Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ap Assembly Budget Sessions 2024 Live Updates

AP Budget LIVE UPDATES: ఏపీ బడ్జెట్‌ సమావేశాలు.. లైవ్ అప్‌డేట్స్

NTV Telugu Twitter
Published Date :February 7, 2024 , 8:14 am
By Mahesh Jakki
AP Budget LIVE UPDATES: ఏపీ బడ్జెట్‌ సమావేశాలు.. లైవ్ అప్‌డేట్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP Budget LIVE UPDATES: ఏపీ ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఏపీలో మరో 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. మూడు నెలల కాలానికి అంటే జూన్ వరకూ ప్రభుత్వం చేయబోయో ఖర్చులకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దయం 11 గంటల 3 నిమిషాలకు 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను సభలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఇదిలా ఉండగా సభలో మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్జేయుకేటీ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు -2024, ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ (బదిలీ నిషేధ సవరణ) బిల్లు -2024 ఏపీ ఉద్యోగుల నియామకాలు, క్రమబద్ధీకరణ, రేషనైజేషన్ సంబంధిత సవరణ బిల్లు -2024 (రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీస్ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టాఫ్ పాటర్న్స్ అండ్ పే స్ట్రక్చర్ సవరణ బిల్లు)లను సర్కారు ప్రవేశపెట్టనుంది.

 

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ ప్రసంగం

 

The liveblog has ended.
  • 07 Feb 2024 01:12 PM (IST)

    ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

    ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. మండలిలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రవేశపెట్టారు. అనంతరం ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.

  • 07 Feb 2024 01:10 PM (IST)

    ఐదేళ్లలో 4 లక్షల 95 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం: మంత్రి బుగ్గన

    పంపిణీ నష్టాలు లేకుండా ఉండేందుకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నాం.

    ఏపీలో తలసరి విద్యుత్ వినియోగం బాగా పెరిగింది.

    ప్రస్తుతం ఏడాదికి 1400 యూనిట్ల తలసరి వినియోగం ఉంది.

    ఏపీలో 2019 నుంచి 311పైగా భారీ మెగా పరిశ్రమలు 5,995 కోట్ల పెట్టుబడిని తెచ్చాయి.

    సింగిల్ విండో ద్వారా 54,292 దరఖాస్తులను పరిష్కరించి అనుమతులు ఇచ్చాం.

    సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం.

    రాష్ట్రంలో 55 కొత్త క్లస్టర్లను గుర్తించాం.

    ఏపీకి 65 కొత్త ఐటీ కంపెనీలు వచ్చాయి.

    అదానీ డేటా సెంటర్ సహా వేర్వేరు పరిశ్రమలు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి.

    జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ల కింద 1426 ఎకరాల్లో ఎంఐజీ లేఅవుట్ల అభివృద్ధి.

    రీసర్వే లాంటి భూసంస్కరణల ద్వారా భూభద్ర ఆంధ్రాను సాధించాం.

    ఇప్పటి వరకూ 17 లక్షల 53 వేల మంది రైతులకు శాశ్వత భూహక్కు పత్రాలు ఇచ్చాం.

    45 వేలకు పైగా భూ సరిహద్దు వివాదాలు పరిష్కరించగలిగాం.

    గడచిన ఐదేళ్లలో 4 లక్షల 95 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం.

    ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాం.

  • 07 Feb 2024 12:50 PM (IST)

    పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి బుగ్గన

    ఐదేళ్ల కాలంలో 30 లక్షల పైచిలుకు ఇళ్లపట్టాల పంపిణీ చేసి సంక్షేమాంధ్రగా ఏపీని మార్చాం.

    నగదు బదిలీ ద్వారా 2.53 లక్షల కోట్లను పంపిణీ చేశాం.

    తలసరి ఆదాయం రూ.2,19,518లతో దేశంలోనే 9 ర్యాంక్ లో ఏపీ నిలిచింది.

    పెన్షన్ కానుక ద్వారా 84 వేల కోట్లను అందించాం.

    ఐదేళ్లలో ప్రజా పంపిణీలో ఇంటిముంగిటకే సరకులను పంపేలా సంచార పంపిణీ వాహనాలు పెట్టాం.

    తద్వారా బీసీ ఎస్సీ,ఎస్టీ యువతకు ఉపాధి కూడా దొరికింది.

    5 ఏళ్లుగా రాష్ట్ర రహదారుల అభివృద్ధికి 2,626 కోట్లు ఖర్చు చేశాం.

