AP CM Jagan: ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఉండాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM Jagan: ఏపీలో 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి సీఎం జగన్ వర్చువల్గా ప్రారంభించారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కాలేజీలను సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ఇవాళ 5 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నామని.. మళ్లీ 5 కాలేజీలు, వచ్చే ఏడాది మరో 7 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. మొత్తంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించబోతున్నామని సీఎం వెల్లడించారు. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కు ఒక మెడికల్ కాలేజీ ఉండబోతోందని ఆయన తెలిపారు. ఏపీలో మొత్తం 28 మెడికల్ కాలేజీలు ఉండబోతున్నాయని.. ఈ కాలేజీల వల్ల కొత్తగా 2,250 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రాబోతున్నాయని సీఎం పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఏపీలో కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయని.. ఇప్పుడు మరో 17 మెడికల్ కాలేజీల కోసం రూ.8480 కోట్లు వెచ్చిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో చాలా మంది గొప్ప డాక్టర్లు కావాలన్నారు.
Also Read: Chandrababu: చంద్రబాబుతో ములాఖత్కు భువనేశ్వరికి అనుమతి తిరస్కరణ
Also Read
- Shubman Gill: "డోంట్ వర్రీ".. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!
- Modi-Trump Meeting: మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు.. 16 నెలల తరువాత ఎదురుపడనున్న మోడీ, ట్రంప్..
- CJP Protest: నేడు హైదరాబాద్లో 'కాక్రోచ్ జనతా పార్టీ' ధర్నా.. సోనమ్ వాంగ్చుక్ హాజరు!
ఇప్పటి వరకు 2185 సీట్లు అందుబాటులో ఉన్నాయని.. కొత్త కాలేజీల రాకతో సీట్ల సంఖ్య 4735కు చేరిందన్నారు. ఈ ఒక్క ఏడాదే 609 సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. గిరిజన ప్రాంతాల్లోనూ కాలేజీలు వస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో మరో 2737 పీజీ సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీలు వస్తాయన్నారు. ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. మరో 18 నర్సింగ్ కాలేజీలు అందుబాటులోకి తెస్తామని, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని సీఎం తెలిపారు. 10,032 విలేజ్ క్లీనిక్స్ కూడా ఏర్పాటు చేశామన్నారు. గ్రామస్థాయిలో ఆశావర్కర్లతో సేవలు అందిస్తున్నామని సీఎం వెల్లడించారు. ప్రతీ మండలానికి ఒక పీహెచ్సీతో పాటు ఊరిలోనే ఉచిత వైద్యం అందించేలా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన మందులు అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలు 3,255 ప్రొసీజర్స్కు విస్తరించామన్నారు. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేశామన్నారు. గతంతో పోలిస్తే వైద్యానికి భారీగా బడ్జెట్ పెంచామన్నారు. 108, 104 వాహనాల సంఖ్యను పెంచామని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. పేదవారికి మంచి జరగాలన్నదే మా ఆలోచన అని, ఏ చదువైనా పేదవారికి అందుబాటులో ఉండాలి అని అన్నారు.
తాజావార్తలు
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Shubman Gill: “డోంట్ వర్రీ”.. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
WiFi Signal Issues : ఇంట్లో వైఫై స్పీడ్ తగ్గిపోతుందా? కారణం ఇంటర్నెట్ మాత్రమే కాదు.. ఈ విషయాలు కూడా చెక్ చేయండి!
-
Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!
-
ChatGPT: చాట్ జీపీటీ వాడుతున్నారా?.. భారీ నష్టం తప్పదు!.. AI పాయిజనింగ్ ముప్పు గురించి తెలుసుకోండి
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!