Nara Lokesh: నవ్వుకుంటున్నారు.. దేని మీద పోరాడుతున్నారో కనీసం క్లారిటీ ఉండాలి!
- ఏపీ శాసనమండలి సమావేశాలు మొదలు
- పేరు మార్చటంపై అందరూ నవ్వుకుంటున్నారు
- ఎందుకు బకాయిలు పెట్టారో చర్చకు సిద్ధమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఫీజు పోరు’ అని ముందుగా పేరు పెట్టి.. ఆ తర్వాత ‘యువత పోరు’ అని పేరు మార్చటంపై జనాలు నవ్వుకుంటున్నారని మంత్రి నారా లోకేష్ వైసీపీపై సెటైర్లు వేశారు. అసలు వైసీపీ వాళ్లకు దేని మీద పోరాడుతున్నారో కనీసం క్లారిటీ ఉండాలి కదా? అని ఎద్దేవా చేశారు. స్వల్పకాలిక ప్రశ్నోత్తరాల సమయంలో అన్ని విషయాలు మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై మాట్లాడేందుకు తాము సిద్ధం అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఏపీ శాసనమండలి సమావేశాలు ఈరోజు మొదలయ్యాయి. నిరుద్యోగ భృతి విడుదల, యువతకు ఉద్యోగాల కల్పన, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశంపై చర్చించాలని వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం చేశారు. వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్వల్పకాలిక ప్రశ్నోత్తరాల సమయంలో అన్ని విషయాలు మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై మాట్లాడేందుకు సిద్ధం అని మంత్రి నారా లోకేష్ చెప్పారు.
Also Read
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
- GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
‘ఫీజు పోరు అని ముందుగా పేరు పెట్టి.. ఆ తర్వాత యువత పోరు అని పేరు మార్చటంపై అందరూ నవ్వుకుంటున్నారు. అసలు వైసీపీ వాళ్లకు అయినా దేని మీద పోరాడుతున్నారో ఓ క్లారిటీ ఉండాలి. గతంలో ఫీజులు రూ.4500 కోట్లు బకాయిలు పెట్టారు.. ఇప్పుడు ధర్నా అంటారు. వారే కరెంట్ చార్జీలు పెంచారు.. మరలా వాళ్లే ధర్నా అంటారు. ఎందుకు బకాయిలు పెట్టారో చర్చకు సిద్ధమా?. ఫీజు రీయింబర్స్మెంట్ పైన మాట్లాడతాం. గత ప్రభుత్వం వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయాయో చర్చిద్దాం’ అని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. ఆపై నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని వైసీపీ సభ్యుల నినాదాలు చేశారు. సభ్యులు ఎంతకీ నినాదాలు ఆపకపోవటంతో చైర్మన్ మండలిని 10 నిమిషాలు వాయిదా వేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!