NIA Raids: ఆరు రాష్ట్రాల్లోని 100 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA Raids: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్లోని ఆరు రాష్ట్రాల్లోని 100కి పైగా సోదాలు నిర్వహించింది. వివిధ ఉగ్రవాద గ్రూపులతో గ్యాంగ్స్టర్లకు, డ్రగ్స్ స్మగ్లింగ్ మాఫియాకు ఉన్న సంబంధాలపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ దాడులు చేపట్టింది. రాష్ట్ర పోలీసు బలగాలతో సన్నిహిత సమన్వయంతో ఉగ్రవాద నిరోధక సంస్థ బుధవారం తెల్లవారుజాము నుంచి పలు ప్రాంతాలు, అనుమానితులతో సంబంధం ఉన్న ఇతర ప్రదేశాలలో ఈ దాడులు నిర్వహించింది. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. గత ఏడాది ఎన్ఐఏ దాఖలు చేసిన మూడు వేర్వేరు కేసులకు సంబంధించి ఈ దాడులు నిర్వహించబడుతున్నాయి.
2022 మేలో మొహాలిలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ హెడ్క్వార్టర్స్పై ఆర్పీజీ దాడిలో ప్రధాన షూటర్ దీపక్ రంగా అనే వ్యక్తిని ఈ ఏడాది జనవరి 25న ఏజెన్సీ ఓ కేసులో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో అరెస్టు చేసింది. కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్గా మారిన ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ సంధు అలియాస్ లాండాకు, పాకిస్థాన్కు చెందిన గ్యాంగ్స్టర్-టెర్రరిస్ట్ హర్విందర్ సింగ్ సంధు అలియాస్ రిండాకు సన్నిహితుడు. మేలో ఆర్పీజీ దాడిలో ప్రమేయంతో పాటు, దీపక్ హింసాత్మక హత్యలతో సహా అనేక ఇతర హింసాత్మక ఉగ్రవాద, క్రిమినల్ నేరాలలో పాల్గొన్నాడు. అతను రిండా, లాండా నుంచి తీవ్రవాద నిధులు, లాజిస్టికల్ మద్దతును చురుకుగా పొందుతున్నాడు.
Also Read
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
- Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
Read Also: Trimbakeshwar Temple: త్రయంబకేశ్వర్ ఆలయంలోకి ప్రవేశించిన నలుగురు ముస్లిం యువకులు అరెస్ట్
2022 సెప్టెంబర్ 20న ఎన్ఐఏ సుమోటోగా కేసు నమోదు చేసింది. విదేశాల్లోని ఉగ్రవాద సంస్థలు దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో పనిచేస్తున్న వ్యవస్థీకృత క్రిమినల్ గ్యాంగ్ల నాయకులు, సభ్యులతో కలిసి లక్ష్యంగా హత్యలు, హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నాయని తేలింది. టెర్రర్-గ్యాంగ్స్టర్-డ్రగ్ స్మగ్లర్ నెట్వర్క్ ఆయుధాలు, మందుగుండు పేలుడు పదార్థాలు, ఐఈడీలు మొదలైన టెర్రరిస్ట్ హార్డ్వేర్లను సరిహద్దుల గుండా అంతర్-రాష్ట్ర నెట్వర్క్ ద్వారా అక్రమ రవాణాలో నిమగ్నమై ఉన్నట్లు కూడా బయటపడింది. వివిధ ఉగ్రవాద గ్రూపులతో గ్యాంగ్స్టర్లకు, డ్రగ్స్ స్మగ్లింగ్ మాఫియాకు ఉన్న సంబంధాలపై కొనసాగుతున్న దర్యాప్తులో మూడు క్రిమినల్ కేసులను నమోదు చేసినప్పటి నుంచి ఎన్ఐఏ 19 మందిని అరెస్ట్ చేసింది. కెనడాకు చెందిన అర్ష్ డల్లాను ఈ ఏడాది జనవరి 9న హోం మంత్రిత్వ శాఖ ‘వ్యక్తిగత ఉగ్రవాది’గా ప్రకటించింది.
తాజావార్తలు
-
Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
-
Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
-
Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!