Chandrababau: ఏపీ విషయంలో కేంద్రం స్పందిస్తున్న తీరు చూస్తుంటే సంతోషం వేస్తోంది..
- ఏపీ.. పోలవరం విషయంలో కేంద్రం చొరవ చూపుతోంది- చంద్రబాబు
- ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తన చర్యల ద్వారా చెబుతోంది- సీఎం
- 2027 మార్చిలోగా పోలవరాన్ని పూర్తి చేసేలా కేంద్రం షెడ్యూల్ విడుదల చేయడం సంతోషం
- పోలవరానికి రూ.12127 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది- చంద్రబాబు.
పోలవరంకు సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం మొదటి దశ నిర్మాణానికి అవసరమైన రూ. 12,500 కోట్ల ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో.. ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ, పోలవరం విషయంలో కేంద్రం చొరవ చూపుతోందని అన్నారు. ఏపీ అభివృద్ధి విషయంలో కేంద్రం కట్టుబడి ఉందని తన చర్యల ద్వారానే చెబుతోందని తెలిపారు. కేంద్రం స్పందిస్తున్న తీరు చూస్తుంటే సంతోషం వేస్తోందని.. పోలవరాన్ని 2027 మార్చిలోగా పూర్తి చేసేలా కేంద్రం షెడ్యూల్ విడుదల చేయడం సంతోషం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పాటిల్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. పోలవరానికి రూ. 12,127 కోట్లను ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని.. పోలవరం పూర్తి అయితే దక్షిణాది రాష్ట్రాలకు తాగు, సాగు నీటి సమస్య తీరుతుందని చంద్రబాబు తెలిపారు.
NTR: అభిమాని చనిపోయి11 ఏళ్లయినా.. కుటుంబానికి అండగా తారక్
Also Read
- Islamabad in Lockdown: 10 రోజులుగా లాక్డౌన్లో ఇస్లామాబాద్.. తిట్టిపోస్తున్న పాక్ ప్రజలు..
- Iran Mocks Trump: ‘‘షట్ అప్, ట్రంప్’’.. హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ సెటైర్లు..
- Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్గా రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు..!
- Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..
2014-19 మధ్య కాలంలో పోలవరం పూర్తి చేయడానికి ప్రయత్నించామని ముఖ్యమంత్రి అన్నారు. 2019 ఎన్నికల్లో ప్రభుత్వం మారింది.. పోలవరానికి శనిగ్రహం దాపురించిందని దుయ్యబట్టారు. పోలవరాన్ని గత ప్రభుత్వం అనాథగా మార్చేసిందని.. 15 నెలల పాటు పోలవరం వంటి ప్రాజెక్టు వైపు గత ప్రభుత్వం కన్నెత్తి కూడా చూడలేదని ఆరోపించారు. డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. పోలవరం గైడ్ బండ్ కూడా కుంగిపోయిందని సీఎం తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం రూ. 8 వేల కోట్లకు పైగా నిధులను కేంద్రం ఇస్తే.. నాటి ప్రభుత్వం కేవలం రూ. 4 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని అన్నారు. ఈ విషయంలో.. గత ప్రభుత్వానికి కేంద్రం రెండుసార్లు వార్నింగ్ కూడా ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఓ వ్యక్తి నిర్వాకం వల్ల రాష్ట్రానికి ఎంతటి నష్టం జరుగుతుందోననడానికి పోలవరమే అతి పెద్ద ఉదాహరణ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని మేలు చేకూర్చే విధంగా వ్యవహరిస్తామని కూటమి పార్టీలుగా తాము హామీ ఇచ్చామన్నారు. తాము ఇచ్చిన హామీలకు అనుగుణంగానే పని చేస్తున్నామని అన్నారు. పోలవరాన్ని తిరిగి ట్రాక్ లో పెట్టగలిగాం.. పోలవరం పూర్తి అవుతుందనే నమ్మకం ఇప్పుడు కలిగిందని సీఎం చెప్పారు. కేంద్రం ఇవాళ చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది.. కేంద్రానికి అభినందనలు తెలిపారు.
Pushpa 2: 100 రోజుల్లో పుష్పగాడి రూలింగ్!
మరోవైపు.. ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీలో ఉపాధి కల్పించడం, ఆర్థిక పరిస్థితి ట్రాక్ లో పెట్టడంలో కేంద్రం సహకరిస్తుందన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక నగరాల అభివృద్ధికి కేంద్రం అనుమతించిందని.. కృష్ణపట్నం నోడ్ కూడా అనుమతి ఇచ్చారు. నక్కపల్లి ఫార్మా క్లస్టర్ కూడా వస్తోందని చంద్రబాబు చెప్పారు. కేంద్ర కేబినెట్ నిధులు ఇవ్వడానికి అంగీకరించడం సంతోషదాయకం అని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఇది కొంత వెసులుబాటు అని ముఖ్యమంత్రి చెప్పారు. దేశంలో మొత్తం 12 పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తుంటే ఏపీలో మూడు కారిడార్ లు ఉన్నాయన్నారు. మొత్తం రూ. 28 వేల కోట్లు వీటిపై వ్యయం చేయాలని నిర్ణయించారని తెలిపారు. ఇవన్నీ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కారణం అవుతాయని..
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రానికి మంచి రోజు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
IPL 2026: ‘వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో’.. ఆ ఆటగాడిపై తీవ్ర ఆగ్రహం..
-
Varanasi: అంటార్కిటికాలో బాబు వేట!
-
Islamabad in Lockdown: 10 రోజులుగా లాక్డౌన్లో ఇస్లామాబాద్.. తిట్టిపోస్తున్న పాక్ ప్రజలు..
-
Rain Alert: తెలంగాణ వాతావరణ శాఖ కీలక అలర్ట్.. ఈ జిల్లాల్లో వడగళ్ల వాన..
-
Iran Mocks Trump: ‘‘షట్ అప్, ట్రంప్’’.. హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ సెటైర్లు..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!