CM Chandrababu: ఏచూరితో కలిసి పని చేశాను.. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నా
- సీతారాం ఏచూరి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు.. టీడీపీ ఎంపీలు
- సీతారాం ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నా- చంద్రబాబు
- మంచి నాయకుడు.. ఎల్లప్పుడూ పేద ప్రజలకు ఏం చేయాలని తపనపడే వ్యక్తి- సీఎం
- నేను 40 సంవత్సరాలుగా క్లోజ్ గా సీతారాం ఏచూరి వాచ్ చేశాను- చంద్రబాబు
- ఏచూరితో కలిసి పని చేశాను- ముఖ్యమంత్రి చంద్రబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో సీతారాం ఏచూరి పార్థివ దేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎంపీలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని తెలిపారు. మంచి నాయకుడు, ఎల్లప్పుడూ పేద ప్రజలకు ఏం చేయాలని తపనపడే వ్యక్తి అని అన్నారు. తాను 40 సంవత్సరాలుగా క్లోజ్ గా సీతారాం ఏచూరిని వాచ్ చేశానని.. ఏచూరితో కలిసి పని చేశానని చంద్రబాబు చెప్పారు. ఎన్నో పోరాటాల్లో ఏచూరితో కలిసి ముందుకు సాగాం.. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణ వ్యక్తిగా సీతారాం ఏచూరి తయారయ్యారని అన్నారు. ఎక్కడో కాకినాడలో పుట్టిన వ్యక్తి ఢిల్లీ యూనివర్సిటీకి వచ్చి జేఎన్యులో స్టూడెంట్ లీడర్ గా ప్రెసిడెంట్ అయ్యారన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల ఆసక్తి కనబరచడం.. అందులో చేరడం.. అంచలంచెలుగా ఎదిగి జాతీయస్థాయిలో పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Read Also: Sitaram Yechury: రేపు ఎయిమ్స్కి ఏచూరి పార్థీవ దేహం.. భౌతికకాయాన్ని ఏం చేస్తారు?.. డాక్టర్ మాటల్లో..
Also Read
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Off The Record: ఎమ్మెల్యే శిరీష ఇరకాటంలో పడ్డారా..? అసలు కారణం ఏంటి?
ఏచూరి.. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. అందరితో కలిసి ఉండేవాడు.. ఎవరు ఎప్పుడు కనబడిన నవ్వుతూ పలకరించే వారు.. అజాత శత్రువుగా ఎన్నో పోరాతాల్లో కలిసి ముందుకు సాగామని అన్నారు. తెలుగువాడిగా ప్రత్యేక ప్రసిద్ధి చెందారు.. దేశం మంచి రాజకీయ నాయకుడిని కోల్పోయింది.. చాలా బాధాకరంగా ఉందని చంద్రబాబు చెప్పారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను.. తనకున్న అనుబంధంతో ఖచ్చితంగా చూడాలని, నివాళులు అర్పించాలని వచ్చానని చంద్రబాబు చెప్పారు. మనం ఉన్నా లేకున్నా మనం చేసిన పనులు శాశ్వతంగా ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
-
Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
-
Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
-
Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
-
Malayalam: మలయాళం అంటే చిన్నచూపా?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!