AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Junior Doctors Strike: స్టైఫండ్ పెంపు డిమాండ్తో సమ్మె చేస్తున్న ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్లతో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. స్టైఫండ్ పెంపు విషయంలో ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో చర్చలు అసంపూర్తిగా ముగియగా.. జూనియర్ డాక్టర్లు మాత్రం సమ్మె కొనసాగిస్తున్నారు.. అంతేకాదు.. తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు జూడాలు..
స్టైఫండ్ను 30 శాతం పెంచాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న జూనియర్ డాక్టర్లు.. కనీసం 20 శాతం అయినా పెంచాలని చర్చల సందర్భంగా కోరినట్లు తెలిపారు. అయితే 20 శాతం పెంపు కూడా సాధ్యం కాదని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేసినట్లు సమాచారం. జూనియర్ డాక్టర్లకు ఏటా 3 శాతం, హౌస్ సర్జన్లకు 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్ ఇచ్చే అంశాన్ని మంత్రి సత్యకుమార్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆర్థిక శాఖ అధికారులతో చర్చించిన తర్వాత మరోసారి జూనియర్ డాక్టర్లతో సమావేశమవుతామని మంత్రి సత్యకుమార్ చెప్పినట్లు సమాచారం. దీంతో సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉంది.
Also Read
- AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
- Pramod Sawant: అనుభవం.. స్థిరత్వం.. ఆ తర్వాతే రాజకీయాలు.. 40 ఏళ్ల తర్వాతే పాలిటిక్స్లోకి రావాలి..!
- CM Chandrababu : చంద్రబాబు ఫుల్ బిజీ.. ఉత్తరాంధ్రలో ఒక్కరోజే 3 జిల్లాలు..
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
సమ్మె కొనసాగిస్తామన్న జూడాలు
అయితే ప్రభుత్వం నుంచి తమ ప్రధాన డిమాండ్పై స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు తేల్చిచెప్పారు. దీంతో జూడాలు యథావిధిగా విధులకు దూరంగా ఉండి సమ్మె కొనసాగిస్తున్నారు. స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని జూడాల ప్రతినిధులు స్పష్టం చేశారు. మరోవైపు.. ఇదిలా ఉండగా రాష్ట్ర జూడాల సంఘం సమావేశం రేపు ఉదయం సిద్ధార్థ మెడికల్ కాలేజీలో జరగనుంది. ఈ సమావేశంలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించి, సమ్మెను మరింత ఉధృతం చేసే దిశగా భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం APJUDA రాష్ట్ర ప్యానెల్ మీడియాతో మాట్లాడి.. చర్చల్లో జరిగిన అంశాలు, తమ తదుపరి కార్యాచరణపై పూర్తి వివరాలను వెల్లడించనుంది.
తాజావార్తలు
-
Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
-
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
-
BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!