Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 4 సిక్సర్లు కొట్టి మరే క్రికెటర్ చేయలేని పని చేశాడు. న్యూజిలాండ్పై 40 బంతుల్లో 46 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అందులో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. దీంతో రోహిత్ శర్మ ఓ ప్రత్యేకమైన జాబితాలో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు. నిజానికి ఒక క్యాలెండర్ ఇయర్లో 50 సిక్సర్లు బాదిన మూడో బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ ఏడాది ఇప్పటివరకు రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్లో 52 సిక్సర్లు బాదాడు. రోహిత్ శర్మ కంటే ముందు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ మాత్రమే ఒక క్యాలెండర్ ఇయర్లో 50 సిక్సర్ల ఫీట్ సాధించారు.
Read Also: Illicit Relationship: కూతురి అత్తగారితో లేచిపోయిన వ్యక్తి.. చివరకు..
దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ తొలిసారిగా ఈ ఘనత సాధించాడు. 2015లో ఏబీ డివిలియర్స్ 59 సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత వెస్టిండీస్ మాజీ ఆటగాడు క్రిస్ గేల్ ఒక క్యాలెండర్ ఇయర్లో 50 సిక్సర్ల ఫీట్ సాధించాడు. 2019లో క్రిస్ గేల్ 56 సిక్సర్లు కొట్టాడు.
Read Also: Pawan Kalyan: వంగవీటి రాధా పెళ్లిలో పవన్.. ఫోటో వైరల్
ప్రపంచకప్ 2023లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రాణిస్తున్నాడు. ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచ్ల్లో 311 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ సగటు 62.00 ఉంది. మరోవైపు రోహిత్ శర్మ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో పాకిస్తాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. అతను 4 మ్యాచ్ల్లో 98.00 సగటుతో 294 పరుగులు చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర ఉన్నాడు. రచిన్ రవీంద్ర 5 మ్యాచ్ల్లో 72.50 సగటుతో 290 పరుగులు చేశాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 5 మ్యాచ్ల్లో 141.00 సగటుతో 282 పరుగులు చేశాడు.
