Stock Market Opening: కోలుకున్న స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 330 పాయింట్లు, నిఫ్టీలో కూడా పెరుగుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Opening: ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన యుద్ధం భారత స్టాక్ మార్కెట్లో సోమవారం ప్రకంపనలు సృష్టించింది. వారం మొదటి రోజు మార్కెట్ భారీ పతనంతో ప్రారంభమైంది. నేడు కాస్త కోలుకుని.. స్థిరంగా ఉంది. సెన్సెక్స్-నిఫ్టీ లాభాలతో మొదలైంది. నేడు సెన్సెక్స్ 0.51 శాతం లేదా 331.12 పాయింట్లు పెరిగి 65,843.51 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 0.53 శాతం లేదా 103.10 పాయింట్లు మెరుగుపడి 19,615.45 వద్ద ట్రేడవుతోంది. అయినప్పటి నిన్నటి పతనం నుంచి ఇంకా కోలుకోలేకపోయింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన యుద్ధం కారణంగా సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 483 పాయింట్లు నష్టపోయి 65,512 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 141 పాయింట్లు నష్టపోయి 19,512 వద్ద ఉన్నాయి. మార్కెట్ ముగిసే వరకు అన్ని స్టాక్లు రెడ్ జోన్లో ట్రేడ్ అవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటే బిఎస్ఇ సెన్సెక్స్ నేడు 65,662.27 పాయింట్ల వద్ద, నిఫ్టీ 19,565.60 వద్ద ప్రారంభమయ్యాయి. ఫార్మా, ఆరోగ్య రంగాలు మినహా అన్ని రంగాలు గ్రీన్ జోన్లో వ్యాపారం చేస్తున్నాయి. బీఎస్ఈకి చెందిన మూడు స్టాక్లు మినహా అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
Read Also:America : ప్రపంచంలో రెండో అతి పెద్ద హిందూ దేవాలయం.. అమెరికాలో ప్రారంభం
భారతీ ఎయిర్టెల్ అత్యధికంగా లాభపడింది. 2.77 శాతం జంప్తో ఒక్కో షేరు రూ.950.45గా ఉంది. దీని తర్వాత టాటా మోటార్స్, మారుతీ సుజుకి, మహీంద్రా & మహీంద్రా, కోటక్ బ్యాంక్, ఐఎఫ్సిస్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్సిఎల్, ఐటిసి, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, ఎల్టి, బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, ఎస్బిఐఎన్, టాటా స్టీల్, రిలయన్స్, పవర్ గ్రిడ్, హిందుస్థాన్ యూనిలీవర్, సన్ ఫార్మా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, జెఎస్డబ్ల్యు స్టీల్, నెస్లే ఇండియా వంటి షేర్లు ఊపందుకున్నాయి. పడిపోతున్న నాలుగు స్టాక్లలో ఎన్టిపిసి, ఏషియన్ పెయింట్స్, టిసిఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఉన్నాయి.
ఫార్మా, హెల్త్కేర్ రంగంలో క్షీణత
సోమవారం దాదాపు అన్ని రంగాల్లో క్షీణత కనిపించగా, మంగళవారం రెండు రంగాలు మినహా అన్ని రంగాలు గ్రీన్ జోన్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ 0.49 శాతం పెరిగింది. రియాలిటీ రంగం అత్యధికంగా 2.88 శాతం పెరిగింది. దీని తర్వాత ఆటో, ప్రైవేట్ బ్యాంకులు, పీఎస్యూ బ్యాంకులు, మీడియా రంగాల్లో వృద్ధి కనిపిస్తోంది.
Read Also:Karnataka: 30యూపీఐ స్కానర్లు.. రూ.1.47కోట్ల నగదు.. బిర్యానీ దుకాణం యజమాని బండారం బట్టబయలు
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?