Digital Attendance in AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి అసెంబ్లీలో హాజరు పుస్తకం ఉండదని.. డిజిటల్ అటెండెన్స్ ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు స్పీకర్ అయ్యన్న… ఇకపై అసెంబ్లీకి హాజరైన ఎమ్మెల్యేలు హాజరు డిజిటల్ పద్ధతిలో నమోదు చేయాలని అసెంబ్లీ అధికారులకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశాలు ఇచ్చారు.. దీంతో, ఇకపై రిజిస్టర్ లో హాజరు పద్ధతి ఉండదని.. ఎమ్మెల్యేలకు బులిటెన్ విడుదల చేశారు అసెంబ్లీ సెక్రెటరీ జనరల్ ప్రసన్న కుమార్…
Read Also: AP Assembly Budget Sessions 2026: రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాం.. వైఎస్ జగన్ కూడా వస్తారు..
అయిటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు రాకుండానే హాజరు పట్టికలో సంతకం చేస్తున్నారని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి.. వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు అసెంబ్లీ లోపలికి రాకుండా సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారనే చర్చ జరుగుతోంది… ఇలాంటి సమయంలో డిజిటల్ అటెండెన్స్ పై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.. కాగా, రేపు అసెంబ్లీకి హాజరుకావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ఎల్లుండి నుంచి సభకు హాజరయ్యే విషయంపై క్లారిటీ రాకపోయినా.. రేపు వైఎస్ జగన్ కూడా అసెంబ్లీకి హాజరవుతారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన విషయం విదితమే..