Pawan Kalyan: కొన్ని దేశాలు వ్యర్ధాలతో అద్భుతాలు చేస్తున్నాయి.. మనం కూడా మంచి ఫలితాలు సాధించాలి!
- నంబూరులో 'స్వచ్ఛ దివాస్' కార్యక్రమం
- మొక్కలు నాటిన డిప్యూటీ సీఎం పవన్
- అందరూ బాధ్యతగా పరిశుభ్రత పాటించాలి
కొన్ని దేశాలు వ్యర్ధాలతో అద్భుతాలు చేస్తున్నాయని, ఏపీలో కూడా ‘స్వచ్ఛ దివాస్’ కార్యక్రమంతో మంచి ఫలితాలు సాధించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 2048 నాటికి రాష్ట్రం అద్భుతమైన పురోగతి కోసం కృషి చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం అని, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని పవన్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మొక్కలు నాటారు. అనంతరం పారిశుద్ధ్య తరలింపు వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ‘పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడం అందరి బాధ్యత. కరోనా మహమ్మారి వంటి పరిస్థితుల్లో శుభ్రత గురించి తెలుస్తోంది. ఒక్కరిద్దరే కాదు అందరూ బాధ్యతగా పరిశుభ్రత పాటించాలి. కొన్ని దేశాలు వ్యర్ధాలతో అద్భుతాలు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా స్వచ్ఛ దివస్ కార్యక్రమంతో మంచి ఫలితాలు సాధించాలి. 2048 నాటికి రాష్ట్రం అద్భుతమైన పురోగతి సాధించాలని కృషి చేస్తున్నాం’ అని డిప్యూటీ సీఎం తెలిపారు.
Also Read
- Trisha Karuppu: వయసు రివర్స్ అవుతోంది.. త్రిష బ్యూటీపై ఫ్యాన్స్ ఫిదా! కానీ మేకర్స్తో గొడవ ఏంటి?
- Peddi: చరణ్ ‘పెద్ది’ పంజా.. మహేష్ బాబు నిర్మిస్తున్న ‘రావు బహదూర్’కు థియేటర్ల సెగ!
- Devara 2: దేవర 2 నుండి.. నందమూరి ఫ్యాన్స్కు కొరటాల అదిరిపోయే ప్రామిస్!
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
Also Read: Polavaram Project: డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం!
‘ఏ కార్యక్రమం అయినా రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు ప్రజల సహకారం కూడా కావాలి. మన చిన్నతనం నుండి వ్యర్ధాలను ఇంటి పెరటిలో, మొక్కలకు వేసే సంస్కృతి ఉంది. ఇప్పుడు అది పూర్తిగా దూరమయింది. మరలా ఆ సంస్కృతిని తీసుకురావాలి. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందడుగు వేస్తాం. మురికి కూపాలను శుభ్రం చేయటం చిన్న పని కాదు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టు విధానంలో పని చేసే వాళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటాం’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.
తాజావార్తలు
-
Trisha Karuppu: వయసు రివర్స్ అవుతోంది.. త్రిష బ్యూటీపై ఫ్యాన్స్ ఫిదా! కానీ మేకర్స్తో గొడవ ఏంటి?
-
Onam Release : ఓనమ్ స్పెషల్.. ముగ్గురు మలయాళ బిగ్ స్టార్స్ మధ్య బిగ్ ఫైట్
-
Peddi: చరణ్ ‘పెద్ది’ పంజా.. మహేష్ బాబు నిర్మిస్తున్న ‘రావు బహదూర్’కు థియేటర్ల సెగ!
-
B.Tech Student: పాపం ఏం కష్టమొచ్చిందో.. డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..
-
PEDDI : పాన్ ఇండియా స్థాయిలో పెద్ది ‘పెయిడ్ ప్రీమియర్స్’ ప్లానింగ్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!