CM Chandrababu Naidu: కుప్పంపై సీఎం వరాల జల్లు..
- తన సొంత నియోజకవర్గం కుప్పంపై సీఎం చంద్రబాబు వరాల జల్లు
- సీఎం హోదాలో తొలిసారి కుప్పంలో పర్యటన
- కుప్పంలో ఔటర్ రింగ్ రోడ్డు వేస్తాం.. అన్ని రోడ్డు అభివృద్ధి చేస్తాం..
- కుప్పం మున్సిపాలిటీకి వందకోట్ల పైనే ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తా..
- కుప్పంలో నాలుగు మండలాలను పదికోట్ల లెక్కన ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తా..
- కుప్పం అభివృద్ధి పనులు ఈరోజు నుండే ప్రారంభిస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Naidu: తన సొంత నియోజకవర్గం కుప్పంపై వరాల జల్లు కురిపించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం, బాధ్యతల స్వీకరణ, ఎమ్మెల్యేగా ప్రమాణం.. ఇలా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. తొలిసారి తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టిన ఆయన.. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.. ఓవైపు వర్షం జల్లు పడుతుండగా.. మరోవైపు.. వరాల జల్లు కురిపించారు సీఎం.. కుప్పంలో ఔటర్ రింగ్ రోడ్డు వేస్తాం… అన్ని రోడ్డు అభివృద్ధి చేస్తాం అన్నారు. కుప్పం మున్సిపాలిటీకి వందకోట్ల పైనే ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తా.. కుప్పంలో నాలుగు మండలాలను పదికోట్ల లెక్కన ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తాను.. కుప్పం అభివృద్ధి పనులు ఈరోజు నుండే ప్రారంభిస్తాం.. ప్రతి ఇంటి తాగునీరు అందిస్తాం.. పచ్చదనానికి కేరాఫ్ కుప్పాన్ని మారుస్తాను అని ప్రకటించారు.
Read Also: IND vs ENG : వర్షం పడి సెమీస్ మ్యాచ్ రద్దైతే..? టీమిండియా నేరుగా..
Also Read
- Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
- Jayashankar Bhupalpally: ఘోర రోడ్డు ప్రమాదం.. DTO పైకి దూసుకెళ్లిన బొగ్గు టిప్పర్.!
- ENG vs NZ: దెబ్బ అదుర్స్ కదూ.. బెంబేలెత్తించిన మ్యాట్ హెన్రీ.. ఇంగ్లాండ్పై న్యూజిలాండ్ భారీ విజయం.!
- Vaibhav Sooryavanshi: అది కేవలం పుకారు మాత్రమే.. దాన్ని కూడా సునాయాసంగా ఆడగలను.! వైభవ్ కీలక వ్యాఖ్యలు..
730 కిలోమీటర్ల నుండి శ్రీశైలం నుండి వీకోట వరకు హాంద్రనీవా కాలువ ద్వారా నీళ్లు తెచ్చాను అని గుర్తుచేసుకున్న చంద్రబాబు.. ఐదేళ్ల వైసీపీ పాలనా కేవలం ఐదు కిలోమీటర్ల పనులు చేశారు.. ఎన్నికల ముందు సినిమా సెట్టింగ్ లు వేసి డ్రామాలు ఆడారని మండిపడ్డారు. హాంద్రీనీవా ద్వారా నీళ్లను కుప్పానికి తీసుకోస్తాను అని హామీ ఇచ్చారు. ఇక, కుప్పానికి ఎయిర్పోర్టు తీసుకొని రావాలి అన్నది నా కల.. కానీ, వైసీపీ నేతలు ఆ కలను నాశనం చేశారని మండిపడ్డారు. వీలైనంత త్వరగా కుప్పానికి విమానాశ్రయం తీసుకొని వస్తాను. ఎయిర్ కార్గ్ ద్వారా మన పంటల్ని విదేశాలకు పంపేలా చూస్తాను.. పది లక్షల ఉత్పత్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తాం.. కుప్పంలో కాడా ఏర్పాటు చేస్తాం.. ప్రత్యేక ఐఎఎస్ అధికారితో అభివృద్ధి చేస్తాను.. కుప్పంలో మరో కొత్త రెండు మండలాలను ఏర్పాటు చేస్తాను.. కుప్పంలో మొత్తం విద్యుత్ బస్సులు నడిచేలా ప్రణాళిక రూపొందించమని చెప్పినట్టు వెల్లడించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Love & war : మూవీ సెట్లో కార్మికుడి మృతి… 50 లక్షలు డిమాండ్
-
SSC CGL 2026: ఎస్ఎస్సీ సీజీఎల్ 12,256 పోస్టులు.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ ఛాన్స్.. వెంటనే అప్లై చేసుకోండి
-
Tollywood : టాలీవుడ్ 2027 మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీస్ ఇవే..
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘోరం.. వారం వ్యవధిలో ఆలయంలో రెండు భారీ స్కామ్లు!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!