Site icon NTV Telugu

CM Chandrababu: ప్రధాని మోడీ, రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Chandrababu

Chandrababu

CM Chandrababu: ఢిల్లీలోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార నివాసానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ విచ్చేశారు. సీఎం చంద్రబాబుతో రైల్వే మంత్రి భేటీ అయ్యారు. ఏపీలోని పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసానికి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చ చేపట్టారు. సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు.

Read Also: BJP: బీజేపీలో చేరిన విశాఖ డెయిరీ పాలకవర్గం

Exit mobile version