AP Bar Re-Notification: ఏపీలో మిగిలిపోయిన 432 బార్లకు రీ–నోటిఫికేషన్.. ఈనెల 15న లక్కీ డ్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Bar Re-Notification: ఏపీ ప్రభుత్వం కొత్త బార్ పాలసీ 2025–28లో భాగంగా మిగిలిపోయిన 432 బార్లకు ఎక్సైజ్ శాఖ రీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ 432 బార్లలో 428 ఓపెన్ కేటగిరీ బార్లు, 4 రిజర్వ్ కేటగిరీ గీతకుల బార్లు ఉన్నాయి. సెప్టెంబర్ 14, 2025 సాయంత్రం 6 గంటల వరకు ఉంది దరఖాస్తులు చేసుకోడానికి అవకాశం ఉంది. లక్కీ డ్రా సెప్టెంబర్ 15 ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్లు నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా చూస్తే గుంటూరు జిల్లా 67, విశాఖపట్నం 63, ఎన్టీఆర్ జిల్లా 61, నెల్లూరులో 33, పళ్నాడులో 30, తూర్పు గోదావరిలో 16 బార్లు రీ నోటిఫై అయ్యాయి. మిగతా జిల్లాల్లో అనకాపల్లి 2, అనంతపురం 9, కాకినాడ 12, కోనసీమ 9, శ్రీకాకుళం 14, విజయనగరం 15, పశ్చిమ గోదావరి 13 బార్లు సహా మొత్తం 432 బార్లు రీ నోటిఫై అయ్యాయి. మొత్తం జిల్లాల వారీగా ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్ గెజిట్ నోటిఫికేషన్లు విడుదల అవుతాయి. వాటి ఆధారంగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎంపిక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, SOP ప్రకారం నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
READ ALSO: CM Revanth Reddy : వైఎస్సార్ స్ఫూర్తితోనే మా పాలన.. ఆయన ఆశయాలను కొనసాగిస్తాం
Also Read
- Lucknow Tragedy: లక్నో విషాదంపై కన్నీళ్లు పెట్టుకున్న డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్
- Fast Food Side Effects: పళ్ల సమస్యల నుంచి క్యాన్సర్ వరకు.. ఫాస్ట్ ఫుడ్ ప్రభావం.. నిపుణుల హెచ్చరిక
- ICC Rules: వెస్టిండీస్ స్టార్ ‘ఎఫీ ఫ్లెచర్’ స్ఫూర్తితో.. మహిళా క్రికెటర్లకు ఐసీసీ భారీ ఊరట..
- Minister Ramprasad Reddy: ఇక డీజిల్ బస్సులకు గుడ్బై..! త్వరలో 700 ఎలక్ట్రిక్ బస్సులు..
ఏపీ ప్రభుత్వం కొత్త బార్ పాలసీని ప్రకటించిన విషయం తెలిసిందే.. రాష్ట్రవ్యాప్తంగా ఓపెన్ కేటగిరీలో 840 బార్లు ఉన్నాయి.. వీటిలో 10 శాతం రిజర్వ్ కేటగిరీలో కల్లు గీత కార్మికులకు 84 బార్లు కేటాయించారు. బార్ల కేటాయింపును పారదర్శకత కోసం లాటరీ విధానం అమలు చేసింది ప్రభుత్వం.. 5 లక్షల ఫీజ్తో నాలుగు దరఖాస్తులు తప్పనిసరిగా ఇవ్వాలి అనే నిబంధన పెట్టారు.. దీంతో పాటు బార్ లకు సరఫరా చేసే మద్యంలో అదనంగా 15 శాతం రిటైల్ సుంకం చెల్లించాల్సి ఉంది.. దీని వల్ల ఒక్కో లైసెన్సికి అదనంగా 30 లక్షలు భారం పడనుంది.. పర్మిట్ రూమ్లకు కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. 840 బార్లకు కేవలం 466 మాత్రమే దరఖాస్తులు పెట్టుకున్నారు.. మిగిలిన వాటికి ప్రభుత్వం తాజాగా రీ-నోటిఫికేషన్ జారీ చేసింది.
READ ALSO: Shehbaz Sharif: ఇండియా-రష్యా సంబంధాలపై పాక్ ప్రధాని కీలక కామెంట్స్..
తాజావార్తలు
-
Veerabhadruni Rahasyam : గుడి గంట మోగితే శవం లేవాల్సిందేనా? ఓటీటీలోకి భయపెట్టే ‘వీరభద్రుని రహస్యం’
-
Lucknow Tragedy: లక్నో విషాదంపై కన్నీళ్లు పెట్టుకున్న డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్
-
Fast Food Side Effects: పళ్ల సమస్యల నుంచి క్యాన్సర్ వరకు.. ఫాస్ట్ ఫుడ్ ప్రభావం.. నిపుణుల హెచ్చరిక
-
Chiru 158 : “జీవించేశారు అన్నయ్యా!”.. మెగాస్టార్ యాక్టింగ్కు డైరెక్టర్ బాబీ ఎమోషనల్
-
ICC Rules: వెస్టిండీస్ స్టార్ ‘ఎఫీ ఫ్లెచర్’ స్ఫూర్తితో.. మహిళా క్రికెటర్లకు ఐసీసీ భారీ ఊరట..
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!