Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకీ పెరుగుతోన్న ఎండల తీవ్రత.
- కోస్తాంధ్ర జిల్లాల్లో ఆదివారం వరకు అధిక ఉష్ణోగ్రతల హెచ్చరిక
- నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.3°C అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
- కడప, తిరుపతి, అనకాపల్లి, కర్నూలు జిల్లాల్లో 42°C పైగా ఉష్ణోగ్రతలు
- మే 20, 21 తేదీల్లో 45°C నుంచి 47°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Heat Wave Alert: ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. కోస్తాంధ్ర జిల్లాల్లో ఆదివారం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నేడు నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో రాష్ట్రంలోనే అత్యధికంగా 44.3°C ఉష్ణోగ్రత నమోదైంది. కడపలో 42.9°C, తిరుపతి జిల్లా రాయలచెరువులో 42.8°C, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, కర్నూలు జిల్లా తోవిలో 42.7°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే మార్కాపురం జిల్లా నందన మారెళ్లలో 42.6°C, నంద్యాల జిల్లా పెద్ద దేవలాపురం, పల్నాడు జిల్లా గురజాలలో 42.5°C, అన్నమయ్య జిల్లా నూలివీడులో 42.4°C, అనంతపురం జిల్లా రాయదుర్గం, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో 42.1°C గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి, సంబంధిత మండల అధికారులకు ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలకు క్షేత్రస్థాయిలో హెచ్చరిక సందేశాలు పంపుతున్నామని వెల్లడించారు. మంగళవారం (మే 19) విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44°C నుంచి 46°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో 42°C నుంచి 44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
Also Read
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
- KTR: 'రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి'..
- SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
- CJP Parliament March: ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.. పార్లమెంట్ వరకు దూసుకెళ్లిన CJP కార్యకర్తలు..
మే 20, 21 తేదీల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముందని APSDMA హెచ్చరించింది. కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో 45°C నుంచి 47°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లో తీవ్ర ఎండలు ఉండనున్నాయి. అలాగే కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 42°C నుంచి 44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
రేపు రాష్ట్రంలోని 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 88 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎల్లుండి పరిస్థితి మరింత తీవ్రమై 177 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 255 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండవచ్చని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలకు కొన్ని ముఖ్య సూచనలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని, వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తాజావార్తలు
-
India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
-
KTR: ‘రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి’..
-
Hindu Rituals: హిందూ సంప్రదాయంలో అందరికీ దహన సంస్కారమేనా? ఈ 5 మందిని కాల్చొద్దని ఎందుకు చెబుతారు?
-
Rohit Sharma: అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం ఇష్టం.. నేను చాలా ఎంజాయ్ చేస్తా!
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
ట్రెండింగ్
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!