Pawan Kalyan: కొన్ని దేశాలు వ్యర్ధాలతో అద్భుతాలు చేస్తున్నాయి.. మనం కూడా మంచి ఫలితాలు సాధించాలి!
- నంబూరులో 'స్వచ్ఛ దివాస్' కార్యక్రమం
- మొక్కలు నాటిన డిప్యూటీ సీఎం పవన్
- అందరూ బాధ్యతగా పరిశుభ్రత పాటించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని దేశాలు వ్యర్ధాలతో అద్భుతాలు చేస్తున్నాయని, ఏపీలో కూడా ‘స్వచ్ఛ దివాస్’ కార్యక్రమంతో మంచి ఫలితాలు సాధించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 2048 నాటికి రాష్ట్రం అద్భుతమైన పురోగతి కోసం కృషి చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం అని, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని పవన్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మొక్కలు నాటారు. అనంతరం పారిశుద్ధ్య తరలింపు వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ‘పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడం అందరి బాధ్యత. కరోనా మహమ్మారి వంటి పరిస్థితుల్లో శుభ్రత గురించి తెలుస్తోంది. ఒక్కరిద్దరే కాదు అందరూ బాధ్యతగా పరిశుభ్రత పాటించాలి. కొన్ని దేశాలు వ్యర్ధాలతో అద్భుతాలు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా స్వచ్ఛ దివస్ కార్యక్రమంతో మంచి ఫలితాలు సాధించాలి. 2048 నాటికి రాష్ట్రం అద్భుతమైన పురోగతి సాధించాలని కృషి చేస్తున్నాం’ అని డిప్యూటీ సీఎం తెలిపారు.
Also Read
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
- Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
Also Read: Polavaram Project: డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం!
‘ఏ కార్యక్రమం అయినా రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు ప్రజల సహకారం కూడా కావాలి. మన చిన్నతనం నుండి వ్యర్ధాలను ఇంటి పెరటిలో, మొక్కలకు వేసే సంస్కృతి ఉంది. ఇప్పుడు అది పూర్తిగా దూరమయింది. మరలా ఆ సంస్కృతిని తీసుకురావాలి. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందడుగు వేస్తాం. మురికి కూపాలను శుభ్రం చేయటం చిన్న పని కాదు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టు విధానంలో పని చేసే వాళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటాం’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.
తాజావార్తలు
-
Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
-
Toxic Trailer: యష్ కోసం రూల్స్ బ్రేక్ చేసిన నయనతార.. ఒక్క ఫోన్ కాల్తో బెంగళూరుకు!
-
Varanasi : సూపర్ స్టార్ బర్త్డే స్పెషల్.. వారణాసి ‘రుద్ర’ ఫస్ట్లుక్ రిలీజ్ చేసిన రాజమౌళి
-
Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
-
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్కే!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!