    2019 వరకూ రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలను పెంచి వైసీపీ ప్రభుత్వం 17 కొత్త కళాశాలలను నిర్మించింది.

    పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది.

    ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం.

  • 07 Feb 2024 12:12 PM (IST)

    దేశంలోనే ఆక్వా హబ్ గా ఏపీ..

    వైద్యారోగ్య రంగంలో నాడు నేడు పథకం అమలు చేశాం..ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ 16,852 కోట్లు వ్యయం చేశాం.. ఫ్యామిలీ డాక్టర్ అనే వినూత్న కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుబాటులో వైద్యం తెచ్చాం.. 53.58 లక్షల మంది రైతులకు 33,300 కోట్ల రూపాయల మేర రైతు భరోసా ఆర్ధిక సాయం అందించాం.. 10,778 రైతు భరోసా కేంద్రాలు ఒన్ స్టాప్ సెంటర్లుగా ఏర్పాటు చేశాం.. రూ. 3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం.. ఆక్వా ఉత్పత్తిని మరింత పెంచేలా 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం.. 2 వేలకు పైగా ఫిష్ ఆంధ్రా రీటైల్ దుకాణాలు స్థాపించాం.. తద్వారా ఏపీ దేశంలోనే ఆక్వాహబ్ గా తయారైంది

  • 07 Feb 2024 11:58 AM (IST)

    పథకాలకు కేటాయింపులు

    వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితి రూ. 25 లక్షలకు పెంపు.. 201 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో వర్చువల్ ల్యాబ్ లు, క్లాస్ రూమ్స్.. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా రూ. 26, 067 కోట్ల వ్యయం.. వైఎస్ఆర్ ఆసరా పథకం కోసం రూ. 25, 571 కోట్లు ఖర్చు.. వైఎస్ఆర్ చేయూత పథకం కోసం రూ. 14, 129 కోట్లు చెల్లింపు.. జగనన్న పాలవెల్లువ పథకం కోసం రూ. 2697 కోట్లు ఖర్చు.. రైతు భరోసాతో 53 లక్షల మంది ఖాతాల్లో రూ. 33 వేల 300 కోట్లు జమ.. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాతో 54 లక్షల 59 వేల మంది రైతులకు రూ. 7, 802 కోట్లు..

  • 07 Feb 2024 11:53 AM (IST)

    అంగన్ వాడీల అభివృద్ది..

    14, 255 అంగన్ వాడీ కేంద్రాలను మరింత మెరుగుపర్చాం.. 4470 ప్రాథమిక స్కూళ్ల పరిధిలోకి అంగన్ వాడీలను తీసుకొచ్చాం..

  • 07 Feb 2024 11:51 AM (IST)

    2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,05,352 కోట్లు రెవెన్యూ రాబడి!

    అమరావతి: 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,05,352 కోట్లు రెవెన్యూ రాబడి వస్తుందని అంచనా.

    కేంద్ర పన్నుల ద్వారా రూ. 49,286 కోట్ల మేర వస్తుందని అంచనా.

    రాష్ట్ర పన్నుల ద్వారా రూ.1,09,538 కోట్లు వస్తుందని అంచనా.

    పన్నేతర ఆదాయంగా రూ. 14,400 కోట్లు.

    గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా రూ.32,127 కోట్లు వస్తుందని అంచనా.

    బహిరంగ మార్కెట్ ద్వారా రూ.71వేల కోట్లను రుణ సేకరణ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.

    కేంద్రం నుంచి రూ. 61,642 కోట్లు రుణం తీసుకోవాలని యోచిస్తున్న ప్రభుత్వం.

    ఇతర మార్గాల ద్వారా మరో రూ.25 వేల కోట్ల అప్పు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదన.

  • 07 Feb 2024 11:50 AM (IST)

    నాణ్యమైన ఆహారం, ఆరోగ్య సేవలు..

    నాడు- నేడు కింద 56, 703 స్కూల్స్, కాలేజీల్లో వసతులు మెరుగుపరిచారు.. జగనన్న గోరుముద్ద కింద 43 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం.. జగనన్న గోరుముద్ద పథకానికి ఏటా రూ. 1910 కోట్లు ఖర్చు.. ఫ్యామిలీ డాక్టర్ కింద మండలానికో 108, 104 సర్వీసులు..

  • 07 Feb 2024 11:42 AM (IST)

    పోషకాహారం కోసం..

