Kiran Kumar Reddy: కమలం గూటికి కిరణ్ కుమార్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? రాబోయే ఎన్నికల నాటికి బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతోంది. మంచి గ్లామర్ ఉన్న నాయకుడు బీజేపీకి కరువైన వేళ.. ఆపరేషన్ ఆకర్ష్ వైపు బీజేపీ హైకమాండ్ అడుగులు వేస్తోంది. త్వరలో బీజేపీలోకి కిరణ్ కుమార్ రెడ్డి రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా రాజకీయంగా అంతగా యాక్టివ్ గా లేరు కిరణ్ కుమార్ రెడ్డి, తాజాగా బీజేపీ జాతీయ నాయకత్వంతో టచ్ లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కీలక పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతోన్న క్రమంలో ఏపీలో పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది.
Read Also: Revanth reddy: కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పాదయాత్ర.. నేడు కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో..
Also Read
- Tilak Varma: "నమ్మకమే నా బలం.." అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
- Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ఏపీ బీజేపీలో ఇమేజ్ ఉన్న లీడర్ లేకపోవడంతో కిరణ్ ను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తోన్న బీజేపీ ఆదిశగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. జాతీయ స్థాయిలో పదవి కట్టబెడతామని కిరణ్ కు బీజేపీ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చెయనున్నారు. రాహుల్ గాంధీ ఇటీవల ఏపీ కాంగ్రెస్ పై ఫోకస్ పెంచాలని భావించారు. కిరణ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారని భావించారు. అయితే, కాంగ్రెస్ లో ఉండేందుకు కిరణ్ కుమార్ రెడ్డి అంత ఆసక్తిగా లేరని తెలుస్తోంది. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి స్తబ్ధుగా ఉన్నారు. ఇటీవల బీజేపీలో కీలక పాత్ర పోషించిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ బీజేపీలో బలమయిన నేత లేరు.
రాబోయే ఎన్నికల నాటికి ఏపీ బీజేపీని బాగా పటిష్టం చేయాలని అమిత్ షా భావిస్తున్నారు. అందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ కి డోర్లు తెరిచారు. కిరణ్ కుమార్ రెడ్డి ని ఆకర్షించి, మంచి పదవి ఇవ్వాలని భావించారు. అందులో భాగంగానే బీజేపీ అగ్రనేతల సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉంది. అంతకు ముందు మీడియాతోనూ మాట్లాడే ఛాన్స్ ఉంది. ఏపీ విభజనకు ముందు కిరణ్ సీఎంగా వ్యవహరించారు. చివరి బాల్ వరకూ ఆట ఆడదామని, తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదన్నారు. విభజన అనివార్కం కావడంతో అప్పట్లో సీఎం పోస్ట్కి, కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన కిరణ్కుమార్.. 2014లో ఘోరపరాజయం తర్వాత మళ్లీ కాంగ్రెస్లోకి వెళ్లారు. కాంగ్రెస్లో చేరినా పార్టీ వ్యవహారాలకు అంటీముట్టనట్లుగానే ఉన్నారు. కొన్నేళ్లుగా పూర్తి రాజకీయ అజ్ఞాతంలోనే ఉండిపోయారు. ఇకపై బీజేపీలోకి వెళ్లి జాతీయస్థాయిలో కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. ఇప్పటికే దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. మరి, నల్లారి వారి సేవలను బీజేపీ నేతలు ఎలా వాడుకుంటారో చూడాలి.
Read Also: Liquor Policy Case: ఆ ముగ్గురినీ కలిపి ప్రశ్నించే అవకాశం?
తాజావార్తలు
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
-
Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
-
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Dragon: నేషనల్ మీడియా సమక్షంలో ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్!
-
Tilak Varma: “నమ్మకమే నా బలం..” అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!