Pawan Kalyan: కొన్ని దేశాలు వ్యర్ధాలతో అద్భుతాలు చేస్తున్నాయి.. మనం కూడా మంచి ఫలితాలు సాధించాలి!
- నంబూరులో 'స్వచ్ఛ దివాస్' కార్యక్రమం
- మొక్కలు నాటిన డిప్యూటీ సీఎం పవన్
- అందరూ బాధ్యతగా పరిశుభ్రత పాటించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని దేశాలు వ్యర్ధాలతో అద్భుతాలు చేస్తున్నాయని, ఏపీలో కూడా ‘స్వచ్ఛ దివాస్’ కార్యక్రమంతో మంచి ఫలితాలు సాధించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 2048 నాటికి రాష్ట్రం అద్భుతమైన పురోగతి కోసం కృషి చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం అని, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని పవన్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మొక్కలు నాటారు. అనంతరం పారిశుద్ధ్య తరలింపు వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ‘పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడం అందరి బాధ్యత. కరోనా మహమ్మారి వంటి పరిస్థితుల్లో శుభ్రత గురించి తెలుస్తోంది. ఒక్కరిద్దరే కాదు అందరూ బాధ్యతగా పరిశుభ్రత పాటించాలి. కొన్ని దేశాలు వ్యర్ధాలతో అద్భుతాలు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా స్వచ్ఛ దివస్ కార్యక్రమంతో మంచి ఫలితాలు సాధించాలి. 2048 నాటికి రాష్ట్రం అద్భుతమైన పురోగతి సాధించాలని కృషి చేస్తున్నాం’ అని డిప్యూటీ సీఎం తెలిపారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
Also Read: Polavaram Project: డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం!
‘ఏ కార్యక్రమం అయినా రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు ప్రజల సహకారం కూడా కావాలి. మన చిన్నతనం నుండి వ్యర్ధాలను ఇంటి పెరటిలో, మొక్కలకు వేసే సంస్కృతి ఉంది. ఇప్పుడు అది పూర్తిగా దూరమయింది. మరలా ఆ సంస్కృతిని తీసుకురావాలి. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందడుగు వేస్తాం. మురికి కూపాలను శుభ్రం చేయటం చిన్న పని కాదు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టు విధానంలో పని చేసే వాళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటాం’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!