Chandrababau: ఏపీ విషయంలో కేంద్రం స్పందిస్తున్న తీరు చూస్తుంటే సంతోషం వేస్తోంది..
- ఏపీ.. పోలవరం విషయంలో కేంద్రం చొరవ చూపుతోంది- చంద్రబాబు
- ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తన చర్యల ద్వారా చెబుతోంది- సీఎం
- 2027 మార్చిలోగా పోలవరాన్ని పూర్తి చేసేలా కేంద్రం షెడ్యూల్ విడుదల చేయడం సంతోషం
- పోలవరానికి రూ.12127 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది- చంద్రబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరంకు సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం మొదటి దశ నిర్మాణానికి అవసరమైన రూ. 12,500 కోట్ల ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో.. ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ, పోలవరం విషయంలో కేంద్రం చొరవ చూపుతోందని అన్నారు. ఏపీ అభివృద్ధి విషయంలో కేంద్రం కట్టుబడి ఉందని తన చర్యల ద్వారానే చెబుతోందని తెలిపారు. కేంద్రం స్పందిస్తున్న తీరు చూస్తుంటే సంతోషం వేస్తోందని.. పోలవరాన్ని 2027 మార్చిలోగా పూర్తి చేసేలా కేంద్రం షెడ్యూల్ విడుదల చేయడం సంతోషం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పాటిల్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. పోలవరానికి రూ. 12,127 కోట్లను ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని.. పోలవరం పూర్తి అయితే దక్షిణాది రాష్ట్రాలకు తాగు, సాగు నీటి సమస్య తీరుతుందని చంద్రబాబు తెలిపారు.
NTR: అభిమాని చనిపోయి11 ఏళ్లయినా.. కుటుంబానికి అండగా తారక్
Also Read
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
- 185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
2014-19 మధ్య కాలంలో పోలవరం పూర్తి చేయడానికి ప్రయత్నించామని ముఖ్యమంత్రి అన్నారు. 2019 ఎన్నికల్లో ప్రభుత్వం మారింది.. పోలవరానికి శనిగ్రహం దాపురించిందని దుయ్యబట్టారు. పోలవరాన్ని గత ప్రభుత్వం అనాథగా మార్చేసిందని.. 15 నెలల పాటు పోలవరం వంటి ప్రాజెక్టు వైపు గత ప్రభుత్వం కన్నెత్తి కూడా చూడలేదని ఆరోపించారు. డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. పోలవరం గైడ్ బండ్ కూడా కుంగిపోయిందని సీఎం తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం రూ. 8 వేల కోట్లకు పైగా నిధులను కేంద్రం ఇస్తే.. నాటి ప్రభుత్వం కేవలం రూ. 4 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని అన్నారు. ఈ విషయంలో.. గత ప్రభుత్వానికి కేంద్రం రెండుసార్లు వార్నింగ్ కూడా ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఓ వ్యక్తి నిర్వాకం వల్ల రాష్ట్రానికి ఎంతటి నష్టం జరుగుతుందోననడానికి పోలవరమే అతి పెద్ద ఉదాహరణ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని మేలు చేకూర్చే విధంగా వ్యవహరిస్తామని కూటమి పార్టీలుగా తాము హామీ ఇచ్చామన్నారు. తాము ఇచ్చిన హామీలకు అనుగుణంగానే పని చేస్తున్నామని అన్నారు. పోలవరాన్ని తిరిగి ట్రాక్ లో పెట్టగలిగాం.. పోలవరం పూర్తి అవుతుందనే నమ్మకం ఇప్పుడు కలిగిందని సీఎం చెప్పారు. కేంద్రం ఇవాళ చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది.. కేంద్రానికి అభినందనలు తెలిపారు.
Pushpa 2: 100 రోజుల్లో పుష్పగాడి రూలింగ్!
మరోవైపు.. ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీలో ఉపాధి కల్పించడం, ఆర్థిక పరిస్థితి ట్రాక్ లో పెట్టడంలో కేంద్రం సహకరిస్తుందన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక నగరాల అభివృద్ధికి కేంద్రం అనుమతించిందని.. కృష్ణపట్నం నోడ్ కూడా అనుమతి ఇచ్చారు. నక్కపల్లి ఫార్మా క్లస్టర్ కూడా వస్తోందని చంద్రబాబు చెప్పారు. కేంద్ర కేబినెట్ నిధులు ఇవ్వడానికి అంగీకరించడం సంతోషదాయకం అని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఇది కొంత వెసులుబాటు అని ముఖ్యమంత్రి చెప్పారు. దేశంలో మొత్తం 12 పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తుంటే ఏపీలో మూడు కారిడార్ లు ఉన్నాయన్నారు. మొత్తం రూ. 28 వేల కోట్లు వీటిపై వ్యయం చేయాలని నిర్ణయించారని తెలిపారు. ఇవన్నీ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కారణం అవుతాయని..
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రానికి మంచి రోజు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!