AP- TG: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్తో ఉత్తమ్కుమార్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ..!
- నాదెండ్ల ఆధ్వర్యంలోనే తెలంగాణ బిల్లు పాస్ అయింది
- ఆ క్రెడిట్ అప్పటి స్పీకర్ గా నాదెండ్లకు ఇవ్వాలి
- ఇరు రాష్ట్రాల విధానాలు, బెటర్ టెక్నాలజీ గురించి చర్చ
- తెలంగాణ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి వ్యాఖ్యలు
నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలోనే ఉమ్మడి ఏపీలో తెలంగాణ బిల్లు పాస్ అయిందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. ఆ క్రెడిట్ అప్పటి స్పీకర్గా నాదెండ్లకు ఇవ్వాలన్నారు. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇరు రాష్ట్రాల విధానాలు, బెటర్ టెక్నాలజీ గురించి చర్చించినట్లు తెలిపారు. కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్ పోర్ట్ చేస్తున్నామని.. ఇల్లీగల్ రైస్ కట్టడి గురించి మాట్లాడినట్లు చెప్పారు. అసెట్స్ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర విభజనలో సివిల్ సప్లై సగం బిల్డింగ్ ఏపీకి వెళ్ళిందని.. రెసిడెంట్స్ ప్లాట్ 16 పంజాగుట్టలో ఉన్నాయి. తెలంగాణకే రాబోతున్నాయని స్పష్టం చేశారు. తెలంగాణ సివిల్ సప్లై ఆఫీస్ బిల్డింగ్ ఇరుగ్గా ఉందని.. బయట మీటింగ్ లు పెట్టాల్సి వస్తోందన్నారు. ఫుడ్ రిలేటెడ్ డిపార్ట్ మెంట్ లు ఇక్కడే ఉండాలని ఈ ఏపీ బిల్డింగ్ అడిగినట్లు తెలిపారు. జూన్ 1 నుంచి పూర్తి బిల్డింగ్ మనకు అప్పగిస్తున్నారని స్పష్టం చేశారు. సివిల్ సప్లై ఆస్తులపై చర్చలు జరిగాయని.. కార్పొరేషన్ కు ఉన్న ఆస్తుల బదిలీ మీద మాట్లాడుతున్నట్లు వెల్లడించారు.
READ MORE: AP DSC 2025: సుప్రీంకోర్టులో లైన్ క్లియర్.. షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ..
Also Read
- Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
- Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!
- Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!
- Tollywood - Bollywood : బాలీవుడ్ హీరోలతో టాలీవుడ్ డైరెక్టర్స్
అనంతరం ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. “ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని… ఎవ్వరూ సమస్యలు ఎదుర్కోవద్దని.. ప్రజలకు మేలు చెయ్యాలని మా ఉద్దేశం. వీలైనంత త్వరగా మంచి వాతావరణంలో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం. 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఏపీ సివిల్ సప్లై భవన్ ను పూర్తిగా తెలంగాణకు అప్పగిస్తున్నాం. తెలంగాణలో అమల్లో ఉన్న టెక్నాలజి మార్పులను మేము అందుకుంటాం. తెలంగాణలో కొన్ని అద్భుతమైన సంస్కరణలు చేశారు. కాకినాడ నుంచి పిలిప్పిన్ కు బియ్యం ఎగుమతి చేస్తున్నాం.. దానికి అవసరమైన అన్ని సౌకర్యాల మీద చర్చించాం. ఆస్తుల బదిలీ జరగాల్సిన అవసరం ఉంది. రైతాంగానికి మేలు జరిగేలా ఆహార భద్రతలో లోపాలు లేకుండా చెయ్యాలని ఉద్దేశ్యం. జూన్ 12 నుంచి పాఠశాలల్లో సన్న బియ్యం అందించనున్నాం. ఎక్స్ పోర్ట్ మీద కూడా చర్చించాం… వినియోగదారులకు మేలు రకమైన బియ్యం అందుబాటు ధరలో ఉండాలనేది మా ఉద్దేశ్యం.” అని ఏపీ మంత్రి వ్యాఖ్యానించారు.
READ MORE: Dubbak Murder Case : 80 రోజుల పసికందును హత్య చేసిన తల్లి.. విచారణలో షాకింగ్ విషయాలు..!
తాజావార్తలు
-
Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
-
Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!
-
Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!
-
Tollywood – Bollywood : బాలీవుడ్ హీరోలతో టాలీవుడ్ డైరెక్టర్స్
-
Ravindra Jadeja: అయ్యబాబోయ్.. కాస్త ఉంటే అభిమానులను కొట్టేలాగా ఉన్నాడే.! వీడియో వైరల్
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?