    రక్తహీనతతో బాధపడే గర్భిణీల సంఖ్య గతంలో కంటే తగ్గింది.. పోషకాహారం కోసం గతం కంటే 4 రెట్లు ఎక్కువగా ఖర్చు చేశాం..

  • 07 Feb 2024 11:40 AM (IST)

    డ్రాపౌట్స్ తగ్గాయి..

    విదేశీ ఉన్నత విద్యా పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నాం.. ఉన్నత విద్యలో 6.62 శాతానికి తగ్గిన డ్రాపౌట్ శాతం.. ఏటా 47 లక్షల విద్యార్థులకు ప్రీ-స్కూల్ కిట్లు పంపిణీ చేస్తున్నాం.. 99.81 శాతం స్కూళ్లలో కనీసం మౌలిక సదుపాయాలు అందించాం..

  • 07 Feb 2024 11:39 AM (IST)

    అందరికీ సమానంగా పాలన అందాలనే వికేంద్రీకరణ చేశాం: మంత్రి బుగ్గన

    వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అంబేద్కర్ లాంటి దార్శనికుల ఆలోచనలతో మా ప్రభుత్వం పాలన సాగిస్తోంది: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

    రాష్ట్ర సమస్యల్ని పాత, మూసపద్ధతులతో కాకుండా సరికొత్త విధానాల్ని అవలంభించాం.

    పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌరసేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా మా ప్రభుత్వ చర్యలు.

    పాలనా విభాగాలను పునర్వవస్థీకరించి అన్ని వర్గాల వారికీ సాధికారిత అందించాం.

    విద్యార్ధులను ప్రపంచస్థాయి పోటీకి సిద్ధం చేసేలా ఆంగ్ల మాద్యమ విద్యను మా ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

    1000 పాఠశాలల్లోని 4,39,395 మంది విద్యార్దులను సీబీఎస్ ఈ పరిధిలోకి తీసుకువచ్చాం.

    అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ పాఠ్యప్రణాళిక, ప్రతీ విద్యార్ధికి టోఫెల్ ధృవీకరణ పత్రాన్ని అందించేలా ప్రయత్నం.

    కొత్త పారిశ్రామిక విధానంతో సంపన్న ఆంధ్రా, రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ చట్టాలతో భూభద్ర ఆంధ్రాగా ఏపీ మారింది.

    ఇప్పటి వరకూ ఎవరూ చేయని పనులు మా ప్రభుత్వం చేసింది.

    సుపరిపాలన ఆంధ్ర, సామర్ధ్య ఆంధ్ర, మహిళా మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర ,భూభద్ర ఆంధ్రను సాధించాం

    పాలనా పరమైన పునర్నిర్మాణంలో భాగంగా 13 కొత్త జిల్లాలు, 26 కొత్త రెవెన్యూ డివిజన్లు, పోలీసు డివిజన్లు ఏర్పాటు.

    కొత్త రెవెన్యూ, పోలీసు డివిజన్లను కుప్పంలో కూడా ఏర్పాటు చేశాం.

    అందరికీ సమానంగా పాలన అందాలనే వికేంద్రీకరణ చేశాం.

    గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా రూ.2356 కోట్లతో పనులు చేపట్టాం.

    సామర్ధ్య ఆంధ్రా ద్వారా మానవ వనరులపై పెట్టుబడి పెడుతున్నాం.

    మానవ మూలధన అభివృద్ధికి గత ఐదేళ్లుగా ప్రాధాన్యతా క్రమంలో పెట్టుబడి

    ఐఎఫ్ పీ ప్యానెళ్లు ట్యాబ్ లను అందించటం ద్వారా బోదన, అభ్యాస ఫలితాలు మెరుగయ్యాయి.

    4 వ తరగతి నుంచి 12 తరగతి వరకూ 34.30 లక్షల మంది విద్యార్ధులు మరింత ప్రతిభావంతులయ్యారు.

    నాడు నేడు ద్వారా ఐదేళ్లలో 99.81 శాతం పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు అందించాం.

    మొత్తం 7,163 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం.

    సంపూర్ణ పోషణ, గోరుముద్ద పథకాల ద్వారా పోషణా లోపాన్ని 2023 నాటికి 6.84 శాతానికి తగ్గించాం.

    విదేశీ విద్యాదీవెన ద్వారా 1,858 మంది విద్యార్ధులకు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య ఇచ్చాం.

