Stock Market Opening: కోలుకున్న స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 330 పాయింట్లు, నిఫ్టీలో కూడా పెరుగుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Opening: ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన యుద్ధం భారత స్టాక్ మార్కెట్లో సోమవారం ప్రకంపనలు సృష్టించింది. వారం మొదటి రోజు మార్కెట్ భారీ పతనంతో ప్రారంభమైంది. నేడు కాస్త కోలుకుని.. స్థిరంగా ఉంది. సెన్సెక్స్-నిఫ్టీ లాభాలతో మొదలైంది. నేడు సెన్సెక్స్ 0.51 శాతం లేదా 331.12 పాయింట్లు పెరిగి 65,843.51 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 0.53 శాతం లేదా 103.10 పాయింట్లు మెరుగుపడి 19,615.45 వద్ద ట్రేడవుతోంది. అయినప్పటి నిన్నటి పతనం నుంచి ఇంకా కోలుకోలేకపోయింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన యుద్ధం కారణంగా సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 483 పాయింట్లు నష్టపోయి 65,512 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 141 పాయింట్లు నష్టపోయి 19,512 వద్ద ఉన్నాయి. మార్కెట్ ముగిసే వరకు అన్ని స్టాక్లు రెడ్ జోన్లో ట్రేడ్ అవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటే బిఎస్ఇ సెన్సెక్స్ నేడు 65,662.27 పాయింట్ల వద్ద, నిఫ్టీ 19,565.60 వద్ద ప్రారంభమయ్యాయి. ఫార్మా, ఆరోగ్య రంగాలు మినహా అన్ని రంగాలు గ్రీన్ జోన్లో వ్యాపారం చేస్తున్నాయి. బీఎస్ఈకి చెందిన మూడు స్టాక్లు మినహా అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి.
Also Read
- Ketan Agarwal Case: 'పెళ్లి నుంచి తప్పించుకోలేవు'.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
- Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
Read Also:America : ప్రపంచంలో రెండో అతి పెద్ద హిందూ దేవాలయం.. అమెరికాలో ప్రారంభం
భారతీ ఎయిర్టెల్ అత్యధికంగా లాభపడింది. 2.77 శాతం జంప్తో ఒక్కో షేరు రూ.950.45గా ఉంది. దీని తర్వాత టాటా మోటార్స్, మారుతీ సుజుకి, మహీంద్రా & మహీంద్రా, కోటక్ బ్యాంక్, ఐఎఫ్సిస్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్సిఎల్, ఐటిసి, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, ఎల్టి, బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, ఎస్బిఐఎన్, టాటా స్టీల్, రిలయన్స్, పవర్ గ్రిడ్, హిందుస్థాన్ యూనిలీవర్, సన్ ఫార్మా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, జెఎస్డబ్ల్యు స్టీల్, నెస్లే ఇండియా వంటి షేర్లు ఊపందుకున్నాయి. పడిపోతున్న నాలుగు స్టాక్లలో ఎన్టిపిసి, ఏషియన్ పెయింట్స్, టిసిఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఉన్నాయి.
ఫార్మా, హెల్త్కేర్ రంగంలో క్షీణత
సోమవారం దాదాపు అన్ని రంగాల్లో క్షీణత కనిపించగా, మంగళవారం రెండు రంగాలు మినహా అన్ని రంగాలు గ్రీన్ జోన్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ 0.49 శాతం పెరిగింది. రియాలిటీ రంగం అత్యధికంగా 2.88 శాతం పెరిగింది. దీని తర్వాత ఆటో, ప్రైవేట్ బ్యాంకులు, పీఎస్యూ బ్యాంకులు, మీడియా రంగాల్లో వృద్ధి కనిపిస్తోంది.
Read Also:Karnataka: 30యూపీఐ స్కానర్లు.. రూ.1.47కోట్ల నగదు.. బిర్యానీ దుకాణం యజమాని బండారం బట్టబయలు
తాజావార్తలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!