CM Chandrababu: హార్డ్ వర్క్ ముఖ్యం కాదు.. స్మార్ట్ వర్క్ కావాలి: సీఎం
- విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరింది
- ప్రజా చైతన్యమే భారతదేశానికి శ్రీరామరక్ష
- ఓటే ఈ దేశాన్ని ఇంతవరకూ కాపాడుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హార్డ్ వర్క్ ముఖ్యం కాదని, స్మార్ట్ వర్క్ కావాలని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. సంక్షోభాలనే అవకాశాలుగా మలచుకోవాలన్నారు. ఓటే దేశాన్ని ఇంతవరకూ కాపాడుతూ వస్తోందని, ప్రజాస్వామ్యం లేకపోతే నియంతృత్వం వస్తుందన్నారు. ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరిందని, మంత్రి నారా లోకేశ్ కృషి వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
‘ఓటే ఈ దేశాన్ని ఇంతవరకూ కాపాడుతోంది. నియంతలు పుట్టుకొచ్చినపుడు వారిని పంపడానికి ఉద్యమాలు వస్తాయి. ప్రజా చైతన్యమే భారతదేశానికి శ్రీరామరక్ష. గూగుల్ కంపెనీ విశాఖకు రావడానికి ఎంవోయూ చేసింది మనతో. విశాఖపట్నంలో చాలా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. భవిష్యత్తులో చాలా భిన్నమైన మార్పులు వస్తాయి. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డాటా హబ్ వచ్చి కనెక్ట్ చేస్తే.. విశాఖ ఏఐకి ఒక సెంటర్ అవుతుంది. మన RTGSతో గూగుల్ ఒక ఒప్పందం చేసుకుంది. గూగుల్లో శాటిలైట్ ద్వారా గంజాయిని 4,000 ఎకరాల్లో గుర్తించాం. రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉందని నేను చెపుతున్నా.. ప్రజలు నవ్వుతూ స్వాగతం పలుకుతున్నారు. తప్పులు జరక్కుండా చేసే బాధ్యత అధికారుల అందరి మీద ఉందని మీరు నోట్ చేసుకోవాలి’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
‘గత ప్రభుత్వంలో రాబోయే ఫైనాన్స్ కమీషన్ నిధులు కూడా రాకుండా చేసారు. భూకబ్జాలు వెంటాడుతున్నాయి. ఉచిత ఇసుక అమలు ఒక సవాలులా తయారయింది. గంజాయి, డ్రగ్స్ రాష్ట్రం మొత్తం కనిపిస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లర్లు అత్యధికంగా ఉన్నారు. రేషన్ బియ్యం ఎగుమతి ఒక పెద్ద మాఫియా లాగా తయారైంది. రేషన్ మాఫియా కూకటివేళ్లతో తీసెయ్యాలి. పోర్టులు, సెజ్ లు కూడా కబ్జాకు గురవుతున్నాయి. ఇవి కచ్చితంగా సరిచేస్తాం. 7 శ్వేతపత్రాలు విడుదల చేశాం. 20 పాలసీలు తీసుకొచ్చాం. విజన్ 2047 తయారు చేశాం. 20 లక్షల మందికి ఉద్యోగాలు టార్గెట్గా నిర్ణయించాం. అమరావతికి ప్రారంభంలో 50 వేల కోట్లు అవసరం అవుతాయి. పోలవరంను 2027కి పూర్తి చేయాలని నిర్ణయించాం. 64 లక్షల మందికి ఇంటికెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాం. పేదలకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదని మా ఉద్దేశం. 40 లక్షల మందికి ఇప్పటి వరకూ దీపం-2 కింద సిలిండర్లు ఇచ్చాం. 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నాం. 199 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం’ అని సీఎం చెప్పారు.
- Tags
- ap
- ap news
- cm chandrababu
- Vizag
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?