Aadudam Andhra: గ్రామాల్లోని ఆణిముత్యాలను దేశానికి అందిస్తాం: సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల ద్వారా అంతర్జాతీయ స్థాయికి మన క్రీడాకారులను పరిచయం చేయడమే లక్ష్యం అని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. గ్రామాల్లోని ఆణిముత్యాలను దేశానికి అందిస్తామని, ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే మైలురాయి అని పేర్కొన్నారు. ఆరోగ్యం సరిగా ఉండాలంటే మన జీవితంలో క్రీడలు అవసరమని, క్రీడలతో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని సీఎం జగన్ చెప్పారు. ఆడుదాం ఆంధ్రా పోటీలను సీఎం జగన్ ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులకు సీఎం కిట్లను పంపిణీ చేశారు.
‘ఈ క్రీడా సంబురాలు దేశ చరిత్రలోనే ఓ మైలురాయి. నేటి నుండి ఫిబ్రవరి 10 వరకు రాష్ట్రంలో ప్రతి ఊరికి, ప్రతి ఒక్కరికీ పండుగే. గ్రామ గ్రామాలలో ఆరోగ్య అవగాహన కోసం క్రీడలు ప్రాముఖ్యాన్ని తెలియ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అందరూ పాల్గొనే ఓ గొప్ప పండుగ. మంచి ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆరోగ్యం సరిగా ఉండాలంటే.. మన జీవితంలో క్రీడలు అవసరం. క్రీడలతో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. మంచి ఆరోగ్యానికి స్పోర్ట్స్ ఎంతగానో ఉపయోగపడుతాయి. గ్రామస్థాయిలో క్రీడలు ఎంతో అవసరం. అందుకే గ్రామస్థాయి నుంచి అడుగులు వేస్తున్నాం. గ్రామాల్లోని ఆణిముత్యాలను వెతికి దేశానికి అందిస్తాం. గ్రామస్థాయి క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యం’ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
Also Read: Vangaveeti Ranga Death Anniversary: వంగవీటి రంగా వర్ధంతి వేడుకలకు దూరంగా రాధా!
‘గ్రామాల్లో ఆరోగ్యం కోసం ఫ్యామిలీ డాక్టర్ విధానం తీసుకు వచ్చాం. దేశానికి ఫ్యామిలీ డాక్టర్ విధానం ఆదర్శంగా నిలిచింది. గ్రామ, వార్డు సచివాలయం నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రీడా పోటీలు నిర్వహించి మట్టిలో మానిక్యాలను వెలికి తీస్తాం. క్రికెట్లో అత్యున్నత ప్రమాణాలు పెంచేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చింది. పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ వంటి వారి సహకారంతో గ్రామీణ స్థాయిలో కోచింగ్ ఇప్పిస్తాం. ప్రతి ఏటా ఈ తరహా పోటీలు నిర్వహిస్తాం’ అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
- Tags
- Adudam Andhra
- ap
- CM YS Jagan
- Guntur
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!