Minister Payyavula Keshav: కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఏం కావాలో ప్రతిపాదనలు ప్రస్తావించాను..
- ఏపీకి ఏం కావాలో ప్రతిపాదనలు ప్రస్తావించాను
- రుణ సేకరణపై రిజర్వ్ బ్యాంక్తో రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తుంది
- కేంద్ర బడ్జెట్ ముందస్తు సన్నాహక సమావేశానికి హాజరైన ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Payyavula Keshav: బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(శనివారం) భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ కేంద్ర బడ్జెట్ ముందస్తు సన్నాహక సమావేశానికి ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. ఈ క్రమంలో స్థూలంగా రాష్ట్రానికున్న అవసరాలు, కేంద్రం నుంచి ఆశిస్తున్న ఆర్థిక సహాయం గురించి ఈ సమావేశంలో ప్రస్తావించినట్లు ఏపీ ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఏపీకి ఏం కావాలో ప్రతిపాదనలు ప్రస్తావించానని మంత్రి తెలిపారు. రాష్ట్ర విభజనతో వచ్చిన ఆర్థిక సమస్యలు, గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక నిర్వహణ లోపంతో కలిగిన నష్టాల గురించి ప్రస్తావించానన్నారు. జులైలో మొత్తం రూ.7000 పెన్షన్ ఇచ్చే విషయంలో అనుమానం అవసరం లేదన్నారు. రుణాలు సేకరణ నిరంతరం ప్రక్రియ అని.. రుణ సేకరణపై రిజర్వ్ బ్యాంక్తో రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తుందని పేర్కొన్నారు.
మెగా రహదారుల నిర్మాణంలో భాగంగా ఏపీలో పరిశ్రమల కారిడార్లను ఏర్పాటు చేయాలని కోరానన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. విభజన చట్టంలో ప్రస్తావించిన రామాయపట్నం ఓడరేవు, “సమీకృత స్టీల్ ప్లాంట్” నిర్మాణంతో పాటు, “గ్రేహౌండ్స్” శిక్షణాలయం కోసం ఆర్ధిక సహాయం కోరామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వాలని కోరినట్లు మంత్రి వెల్లడించారు. అమరావతి, వెనుకబడిన జిల్లాలకి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశామన్నారు. 5 శాతం జీఎస్టీ పరిధిలో ఉన్న చేనేత రంగాన్ని మినహాయించాలని కోరామన్నారు. “గ్రీన్ ఎనర్జీ కారిడార్” కు ఏపీకి తోడ్పాటునివ్వాలని కోరినట్లు చెప్పారు. ఆర్థికంగా గాడి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టే సామర్థ్యం చంద్రబాబునాయుడుకు ఉందనే ప్రజలు విశ్వసించి అధికారం అప్పగించారన్నారు. వివాదాలు, చిక్కులు లేని పన్నుల వ్యవస్థ ఉండాలని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.
Also Read
- WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
- SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
తాజావార్తలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!