  • 07 Feb 2024 11:38 AM (IST)

    మానవ వనరుల అభివృద్దే లక్ష్యం..

    మావన మూలధన అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత.. పరిపూర్ణ మానవ వనరుల అభివృద్దే లక్ష్యంగా సామర్థ్య ఆంధ్ర..

  • 07 Feb 2024 11:36 AM (IST)

    ప్రతి విద్యార్థులకి టోఫెల్ శిక్షణ

    ప్రతి విద్యార్థికి టోఫెల్ ధృవీకరణ పత్రం ఇచ్చేలా చర్యలు.. విద్యా ప్రమాణాల మెరుగు కోసం 9,52,927 ట్యాబ్ ల పంపిణీ.. 34 లక్షల 30 వేల మంది విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచాం.. వెయ్యి స్కూళ్లలో సీబీఎస్ఐ సిలబస్..

  • 07 Feb 2024 11:34 AM (IST)

    గడపగడపకు మా పాలన..

    లక్ష 35వేల మంది ఉద్యోగాలతో గ్రామ సచివాలయాల ఏర్పాటు.. రెండున్నర లక్షల మంది వాలంటీర్లతో గడపగడపకూ పాలన

  • 07 Feb 2024 11:21 AM (IST)

    రూ. 2,86, 389 కోట్లతో వార్షిక బడ్జెట్‌

    *అమరావతి: 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,86, 389 కోట్లతో బడ్జెట్‌.

    *రూ. 2,30,110 కోట్లు రెవెన్యూ వ్యయం.

    *రూ. 30, 530 కోట్ల మూలధథన వ్యయం.

    *రూ.24, 758 కోట్ల రెవెన్యూ లోటు .

    *రూ. 55,817 కోట్ల ద్రవ్యలోటు.

    *రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.51 శాతం ద్రవ్యలోటు.

    *జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు 1.56 శాతం.

  • 07 Feb 2024 11:07 AM (IST)

    ఏపీ అసెంబ్లీలో 2024-25 ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌

    అమరావతి: ఏపీ అసెంబ్లీలో 2024-25 ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రవేశపెడుతున్నారు. మహాత్మగాంధీ సందేశంతో బడ్జెట్‌ ప్రసంగాన్ని  మంత్రి బుగ్గన ప్రారంభించారు. ఐదేళ్లుగా బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందని.. మేనిఫెస్టోను సీఎం జగన్‌ పవిత్ర గ్రంథంగా భావించారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.

     

     

     

  • 07 Feb 2024 10:53 AM (IST)

    టీడీపీ ఎమ్మెల్యేలు గందరగోళం సృష్టిస్తున్నారు: మంత్రి చెల్లుబోయిన

    ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ మాట్లాడారు. ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు జవాబుదారిగా పని చేయాలని మంత్రి తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు జరిగిన మంచిని చెప్తుంటే వినలేక వెళ్లిపోయే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల్ని ఆదుకోవడంలో వారి పాత్ర శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో కనిపించాలని గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. విఫల ప్రతిపక్షం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా అంటూ ప్రశ్నించారు.

  • 07 Feb 2024 10:25 AM (IST)

    మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు.

    ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమైంది. మంత్రిమండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024–25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదించింది.నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చరల్‌ పుడ్‌ ప్రాసెసింగ్‌ పాలిటెక్నిక్‌ కాలేజ్‌ ఏర్పాటుకు ఆమోదం మంత్రి మండలి తెలిపింది. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్శిటీ పరిధిలో హార్టికల్చరల్‌ పాలిటెక్నికల్‌ కళాశాల పని చేయనుంది.

    నంద్యాల జిల్లా డోన్‌లో వ్యవసాయ రంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్శిటీ పరిధిలో అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల పని చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రేవేట్‌ యూనివర్శిటీస్‌ (ఎస్టాబ్లిస్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) యాక్ట్‌ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్‌ ఫీల్డ్‌ కేటగిరిలో మూడు ప్రైవేట్‌ యూనివర్శిటీలకు అనుమతి లభించింది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, రాజమండ్రిలో గోదావరి గ్లోబల్‌ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో 05–02–2024 నాడు ఉభయ సభలను ఉద్దేశించి ద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌ ప్రసంగానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

  • 07 Feb 2024 10:05 AM (IST)

    మూడు బిల్లులను ఆమోదించిన ఏపీ అసెంబ్లీ

    మూడు బిల్లులను ఆమోదించిన ఏపీ అసెంబ్లీ

    1. ఆర్జేయూకేటీ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు -2024

    2. ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ (బదిలీ నిషేధ సవరణ) బిల్లు -2024

