Minister Anitha: హెట్రో పరిశ్రమ ఘటనపై హై లెవల్ కమిటీ ఏర్పాటు చేస్తాం
- హెట్రో పరిశ్రమలో సోడియం హైపోక్లోరైట్ గ్యాస్ లీక్ ఘటనపై స్పందించిన హోమ్ మినిస్టర్ అనిత.
- ఘటనపై హై లెవల్ కమిటీ ఏర్పాటు చేస్తాం.
- కేజీహెచ్ ఘటనలో రౌడీ షీటర్ను అరెస్టు చేసినట్లు తెలిపారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anitha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హెట్రో పరిశ్రమలో సోడియం హైపోక్లోరైట్ గ్యాస్ లీక్ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయంపై రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందించారు. తక్షణ చర్యల్లో భాగంగా ముగ్గురు బాధితులను మెరుగైన వైద్యం కోసం కేర్ ఆసుపత్రికి తరలించామని హోంమంత్రి తెలిపారు. ప్రస్తుతం ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో బాధితులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా సమగ్ర వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
Also Read: YSR Congress Party: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సీఎం చిత్తశుద్ధితో పని చేస్తున్నారా..?
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
పరిశ్రమల్లో భద్రతాపరమైన చర్యలు, పొల్యూషన్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని హోంమంత్రి వెల్లడించారు. భద్రతాపరమైన అంశాలపై హెట్రో పరిశ్రమలో ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, ఎమ్మెల్సీ కోడ్ కారణంగా ఇప్పటివరకు సమావేశం నిర్వహించలేకపోయామని, త్వరలో ఆ సమావేశం నిర్వహిస్తామని హోంమంత్రి తెలిపారు. పరిశ్రమల్లో భద్రత పెంచడంపై హై లెవల్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే పరిశ్రమలు సహాయక చర్యలు చేపట్టేలా సిద్ధంగా ఉండాలని పరిశ్రమలకు సూచించారు.
Also Read: Aadhar card: భారతదేశంలో ఆ రాష్ట్రంలో ఆధార్ కార్డులు నిషేధం!.. కారణం ఏంటంటే?
అలాగే కేజీహెచ్ ఘటనపై హోంమంత్రి మాట్లాడుతూ, ఈ ఘటనలో రౌడీ షీటర్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. కేజీహెచ్ ఆసుపత్రిని త్వరలో సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తామని వెల్లడించారు. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి తెలిపారు. గంజాయి సరఫరా చేయడం, వినియోగం చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామని, డ్రైన్స్ ద్వారా గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెంచుతున్నామని హోంమంత్రి చెప్పారు. జైళ్లలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచుతున్నామన్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా భద్రతా ప్రమాణాలు కట్టుదిట్టం చేస్తామని హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
-
Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
-
Summer Special: మామిడితో ఈ మ్యాజిక్ ట్రై చేశారా..? ఒక్క స్పూన్ తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!