AP Government: విద్యార్థులకు గుడ్న్యూస్.. కాలేజీల వద్దే ఉన్న సర్టిఫికెట్లు ఇప్పించేందుకు ప్రభుత్వం కసరత్తు..
- కాలేజీల వద్దే ఉండిపోయిన విద్యార్థుల సర్టిఫికెట్ల అంశంపై ప్రభుత్వం కసరత్తు..
- మొత్తం ఎంత మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల వద్ద ఉన్నాయని మంత్రి లోకేష్ ఆరా..
- రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల వద్దే..
- విద్యార్థులకు వారి సర్టిఫికెట్లు ఒకేసారి ఇప్పించేలా సర్కార్ కసరత్తు..
AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా కసరత్తు చేస్తోంది.. వివిధ కారణాలతో కాలేజీల వద్దే ఉండిపోయిన విద్యార్థుల సర్టిఫికెట్ల అంశంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. మొత్తం ఎంత మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యాల వద్ద ఉన్నాయోనని మంత్రి నారా లోకేష్ ఆరా తీస్తున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల వద్దే ఉండిపోయాయని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. అయితే, 8 లక్షల మంది బాధిత విద్యార్థులకు వారి సర్టిఫికెట్లను ఒకేసారి ఇప్పించేలా కసరత్తు చేస్తోంది సర్కార్.. పెండింగ్లో ఉన్న రూ. 3500 కోట్ల మేర విద్యా దీవెన సొమ్మును చెల్లించేలా ప్లాన్ చేస్తున్నారు.. అయితే, గత ప్రభుత్వం విద్యా దీవెన చెల్లింపులు పెండింగులో పెట్టడంతో సర్టిఫికెట్లను ఆయా కాలేజీలు.. వారి దగ్గర పెట్టుకున్నట్టుగా చెబుతున్నారు.. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా.. త్వరలో కాలేజీ యాజమాన్యాలతో సమావేశం కానున్నారట మంత్రి నారా లోకేష్. మొత్తంగా ఆరు విడతల్లో విద్యా దీవెన బకాయిలు చెల్లించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా చెబుతున్నారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
కాగా, ఫీజు సంబంధిత వ్యవహారాలతో చాలా కాలేజీలు విద్యార్థుల చదువులు పూర్తి అయినా.. వారి సర్టిఫికెట్లను మాత్రం కొన్ని కాలేజీలు వాటి దగ్గర పెట్టుకుంటున్నాయి.. దీంతో.. విద్యార్థులు పై చదువులకు వెళ్లాలన్నా.. ఇతర ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలకు వెళ్లాల్సిన ఇచ్చినా.. వారికి ఇబ్బందిగా మారుతుంది.. ఇక, విద్యార్థుల సమస్యలపై ఫోకస్ పెట్టిన మంత్రి నారా లోకేష్.. వారికి సంబంధిచిన సర్టిఫికెట్లు విద్యార్ధులకు ఇప్పించడంపై ఫోకస్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!