Face Recognition System: ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్.. హెచ్వోడీలు, జిల్లా కలెక్టర్లకు మెమోలు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Face Recognition System: ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని శాఖల్లో అటెండెన్స్ సరిగా లేదంటూ సీరియస్ అవుతుంది ప్రభుత్వం.. దీనికి 100 శాతం అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలంటూ.. అన్ని శాఖల సెక్రటరీలు.. హెచ్వోడీలు, జిల్లా కలెక్టర్లకు మెమోలు జారీ చేసింది జీఏడీ.. ఫేస్ రికగ్నిషన్ విధానం (FRS) ద్వారా పూర్తి స్థాయిలో ఉద్యోగుల అటెండెన్స్ వేయడం లేదంటూ సీరియస్ అయిన ప్రభుత్వం.. ఫేస్ రికగ్నిషన్ యాప్ ను 100 శాతం ఎన్రోల్ చేసుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఇప్పటికీ కేవలం 45-50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే FRS ద్వారా అటెండెన్స్ వేస్తున్నారని జీఏడీ గుర్తించింది.. చాలా మంది ఉద్యోగులు ఉదయం FRS ద్వారా చెక్ ఇన్ అవుతున్నారు.. కానీ, చెక్ అవుట్ కాకపోవడంపై జీఏడీ అభ్యంతరం వ్యక్తం చేసింది..
Read Also: Stock Market Opening: కోలుకున్న స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 330 పాయింట్లు, నిఫ్టీలో కూడా పెరుగుదల
Also Read
- Punjab: చిక్కుల్లో పంజాబ్ సీఎం మాన్ భార్య.. అత్యాచార కేసు లంచంపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశం
- 64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
- Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే 'క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్' సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
- CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
ఇక, ఉద్యోగుల సెలవులను FRS విధానం ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉన్నా.. దానిని చాలా మంది ఫాలో కావడం లేదంటున్నారు జీఏడీ అధికారులు.. ఇంఛార్జ్ల పర్యవేక్షణలో లోపం వల్లే FRS అమలు సరిగా లేదనే అభిప్రాయానికి వచ్చింది.. FRS సరిగా అమలయ్యేలా ఇంఛార్జ్లు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని శాఖల సెక్రటరీలు, హెచ్వోడీలు, జిల్లా కలెక్టర్లకు మెమోలు జారీ చేసింది జీఏడీ. కాగా, ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మొదటల్లో దీనిపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు ఉద్యోగులు.. అయితే, ఏ మాత్రం వెనక్కి తగ్గని ప్రభుత్వం.. అక్రమంగా అన్ని విభాగాలకు ఎఫ్ఆర్ఎస్ని విస్తరించింది.. కానీ, ఇప్పటికీ అన్ని విభాగాల్లో పూర్తి స్థాయిలో ఇది అమలు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం.
తాజావార్తలు
-
Punjab: చిక్కుల్లో పంజాబ్ సీఎం మాన్ భార్య.. అత్యాచార కేసు లంచంపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశం
-
Mythri Movie Makers: మైత్రీ రిస్క్కు అదిరిపోయే రిజల్ట్.. ‘ఇరుముడి’ బ్లాక్బస్టర్ వెనుక ఆసక్తికర కథ!
-
Spirit Controversy: వంగా బ్రదర్స్ ఆరోపణలపై దీపికా పదుకొణె పరోక్ష కౌంటర్.. ఆ ఒక్క లైక్తో సంచలనం!
-
Saha: థియేటర్లలోకి శివ కుమార్ కాసారం ‘సహ’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!