CM Chandrababu: హార్డ్ వర్క్ ముఖ్యం కాదు.. స్మార్ట్ వర్క్ కావాలి: సీఎం
- విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరింది
- ప్రజా చైతన్యమే భారతదేశానికి శ్రీరామరక్ష
- ఓటే ఈ దేశాన్ని ఇంతవరకూ కాపాడుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హార్డ్ వర్క్ ముఖ్యం కాదని, స్మార్ట్ వర్క్ కావాలని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. సంక్షోభాలనే అవకాశాలుగా మలచుకోవాలన్నారు. ఓటే దేశాన్ని ఇంతవరకూ కాపాడుతూ వస్తోందని, ప్రజాస్వామ్యం లేకపోతే నియంతృత్వం వస్తుందన్నారు. ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరిందని, మంత్రి నారా లోకేశ్ కృషి వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
‘ఓటే ఈ దేశాన్ని ఇంతవరకూ కాపాడుతోంది. నియంతలు పుట్టుకొచ్చినపుడు వారిని పంపడానికి ఉద్యమాలు వస్తాయి. ప్రజా చైతన్యమే భారతదేశానికి శ్రీరామరక్ష. గూగుల్ కంపెనీ విశాఖకు రావడానికి ఎంవోయూ చేసింది మనతో. విశాఖపట్నంలో చాలా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. భవిష్యత్తులో చాలా భిన్నమైన మార్పులు వస్తాయి. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డాటా హబ్ వచ్చి కనెక్ట్ చేస్తే.. విశాఖ ఏఐకి ఒక సెంటర్ అవుతుంది. మన RTGSతో గూగుల్ ఒక ఒప్పందం చేసుకుంది. గూగుల్లో శాటిలైట్ ద్వారా గంజాయిని 4,000 ఎకరాల్లో గుర్తించాం. రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉందని నేను చెపుతున్నా.. ప్రజలు నవ్వుతూ స్వాగతం పలుకుతున్నారు. తప్పులు జరక్కుండా చేసే బాధ్యత అధికారుల అందరి మీద ఉందని మీరు నోట్ చేసుకోవాలి’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
‘గత ప్రభుత్వంలో రాబోయే ఫైనాన్స్ కమీషన్ నిధులు కూడా రాకుండా చేసారు. భూకబ్జాలు వెంటాడుతున్నాయి. ఉచిత ఇసుక అమలు ఒక సవాలులా తయారయింది. గంజాయి, డ్రగ్స్ రాష్ట్రం మొత్తం కనిపిస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లర్లు అత్యధికంగా ఉన్నారు. రేషన్ బియ్యం ఎగుమతి ఒక పెద్ద మాఫియా లాగా తయారైంది. రేషన్ మాఫియా కూకటివేళ్లతో తీసెయ్యాలి. పోర్టులు, సెజ్ లు కూడా కబ్జాకు గురవుతున్నాయి. ఇవి కచ్చితంగా సరిచేస్తాం. 7 శ్వేతపత్రాలు విడుదల చేశాం. 20 పాలసీలు తీసుకొచ్చాం. విజన్ 2047 తయారు చేశాం. 20 లక్షల మందికి ఉద్యోగాలు టార్గెట్గా నిర్ణయించాం. అమరావతికి ప్రారంభంలో 50 వేల కోట్లు అవసరం అవుతాయి. పోలవరంను 2027కి పూర్తి చేయాలని నిర్ణయించాం. 64 లక్షల మందికి ఇంటికెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాం. పేదలకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదని మా ఉద్దేశం. 40 లక్షల మందికి ఇప్పటి వరకూ దీపం-2 కింద సిలిండర్లు ఇచ్చాం. 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నాం. 199 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం’ అని సీఎం చెప్పారు.
- Tags
- ap
- ap news
- cm chandrababu
- Vizag
తాజావార్తలు
-
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!