AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. మాజీ మంత్రి కారుమూరి కుమారుడి అరెస్ట్..
- ఏపీ లిక్కర్ రవాణా అక్రమాల కేసులో కారుమూరి సునీల్ అరెస్ట్..
- కారుమురి సునీల్ ను అరెస్ట్ చేసిన ED ..
- లిక్కర్ రవాణా ద్వారా 195.33 కోట్ల కుంభకోణం కి పాల్పడినట్లు గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ రవాణా అక్రమాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న కారుమూరి సునీల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ ఏపీఎస్బీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డిలను అరెస్ట్ చేసిన ఈడీ, తాజాగా సునీల్ను అదుపులోకి తీసుకుంది. ఇక, అరెస్ట్ అనంతరం కారుమూరి సునీల్కు హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను నాంపల్లిలోని ఈడీ ప్రత్యేక కోర్టుకు తరలించారు. మరికాసేపట్లో ఆయనను కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, లిక్కర్ రవాణా ఒప్పందాల వ్యవహారంలో సుమారు రూ.195.33 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. టెండర్ల కేటాయింపులో నిబంధనలను ఉల్లంఘించి అక్రమ లాభాలు పొందినట్లు ఈడీ ఆరోపిస్తోంది. జిల్లా స్థాయిలో ఒక్కో కార్టన్కు సగటున రూ.19.68గా ఉన్న రవాణా రేట్లను రూ.35.57 వరకు పెంచి భారీ మొత్తంలో లాభాలు ఆర్జించినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. అలాగే స్థానిక రాజకీయ నాయకులు, వారి అనుబంధ వ్యక్తులు, సంస్థలకు సబ్ కాంట్రాక్టులు కేటాయించే సమాంతర వ్యవస్థను నిర్వహించినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది.
Also Read
- Telegram: టెలిగ్రామ్కు బిగుస్తున్న ఉచ్చు.. "డార్క్వెబ్"గా మారిందన్న కేంద్రం..
- Sanjay Raut: తప్పంతా సుప్రీంకోర్టుదే.. ఎంపీల తిరుగుబాటుపై సంజయ్ రౌత్..
- Six Sixes Challenge: డబుల్ సెంచరీ కలను చెదరగొట్టిన ఒక్క షాట్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- US: న్యూయార్లో విషాదం.. గుర్రపు బండి పైనుంచి పడి భారతీయ యువకుడు మృతి
ఈ వ్యవహారంలో అప్పటి ఏపీఎస్బీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు ఈడీ ఆరోపిస్తోంది. చట్టబద్ధంగా అమల్లో ఉన్న జిల్లా స్థాయి రవాణా విధానాన్ని రద్దు చేసి, ప్రభుత్వ అనుమతి లేకుండానే రాష్ట్రవ్యాప్త కేంద్రీకృత రవాణా విధానాన్ని అమలు చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు అధికారులు పేర్కొన్నారు. లిక్కర్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ, మనీలాండరింగ్ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తోంది. కారుమూరి సునీల్ అరెస్ట్తో ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. మాజీ మంత్రి కారుమూరి కుమారుడి అరెస్ట్..
-
Telegram: టెలిగ్రామ్కు బిగుస్తున్న ఉచ్చు.. “డార్క్వెబ్”గా మారిందన్న కేంద్రం..
-
Tollywood: టాలీవుడ్ కాదు.. ఇంటర్నేషనల్!
-
Divija Prabhakar : కొడుకొచ్చేసాడు.. ఇక ఇప్పుడు కూతురి వంతు
-
NEET Re Exam : విద్యార్థులకు గుడ్న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!