Purandeswari: ఎస్సీలకు సంబంధించి 27 కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Purandeswari: కేంద్రం ఇస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసుకుంటున్నారు.. ఎస్సీలకు సంబంధించి కేంద్రం ఇచ్చిన 27 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. ఏలూరు పర్యటనలో ఉన్న ఆమె.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రెండు మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్లబోతున్నాం.. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంత మేలు చేశాం అనేది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. ఇక, మంత్రి నారాయణ స్వామి వంటి వారు సైతం తనకి రిజర్వేషన్ ఉంది కాబట్టే వైసీపీ పార్టీలో పదవి వచ్చిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. కానీ, వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళను దేశ అత్యున్నత పదవిలో కూర్చోబెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుందన్నారు. గడిచిన పదేళ్లుగా అందరికీ సంక్షేమం అందిస్తూ, అన్ని వర్గాలకు ప్రధాని నరేంద్ర మోడీ న్యాయం చేస్తున్నారని తెలిపారు. వికసిత భారత్ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను జనంలోకి తీసుకు వెళ్తున్నామని వెల్లడించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.
Read Also: Gyanvapi Mosque: నేడు జ్ఞాన్వాపీ ఏఎస్ఐ సర్వే నివేదికపై వారణాసి కోర్టు తుది తీర్పు
Also Read
- Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం