CM Chandrababu: శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు
- శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
- ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని సీఎం చంద్రబాబు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, తదితరులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైలం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి సందర్శించారు. అంతకు ముందు శ్రీశైలంలోని పాతాళ గంగలో సీ ప్లేన్ డెమో లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. పౌరవిమానయాన శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, ఎఫ్ఐసీసీఐ భాగస్వాములుగా ఉన్నారు.
Read Also: CM Chandrababu on seaplane: సీ ప్లేన్, బోట్లు, రోడ్డు రవాణా లింక్ చేయాలి.. అధికారులతో సీఎం..
Also Read
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్ సేవలను లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు.. మరికొందరు ప్రజాప్రతినిధులు.. అధికారులతో కలిసి సీ ప్లేన్లో విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్లారు.. అయితే, సీప్లేన్ పై అధికారులు, ప్రజా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడారు సీఎం చంద్రబాబు.. రాబోయే రోజుల్లో రెండు, మూడు విమానాలు వచ్చే అవకాశం ఉందన్నారు.. పచ్చదనం, జలాల మధ్య శ్రీశైలంలో సీ ప్లేన్ చాలా అందంగా ఉందన్న ఆయన.. భారత్ లో మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నాం అన్నారు.. అయితే, సీ ప్లేన్, బోట్లు, రోడ్డు రవాణాను లింక్ చేస్తేబాగుంటుందన్నారు సీఎం చంద్రబాబు.. శ్రీశైలంలో ఎంత భూమి అందుబాటులో ఉందని వివరాలు తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.. అయితే, 5 వేల ఎకరాలు ఉందని సమాధానం చెప్పారు అధికారులు.. పాతాళ గంగ మట్టి రోడ్డు వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.. ఇక, విజయవాడ నుంచి సీ ప్లేన్లో శ్రీశైలం చేరుకున్న ఆయన.. రోప్ వేలో పాతాళ గంగ నుంచి శ్రీశైలం చేరుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం చంద్రబాబుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీశైల మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తాజావార్తలు
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!