AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. మాజీ మంత్రి కారుమూరి కుమారుడి అరెస్ట్..
- ఏపీ లిక్కర్ రవాణా అక్రమాల కేసులో కారుమూరి సునీల్ అరెస్ట్..
- కారుమురి సునీల్ ను అరెస్ట్ చేసిన ED ..
- లిక్కర్ రవాణా ద్వారా 195.33 కోట్ల కుంభకోణం కి పాల్పడినట్లు గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ రవాణా అక్రమాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న కారుమూరి సునీల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ ఏపీఎస్బీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డిలను అరెస్ట్ చేసిన ఈడీ, తాజాగా సునీల్ను అదుపులోకి తీసుకుంది. ఇక, అరెస్ట్ అనంతరం కారుమూరి సునీల్కు హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను నాంపల్లిలోని ఈడీ ప్రత్యేక కోర్టుకు తరలించారు. మరికాసేపట్లో ఆయనను కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, లిక్కర్ రవాణా ఒప్పందాల వ్యవహారంలో సుమారు రూ.195.33 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. టెండర్ల కేటాయింపులో నిబంధనలను ఉల్లంఘించి అక్రమ లాభాలు పొందినట్లు ఈడీ ఆరోపిస్తోంది. జిల్లా స్థాయిలో ఒక్కో కార్టన్కు సగటున రూ.19.68గా ఉన్న రవాణా రేట్లను రూ.35.57 వరకు పెంచి భారీ మొత్తంలో లాభాలు ఆర్జించినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. అలాగే స్థానిక రాజకీయ నాయకులు, వారి అనుబంధ వ్యక్తులు, సంస్థలకు సబ్ కాంట్రాక్టులు కేటాయించే సమాంతర వ్యవస్థను నిర్వహించినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది.
Also Read
- El Nino: తీవ్ర స్థాయిలోకి ఎల్నినో.. శాస్త్రవేత్తలు హెచ్చరిక
- Alibaba AI: మెటా, గూగుల్ను వెనక్కి నెట్టి.. మూడు బిలియన్ డౌన్లోడ్లు దాటిన అలీబాబా ఏఐ మోడల్స్..
- Pakistan: "పాకిస్తాన్లోని 4% హిందువులను సహిస్తున్నాం".. మిస్టర్ 10% జర్దారీ సంచలన వ్యాఖ్యలు..
- Andhra Cricket Association: ఏపీ మహిళా క్రీడాకారులకు శుభవార్త.. సెప్టెంబర్ 15 నుంచే ప్రారంభం..
ఈ వ్యవహారంలో అప్పటి ఏపీఎస్బీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు ఈడీ ఆరోపిస్తోంది. చట్టబద్ధంగా అమల్లో ఉన్న జిల్లా స్థాయి రవాణా విధానాన్ని రద్దు చేసి, ప్రభుత్వ అనుమతి లేకుండానే రాష్ట్రవ్యాప్త కేంద్రీకృత రవాణా విధానాన్ని అమలు చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు అధికారులు పేర్కొన్నారు. లిక్కర్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ, మనీలాండరింగ్ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తోంది. కారుమూరి సునీల్ అరెస్ట్తో ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
El Nino: తీవ్ర స్థాయిలోకి ఎల్నినో.. శాస్త్రవేత్తలు హెచ్చరిక
-
Alibaba AI: మెటా, గూగుల్ను వెనక్కి నెట్టి.. మూడు బిలియన్ డౌన్లోడ్లు దాటిన అలీబాబా ఏఐ మోడల్స్..
-
Pakistan: “పాకిస్తాన్లోని 4% హిందువులను సహిస్తున్నాం”.. మిస్టర్ 10% జర్దారీ సంచలన వ్యాఖ్యలు..
-
Andhra Cricket Association: ఏపీ మహిళా క్రీడాకారులకు శుభవార్త.. సెప్టెంబర్ 15 నుంచే ప్రారంభం..
-
Omar Abdullah: ఆర్టికల్ 370 రద్దు కాకుంటే, పీఓకే కూడా కాశ్మీర్లో కలిసేదే..
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!