AP Govt: ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల.. వారికి మాత్రం తప్పనిసరి!
- ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల
- ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేస్తే బదిలీ తప్పనిసరి
- సొంత మండలంలో నో పోస్టింగ్
- భార్యా భర్తల ఒకే చోట పోస్టింగ్లకు ప్రాధాన్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో గ్రామ/వార్డ్, సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. గ్రామ/వార్డ్, సచివాలయ ఉద్యోగుల రేషనలైజెషన్ తర్వాత ప్రభుత్వం బదిలీలు చేస్తోంది. ఒకే చోట ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేస్తే.. బదిలీ తప్పనిసరి అని ఉత్తర్వులు జారీ చేసింది. 5 సంవత్సరాలు కాలం పూర్తికాని వారు వ్యక్తిగత అభ్యర్థన మేరకు బదిలీకి అర్హులుగా పేర్కొంది. ఉద్యోగికి తన సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వకూడదని స్పష్టం చేసింది. దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు, భార్యా భర్తలు ఒకే చోట పోస్టింగ్లకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వనుంది.
ఖాళీల వివరాలు హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. బదిలీ ఉత్తర్వులు జిల్లా కలెక్టర్లు జారీ చేస్తారని పేర్కొంది. బదిలీ యూనిట్ పాత జిల్లాల ఆధారంగా ఉంటుందని పేర్కొంది. మొత్తం బదిలీ ప్రక్రియ ఈ నెల 30లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది. 5 సంవత్సరాలు పూర్తికాని ఉద్యోగులకై ఆన్లైన్ ద్వారా బదిలీ అభ్యర్థన ఇచ్చే సదుపాయంను కల్పించింది. దృష్టిహీనులైన వారు స్వచ్చందంగా కోరితే మాత్రమే బదిలీ ఉంటుంది. మానసికంగా వెనుకబడి ఉన్న పిల్లల తల్లిదండ్రులు, గిరిజన ప్రాంతాల్లో రెండు ఏళ్లకు పైగా పనిచేసిన వారు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యంతో ఉన్నవారు, దీర్ఘకాలిక అనారోగ్య కారణాలతో బదిలీ కోరినవారు, కంటుబడిన ఉద్యోగినులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.
Also Read
- Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
- Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
- Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
Also Read: Yogandhra 2025: ప్రధాన వేదిక ఆర్కే బీచ్.. మార్పు చేయాల్సి వస్తే?
భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఒకే ప్రాంతంలో పోస్టింగ్కి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది. ఐటీడీఏ మరియు వెనుకబడిన ప్రాంతాల్లో ముందుగా ఖాళీలు పూర్తి చేయాలని ఆదేశించింది. ఐటీడీఏ ప్రాంతాల్లో బదిలీ అయిన వారిని ప్రత్యామ్నాయ ఉద్యోగి జాయిన్ చేసిన తరువాతే రిలీవ్ చేయాలన్న నిబంధన పెట్టింది. బదిలీ అయిన వారు సూచించిన స్థలానికి చేరుకోకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. బకాయి చెల్లింపులు చెల్లించకుండా ఏ ఉద్యోగినీ ఉద్యోగినీ రిలీవ్ చేయకూడదు. హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో అన్ని ఉద్యోగుల వివరాలను జులై 10లోపు అప్డేట్ చేయాలని పేర్కొంది.
తాజావార్తలు
-
Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
-
Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
-
Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
-
Honor Turbo 5G: హానర్ టర్బో 5G విడుదల.. 8,560mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో కొత్త 5G ఫోన్
-
ToxicTheMovie : ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్లు కూలి విద్యార్థులకు గాయాలు
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!