ట్ఫోన్ లాంచ్!
అయితే ఈ విషయంపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ భిన్నంగా స్పందించారు. రాజధాని అమరావతి పై మా నిర్ణయం తప్పని మేము ఎక్కడా చెప్పలేదని, ఆ రోజు మా విధానం అది.. ఆ విధానం ప్రకారం ముందుకు వెళ్లామని తెలిపారు. రాజధానిపై రాబోయే కాలంలో ఏం జరగబోతోందనేది కాలమే చెబుతుందని ఆయన అన్నారు. మొత్తానికి అమరావతి రాజధాని అంశంపై రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి.
తాజావార్తలు
-
Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
-
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
-
Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
-
IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!