BJP: బీజేపీలో చేరిన విశాఖ డెయిరీ పాలకవర్గం
- విశాఖ డెయిరీ అధినేత ఆడారి ఆనంద్ బీజేపీలో చేరిక
- ఆడారి ఆనంద్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పురంధేశ్వరి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: విశాఖ డెయిరీ పాలక వర్గం బీజేపీలో చేరింది. రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో డెయిరీ ఛైర్మన్ ఆడారీ ఆనంద్తో పాటు డైరెక్టర్లు యలమంచిలి మున్సిపల్ ఛైర్పర్సన్ రమాకుమారి బీజేపీ కండువాలను కప్పుకున్నారు. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ఆడారి ఆనంద్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. వారి తండ్రి తో మా నాన్నకు అవినాభావ సంబంధం ఉందన్నారు. పార్టీలోకి వచ్చిన తరువాత సిద్ధాంతం, క్రమశిక్షణ అవలంబిస్తూ వారి ప్రాంతంలో పార్టీని బలోపేతం చెయ్యడానికి కృషి చేయాలని సూచించారు. ప్రధాని మోడీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని, అలాగే దృఢ నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట అంటూ పేర్కొన్నారు.
Read Also: Purandeswari: అట్టడుగు ప్రజలకు న్యాయం చేయడమే బీజేపీ అంతిమ లక్ష్యం
Also Read
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- Shreyas Iyer: వైభవ్ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
- Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
2029 ఎన్నికల్లో కూడా బీజేపీని ప్రజలు ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 11వ ఆర్థిక శక్తి గా ఉన్న దేశాన్ని 5వ ఆర్థిక శక్తిగా ప్రధాని మోడీ తీర్చిదిద్దారన్నారు. అమిత్ షా అంబేడ్కర్ను అవమానించారని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్కు భారత్ రత్న ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అంబేద్కర్ను అవమానించారని అన్నది కేవలం దుష్ప్రచారం మాత్రమేనన్నారు. ట్రైబల్ మహిళను రాష్ట్రపతి చేసిన బీజేపీ.. మహిళలను ఎంతగా గౌరవిస్తుందో ప్రజలు తెలుసుకోవాలన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలకు బీజేపీ శ్రీకారం చుట్టిందన్నారు.
స్వతహాగా బీజేపీలో ప్రజలు చేరుతున్నారని.. 25 లక్షల మంది ప్రజలు పార్టీలో చేరారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి సహాయ సహకారాలు అందజేస్తున్నారన్నారు. చిటికెడు మట్టి కూడా గత ప్రభుత్వం విదల్చలేదని విమర్శించారు. రాష్ట్రానికి పన్ను రాయితీలు, అమరావతి నిర్మాణానికి నిధులు, పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. గడిచిన 5 ఏళ్లలో రాక్షస విధ్వంసకర పాలన చూశామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో కచ్చితంగా ఏపీ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు.
తాజావార్తలు
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
-
Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
-
Shreyas Iyer: వైభవ్ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
-
SC ST Atrocities Act: బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. ఇస్లాంలోకి మారితే SC/ST ఎట్రాసిటీ యాక్ట్ వర్తించదు!
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!