Stock Market Opening: కోలుకున్న స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 330 పాయింట్లు, నిఫ్టీలో కూడా పెరుగుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Opening: ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన యుద్ధం భారత స్టాక్ మార్కెట్లో సోమవారం ప్రకంపనలు సృష్టించింది. వారం మొదటి రోజు మార్కెట్ భారీ పతనంతో ప్రారంభమైంది. నేడు కాస్త కోలుకుని.. స్థిరంగా ఉంది. సెన్సెక్స్-నిఫ్టీ లాభాలతో మొదలైంది. నేడు సెన్సెక్స్ 0.51 శాతం లేదా 331.12 పాయింట్లు పెరిగి 65,843.51 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 0.53 శాతం లేదా 103.10 పాయింట్లు మెరుగుపడి 19,615.45 వద్ద ట్రేడవుతోంది. అయినప్పటి నిన్నటి పతనం నుంచి ఇంకా కోలుకోలేకపోయింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన యుద్ధం కారణంగా సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 483 పాయింట్లు నష్టపోయి 65,512 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 141 పాయింట్లు నష్టపోయి 19,512 వద్ద ఉన్నాయి. మార్కెట్ ముగిసే వరకు అన్ని స్టాక్లు రెడ్ జోన్లో ట్రేడ్ అవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటే బిఎస్ఇ సెన్సెక్స్ నేడు 65,662.27 పాయింట్ల వద్ద, నిఫ్టీ 19,565.60 వద్ద ప్రారంభమయ్యాయి. ఫార్మా, ఆరోగ్య రంగాలు మినహా అన్ని రంగాలు గ్రీన్ జోన్లో వ్యాపారం చేస్తున్నాయి. బీఎస్ఈకి చెందిన మూడు స్టాక్లు మినహా అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి.
Also Read
- Trinamool Congress: చీలిక దిశగా మమత పార్టీ.. 50 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై..!
- DK.Shivakumar: రేపే సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణం.. కేబినెట్లో వీరికి బెర్త్ కన్ఫాం!
- India On Nepal: నేపాల్ ప్రధానికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. ఎందుకంటే..
- CBSE OSM Controversy: OSM వ్యవహారంపై కేంద్రం సీరియస్.. CBSE ఉన్నతాధికారులపై వేటు
Read Also:America : ప్రపంచంలో రెండో అతి పెద్ద హిందూ దేవాలయం.. అమెరికాలో ప్రారంభం
భారతీ ఎయిర్టెల్ అత్యధికంగా లాభపడింది. 2.77 శాతం జంప్తో ఒక్కో షేరు రూ.950.45గా ఉంది. దీని తర్వాత టాటా మోటార్స్, మారుతీ సుజుకి, మహీంద్రా & మహీంద్రా, కోటక్ బ్యాంక్, ఐఎఫ్సిస్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్సిఎల్, ఐటిసి, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, ఎల్టి, బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, ఎస్బిఐఎన్, టాటా స్టీల్, రిలయన్స్, పవర్ గ్రిడ్, హిందుస్థాన్ యూనిలీవర్, సన్ ఫార్మా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, జెఎస్డబ్ల్యు స్టీల్, నెస్లే ఇండియా వంటి షేర్లు ఊపందుకున్నాయి. పడిపోతున్న నాలుగు స్టాక్లలో ఎన్టిపిసి, ఏషియన్ పెయింట్స్, టిసిఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఉన్నాయి.
ఫార్మా, హెల్త్కేర్ రంగంలో క్షీణత
సోమవారం దాదాపు అన్ని రంగాల్లో క్షీణత కనిపించగా, మంగళవారం రెండు రంగాలు మినహా అన్ని రంగాలు గ్రీన్ జోన్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ 0.49 శాతం పెరిగింది. రియాలిటీ రంగం అత్యధికంగా 2.88 శాతం పెరిగింది. దీని తర్వాత ఆటో, ప్రైవేట్ బ్యాంకులు, పీఎస్యూ బ్యాంకులు, మీడియా రంగాల్లో వృద్ధి కనిపిస్తోంది.
Read Also:Karnataka: 30యూపీఐ స్కానర్లు.. రూ.1.47కోట్ల నగదు.. బిర్యానీ దుకాణం యజమాని బండారం బట్టబయలు
తాజావార్తలు
-
Buchibabu : ‘మ్యూజిక్’ అనడమే రాని స్థితి నుండి.. రెహమాన్ పక్కన కూర్చునే వరకు!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Trinamool Congress: చీలిక దిశగా మమత పార్టీ.. 50 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై..!
-
AR Rahman: ఇక మీదట నా అన్ని సినిమాలు ఆయనే మ్యూజిక్ డైరెక్టర్: బుచ్చిబాబు
-
Rahman: కార్ తీసుకొని స్టూడియోకి వెళ్లేసరికి మూడ్ పోతుంది!
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!