Minister Payyavula Keshav: కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఏం కావాలో ప్రతిపాదనలు ప్రస్తావించాను..
- ఏపీకి ఏం కావాలో ప్రతిపాదనలు ప్రస్తావించాను
- రుణ సేకరణపై రిజర్వ్ బ్యాంక్తో రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తుంది
- కేంద్ర బడ్జెట్ ముందస్తు సన్నాహక సమావేశానికి హాజరైన ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Payyavula Keshav: బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(శనివారం) భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ కేంద్ర బడ్జెట్ ముందస్తు సన్నాహక సమావేశానికి ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. ఈ క్రమంలో స్థూలంగా రాష్ట్రానికున్న అవసరాలు, కేంద్రం నుంచి ఆశిస్తున్న ఆర్థిక సహాయం గురించి ఈ సమావేశంలో ప్రస్తావించినట్లు ఏపీ ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఏపీకి ఏం కావాలో ప్రతిపాదనలు ప్రస్తావించానని మంత్రి తెలిపారు. రాష్ట్ర విభజనతో వచ్చిన ఆర్థిక సమస్యలు, గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక నిర్వహణ లోపంతో కలిగిన నష్టాల గురించి ప్రస్తావించానన్నారు. జులైలో మొత్తం రూ.7000 పెన్షన్ ఇచ్చే విషయంలో అనుమానం అవసరం లేదన్నారు. రుణాలు సేకరణ నిరంతరం ప్రక్రియ అని.. రుణ సేకరణపై రిజర్వ్ బ్యాంక్తో రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తుందని పేర్కొన్నారు.
మెగా రహదారుల నిర్మాణంలో భాగంగా ఏపీలో పరిశ్రమల కారిడార్లను ఏర్పాటు చేయాలని కోరానన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. విభజన చట్టంలో ప్రస్తావించిన రామాయపట్నం ఓడరేవు, “సమీకృత స్టీల్ ప్లాంట్” నిర్మాణంతో పాటు, “గ్రేహౌండ్స్” శిక్షణాలయం కోసం ఆర్ధిక సహాయం కోరామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వాలని కోరినట్లు మంత్రి వెల్లడించారు. అమరావతి, వెనుకబడిన జిల్లాలకి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశామన్నారు. 5 శాతం జీఎస్టీ పరిధిలో ఉన్న చేనేత రంగాన్ని మినహాయించాలని కోరామన్నారు. “గ్రీన్ ఎనర్జీ కారిడార్” కు ఏపీకి తోడ్పాటునివ్వాలని కోరినట్లు చెప్పారు. ఆర్థికంగా గాడి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టే సామర్థ్యం చంద్రబాబునాయుడుకు ఉందనే ప్రజలు విశ్వసించి అధికారం అప్పగించారన్నారు. వివాదాలు, చిక్కులు లేని పన్నుల వ్యవస్థ ఉండాలని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.
Also Read
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
తాజావార్తలు
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!