Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకీ పెరుగుతోన్న ఎండల తీవ్రత.
- కోస్తాంధ్ర జిల్లాల్లో ఆదివారం వరకు అధిక ఉష్ణోగ్రతల హెచ్చరిక
- నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.3°C అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
- కడప, తిరుపతి, అనకాపల్లి, కర్నూలు జిల్లాల్లో 42°C పైగా ఉష్ణోగ్రతలు
- మే 20, 21 తేదీల్లో 45°C నుంచి 47°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Heat Wave Alert: ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. కోస్తాంధ్ర జిల్లాల్లో ఆదివారం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నేడు నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో రాష్ట్రంలోనే అత్యధికంగా 44.3°C ఉష్ణోగ్రత నమోదైంది. కడపలో 42.9°C, తిరుపతి జిల్లా రాయలచెరువులో 42.8°C, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, కర్నూలు జిల్లా తోవిలో 42.7°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే మార్కాపురం జిల్లా నందన మారెళ్లలో 42.6°C, నంద్యాల జిల్లా పెద్ద దేవలాపురం, పల్నాడు జిల్లా గురజాలలో 42.5°C, అన్నమయ్య జిల్లా నూలివీడులో 42.4°C, అనంతపురం జిల్లా రాయదుర్గం, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో 42.1°C గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి, సంబంధిత మండల అధికారులకు ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలకు క్షేత్రస్థాయిలో హెచ్చరిక సందేశాలు పంపుతున్నామని వెల్లడించారు. మంగళవారం (మే 19) విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44°C నుంచి 46°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో 42°C నుంచి 44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
Also Read
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
మే 20, 21 తేదీల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముందని APSDMA హెచ్చరించింది. కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో 45°C నుంచి 47°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లో తీవ్ర ఎండలు ఉండనున్నాయి. అలాగే కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 42°C నుంచి 44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
రేపు రాష్ట్రంలోని 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 88 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎల్లుండి పరిస్థితి మరింత తీవ్రమై 177 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 255 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండవచ్చని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలకు కొన్ని ముఖ్య సూచనలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని, వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తాజావార్తలు
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!