Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ap Minister Tg Bharath On New Industrial Policy In The State

Minister TG Bharath: ఏపీకి చంద్రబాబే పెద్ద బ్రాండ్..100 రోజుల్లో కొత్త పారిశ్రామిక విధానం

Published Date :July 31, 2024 , 6:00 pm
By Mahesh Jakki
  • ఏపీకి సరికొత్త పారిశ్రామిక విధానం తీసుకొస్తాం
  • 100 రోజుల్లో కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తాం
  • ఏపీకి చంద్రబాబే పెద్ద బ్రాండ్
  • పారిశ్రామిక వేత్తలకు నమ్మకం కలిగిస్తే చాలు పెట్టుబడులు వస్తాయన్న మంత్రి టీజీ భరత్
Minister TG Bharath: ఏపీకి చంద్రబాబే పెద్ద బ్రాండ్..100 రోజుల్లో కొత్త పారిశ్రామిక విధానం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister TG Bharath: వాళ్లు ఇష్టముంటే వాళ్లొస్తారు.. పరిశ్రమలు పెట్టాలనుకుంటే పెడతారు అనేది గత ప్రభుత్వ పాలసీ అని.. పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేయం.. ఛార్టెడ్ ఫ్లైట్ పెట్టేది లేదని గత ప్రభుత్వం చెప్పేసిందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తీవ్రంగా విమర్శించారు. 2014-19 మధ్య కాలంలో జరిగిన పారిశ్రామికాభివృద్ధిని ఆ తర్వాత ప్రభుత్వం అందుకోలేకపోయిందని మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా వస్తే.. వాటాలు అడిగే పరిస్థితి ఉందని ఆరోపించారు. ఏపీకి సరికొత్త పారిశ్రామిక విధానం తీసుకొస్తామని.. 100 రోజుల్లో కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Read Also: DSPs Transfer: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఒకేసారి 96 మంది డీఎస్పీల బదిలీ..

బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పాలసీని పరిశ్రమల కోసం తెస్తామని హామీ ఇచ్చారు. ఏపీకి చంద్రబాబే పెద్ద బ్రాండ్ అని.. పారిశ్రామిక వేత్తలకు నమ్మకం కలిగిస్తే చాలు పెట్టుబడులు వస్తాయన్నారు. పరిశ్రమలకు కావాల్సిన అనుమతులకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో భూముల ధరలను గత ప్రభుత్వం అమాంతం పెంచేసిందని.. మల్లవల్లి పారిశ్రామిక వాడలో భూముల ధరలను తగ్గిస్తామన్నారు. కొత్తగా నాలుగు ఇండస్ట్రీటల్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి.. కుప్పం, లేపాక్షి, దొనకొండ, మూలపేట ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రీయల్ క్లస్టర్లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. శ్రీ సిటీ తరహాలో ఇండస్ట్రీయల్ పార్కులను డెవలప్ చేస్తామన్నారు. పీపీపీ మోడల్‌లో ఇండస్ట్రీయల్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గతంతో పోల్చుకుంటే పారిశ్రామిక వేత్తల ఫ్లో అనేది పెరిగిందన్నారు. హోటళ్లల్లో ఆక్యుపెన్సీ కూడా పెరిగిందన్నారు. బీపీసీఎల్ పెట్టుబడులు పెట్టబోతోందని.. బీపీసీఎల్ రిఫైనరీ పెట్టేందుకు నాలుగు ప్రాంతాలను ఆప్షన్‌గా ఇచ్చామని మంత్రి టీజీ భరత్ చెప్పారు. మూలపేట, కాకినాడ, రామాయపట్నం, బందరు ప్రాంతాల్లో బీపీసీఎల్ రిఫైనరీ పెట్టాలని ప్రతిపాదనలు పెట్టామన్నారు. గత ప్రభుత్వంలో వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.గత ప్రభుత్వ తీరుతో కియా అనుబంధ పరిశ్రమలు పారిపోయాయని.. కియా అనుబంధ పరిశ్రమలు విస్తరణ ఏమైనా చెప్పట్టాలంటే మేం సహకరిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

Read Also: CM Chandrababu: 5 నూతన పాలసీలు, 4 చోట్ల కొత్త క్లస్టర్లు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఎంఎస్‌ఎంఈలకు రూ. 500 కోట్లు ప్రోత్సాహకాలు పెండింగులో ఉన్నాయన్నారు. పెండింగులో ఉన్న ఇన్సెంటీవ్స్‌ను కచ్చితంగా ఇస్తామని.. అయితే ఎప్పటిలోగా చేయగలమనేది చూస్తామన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచేయడం వల్ల చాలా పరిశ్రమలు భయపడిపోయాయని ఆయన తెలిపారు. గత పదేళ్ల కాలంలో ఎన్ని ఎంఓయూలు చేసుకున్నాం.. ఎన్ని గ్రౌండ్ అయ్యాయి.. ఇంకా గ్రౌండ్ కానివి ఏంటీ..? అనేది విశ్లేషిస్తున్నామని చెప్పుకొచ్చారు. స్థానిక యువతకు నైపుణ్యం పెంచేలా చేస్తామన్నారు. నైపుణ్యం ఉంటే.. స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు. స్థానికంగా నైపుణ్యం ఉన్న ఉద్యోగులు దొరికితే.. కంపెనీలు వాళ్లనే రిక్రూట్ చేసుకుంటాయని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Minister TG Bharath
  • ap news
  • latest news
  • Minister TG Bharath

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions