Chandrababu Naidu Tour: కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. కనీవినీ ఎరుగని ఏర్పాట్లు! షెడ్యూల్ ఇదే
- కుప్పంలో చంద్రబాబు పర్యటన
- నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు
- భారీ నిధులు-హామీల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM Chandrababu Naidu Tour Today: రెండు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు తొలిసారిగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మంగళ, బుధవారాల్లో పర్యటించనున్నారు. దీంతో కుప్పంలో కోలాహల వాతావరణం నెలకొంది. సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పర్యటనకు అధికారులు కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేశారట.
తొమ్మిది పర్యాయాలు ఎమ్మెల్యేగా కుప్పం నుంచి గెలుస్తున్న చంద్రబాబు నాయుడు.. నాలుగోసారి సీఎం పదవిని అధిష్టించిన విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన చంద్రబాబు.. తన నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలపనున్నారు. అంతేకాకుండా తన సొంత నియోజకవర్గానికి భారీ నిధులు, హామీల వర్షం కురిపించనున్నారని తెలుస్తోంది.
Also Read
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
- Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
మొదటిరోజు హంద్రీ-నీవా కాలువను పరిశీలించడంతో పాటు కడప ఆర్టీసీ బస్టాండు సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మరుసటిరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. ఈరోజు మధ్యాహ్నం 12.30కు సీఎం పర్యటన మొదలవనుండగా.. సాయంత్రం 4.35కు ముగుస్తుంది. బుధవారం ఉదయం 10.30 గంటలకు సీఎం టూర్ స్టార్ అవుతుంది. సాయంత్రం 4.10కి సీఎం పర్యటన ముగ్గుస్తుంది.
మంగళవారం కార్యక్రమాలు:
మ.12.30కు పిఈఎస్ మెడికల్ కాలేజీ హెలిప్యాడ్ నుండి ముఖ్యమంత్రి ఆగమనం
మ.12.55కు శాంతిపురం జల్లిగానిపల్లి గ్రామంలో హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ పరిశీలన
మ.1.35కు శాంతిపురం మండలం చిన్నారి దొడ్డి గ్రామంలో హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ పరిశీలన
మ.02.10కు కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహం– విరామం
మ.3.00లకు ఎన్టిఆర్ విగ్రహం కూడలిలో బహిరంగ సభ
సా.4.35కు కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహంలో పార్టీ నేతలతో సమావేశం
బుధవారం కార్యక్రమాలు:
ఉ.10.30 గంలకు ఆర్ అండ్ బి అతిథి గృహం- ప్రజా ఫిర్యాధుల స్వీకరణ
మ.12 గంలకు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల (పిఈఎస్ కళాశాల సమీపంలో)- నియోజకవర్గ పరిధి అధికారులతో సమీక్షా సమావేశం
మ.02.35 గంలకు పిఈఎస్ మెడికల్ కాలేజీ – పార్టీ శ్రేణులతో మీటింగ్
సా.4.10 – పిఈఎస్ మెడికల్ కాలేజీ హెలిప్యాడ్ నుండి ముఖ్యమంత్రి తిరోగమనం
తాజావార్తలు
-
Maa Inti Bangaram: 73 కోట్ల వసూళ్లతో అన్-స్టాపబుల్ ‘బంగారం’!
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..