    3. ఏపీ ఉద్యోగుల నియామకాలు, క్రమబద్ధీకరణ, రేషనైజేషన్ సంబంధిత సవరణ బిల్లు -2024 (రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీస్ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టాఫ్ పాటర్న్స్ అండ్ పే స్ట్రక్చర్ సవరణ బిల్లు)

  • 07 Feb 2024 09:32 AM (IST)

    అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

    అమరావతి: అసెంబ్లీ నుంచి ఒకరోజు పాటు టీడీపీ సభ్యుల సస్పెన్షన్.. రెడ్ లైన్ దాటి స్పీకర్ పోడియం ఎక్కిన టీడీపీ సభ్యులు.. వాయిదా తీర్మానం పై పట్టుబట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు.. స్పీకర్ పై కాగితాలు చించి విసిరిన టీడీపీ సభ్యులు.. రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలంటూ నినాదాలు.. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే సభలో పలు బిల్లులకు ఆమోదం.

  • 07 Feb 2024 09:05 AM (IST)

    మూడో రోజు అసెంబ్లీ ప్రారంభం.. టీడీపీ వాయిదా తీర్మానం తిరస్కరణ

    మూడో రోజు ఏపీ అసెంబ్లీ ప్రారంభమైంది. రైతు సమస్యలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఈ నేపథ్యంలో పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు.రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే సభలో పలు బిల్లులకు ఆమోదం తెలిపారు.

  • 07 Feb 2024 08:31 AM (IST)

    సెక్రటేరియట్ చేరుకున్న సీఎం జగన్.. కేబినెట్‌ భేటీ ప్రారంభం

    ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సెక్రటేరియట్ చేరుకున్నారు. సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగే కేబినెట్‌ భేటీ ప్రారంభమైంది. ఈ భేటీలో బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు.

  • 07 Feb 2024 08:21 AM (IST)

    బడ్జెట్‌లో సంక్షేమానికే పెద్ద పీట: మంత్రి బుగ్గన

    బడ్జెట్‌లో సంక్షేమానికే పెద్ద పీట వేస్తున్నామని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ స్పష్టం చేశారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథం గా భావించిన రాజకీయ పార్టీ వైసీపీ, రాజకీయ నాయకుడు జగన్ అని మంత్రి వెల్లడించారు. 99 శాతం హామీలను శాచ్యురేషన్ పద్ధతిలో అమలు చేశామన్నారు. ఇలా అమలు చేయటంలో జగన్ విధానాలే ఇతర రాజకీయ పార్టీలకు ఒక బెంచ్ మార్క్ అయ్యిందన్నారు. కొవిడ్ లేకపోతే అభివృద్ధికి మరింత అవకాశం ఉండేదన్నారు.

    కొన్ని పరిమితులు ఉన్నాయని.. బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గత ఐదేళ్ళల్లోనూ వైద్యం, విద్యా, వ్యవసాయం, మహిళా, వృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. రోడ్ల మరమ్మతులు, మౌలిక సదుపాయాలు కల్పనపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర సానుకూల సంబంధాల ద్వారా పరిష్కర దిశగా తీసుకుని వచ్చామన్నారు. గతంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది.. అయినా చాలా అంశాలు సాధించుకోలేక పోయారన్నారు.

  • 07 Feb 2024 08:16 AM (IST)

    కాసేపట్లో కేబినెట్ భేటీ.. సచివాలయం చేరుకున్న ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన

    కాసేపట్లో కేబినేట్‌ భేటీ జరగనుంది. బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదించనుంది. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సచివాలయం చేరుకున్నారు. తన ఛాంబర్ లో బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజ చేశారు. అనంతరం నేరుగా క్యాబినెట్ భేటీకి బుగ్గన వెళ్లారు. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతులతో క్యాబినెట్ సమావేశానికి  బుగ్గన చేరుకున్నారు.

     

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • AP Assembly
  • AP assembly Budget sessions
  • AP Assembly LIVE UPDATES
  • AP Assembly Sessions

ట్రెండింగ్‌

  • Moto g86 Series: మోటొరోలా నుంచి మోటో G86 పవర్ 5G, మోటో G86 5G, మోటో G56 5G మూడు కొత్త 5G ఫోన్లు లాంచ్…!

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions